స్వర్గంలో ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గానికి రావడం ధర్మవిరుద్ధమనీ, అయినా శాపంతో వచ్చిన నీకు ఎట్టి పరిస్థితులలోనూ స్వర్గంలో స్థానంలేదనీ త్రిశంకువును తిరిగి భూమ్మీదకు తలకిందులుగా వెళ్ళమని ఆదేశిస్తాడు. పట్టుదలతో మనిషి ఏదైనా సాధించగలడనేది ఎంత వాస్తవమో, మొండిపట్టు మాత్రం జీవితాలను అల్లకల్లోలం చేస్తుందనేది అంతే వాస్తవం. మనం ఏ పని చేసినా నలుగురూ మెచ్చేదై ఉండాలి. ఆ పని వల్ల ఎవరూ లాభపడకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరూ నొచ్చుకోకూడదు. పట్టుదల ఉన్నతమైన జీవితాన్ని నిర్దేశించాలే కానీ జీవితధర్మాన్నే మార్చేయకూడదు. కానీ కొన్నిసార్లు పట్టుదలతో, స్వీయకృషితో అద్భుత ఫలితాలు లభిస్తే, మరికొన్నిసార్లు మొండిపట్టు అవమానభారంతో ఎలాగైనా చేసి తీరాలనే కసితో తలపెట్టే పనులు కూడా అద్భుతాలై నిలుస్తాయి. ఆ క్రమంలో అసహనతలూ, అవమానాలూ, అనాలోచిత నిర్ణయాలూ మనపై, మనం చేసే పనిపై ప్రభావం చూపించి మనల్ని మరింత కుంగదీసే ప్రయత్నం చేస్తాయి. అందుకనే మొండిపట్టుతో ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచించి ముందడుగు వేయాలి. ప్రపంచం ఏమనుకున్నా తట్టుకునే తెగింపుకావాలి. ఒక్కోసారి మొండిపట్టు కూడా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందనే నిరూపణకు ప్రతీకగా నిలువాలి. అటువంటి నిరూపణకు నిదర్శనమే త్రిశంకువు. బొందితో స్వర్గానికి పోవాలనేదే అతని పట్టుదల. కానీ తన పేరుతో మారు స్వర్గాన్ని చరిత్రకు పరిచయం చేసిన చరితార్థుడు త్రిశంకువు.
- ప్రమద్వర
సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడే త్రిశంకువు. ఈతని తండ్రి త్రిధన్యుడు. సత్యవ్రతుని భార్య సత్యరథ. ఇతని కొడుకే హరిశ్చంద్రుడు. సత్యవ్రతునికి మనసులో మూడుసార్లు కలిగిన చెడు తలంపులకూ, వాటి ఆచరణకూ గాను వశిష్ఠుడు అతన్ని త్రిశంకుడవు అయినావని అంటాడు. అలా త్రిశంకువుగానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు.త్రిశంకువు సూర్యవంశంలో పుట్టిన సత్యవాదే అయినా తండ్రి కోపానికి గురై రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్తాడు. తనకు ప్రాణాలతోనే స్వర్గానికి వెళ్ళాలనుందనీ, తన ఆకాంక్షను ఎలాగైనా నెరవేర్చాలనీ కులగురువైన వశిష్ఠునీ అడుగుతాడు. లోక విరుద్ధమైన పనిని నేనెప్పుడూ ప్రోత్సహించనని నిరాకరిస్తాడు వశిష్ఠుడు. త్రిశంకువు అంతటితో వదులక వశిష్ఠుని నూరుగురు పుత్రులనూ కలిసి తన ఆకాంక్షను చెప్పి ఎలాగైనా నెరవేర్చుమని పట్టుబడతాడు. తమ తండ్రి కాదన్న పనిని మేమెలా చేస్తామని అంటారు వశిష్ఠ పుత్రులు.
త్రిశంకువు కోపంతో గురువూ తిరస్కరించాడు. గురుపుత్రులూ కాదన్నారు. ఇక మా వంశానికి మరో గురువును చూసుకుంటానని అంటాడు. నీ అర్థం లేని కోరిక కోసం అనాదిగా వస్తున్న వశిష్ఠ పౌరోహిత్యం నీ వంశానికి వద్దంటావా! నీ అహంకారంతో వశిష్ఠులవారినే అవమానిస్తావా? అని వశిష్ఠ పుత్రులు తిశ్రంకువును చండాలుడివి కమ్మని శపిస్తారు. అలా మారిన త్రిశంకువును అందరూ దూరం పెడుతారు. అయినా పట్టువదలక విశ్వామిత్రుని దగ్గరకు వెళతాడు. సూర్యవంశపు రాజుకు ఏమిటి దుస్థితని ప్రశ్నించిన విశ్వామిత్రునికి తన కోరికనూ, జరిగిన విషయాన్నీ వివరించి ఎలాగైనా నన్ను బొందితో స్వర్గానికి పంపించమని అర్థిస్తాడు త్రిశంకువు.
శబల అనే కామధేనువు విషయంలో వశిష్ఠునికీ, విశ్వామిత్రునికీ మనస్పర్థలు వచ్చాయి. వశిష్ఠుడు కాదన్నాడు కనుక త్రిశంకువు కోరికను నేను తప్పక నేరవేరుస్తానని ప్రతిన బూని తన పిల్లలను పిలిచి యజ్ఞానికి ఏర్పాట్లు చేయమనీ, మహాపండితులను ఆహ్వానించుకొని రమ్మని పురమాయిస్తాడు. త్రిశంకువు మొండిపట్టు, విశ్వామిత్రునికీ అంటుకుంది. తన తపఃశ్శక్తినంతా ధారపోసి త్రిశంకువును స్వర్గానికి పంపిస్తాడు. అక్కడ స్వర్గంలో ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గానికి రావడం ధర్మవిరుద్ధమనీ, అయినా శాపంతో వచ్చిన నీకు ఎట్టి పరిస్థితులలోనూ స్వర్గంలో స్థానంలేదనీ త్రిశంకువును తిరిగి భూమ్మీదకు తలకిందులుగా వెళ్ళమని ఆదేశిస్తాడు. అలా వస్తున్న త్రిశంకువును మధ్యలోనే ఆపి విశ్వామిత్రుడు ఇంద్రునితో చర్చించి, స్వర్గానికి పంపడం సాధ్యపడదనేసరికి త్రిశంకువు ఉన్న చోటనే మరో స్వర్గం నిర్మింపజేస్తాడు. స్వర్గంలోనివన్నీ సృష్టించిన విశ్వామిత్రుడు ఎక్కడ మరో ఇంద్రున్ని సృష్టిస్తాడనే భయంతో దేవతలు, కేవలం త్రిశంకువు కోసం లోకవిరుద్ధంగా చేయడం సరైనది కాదని వారిస్తారు. కానీ తానిచ్చిన మాట ప్రకారం తాను సృష్టి చేసిన స్వర్గం త్రిశంకు స్వర్గమై అలానే నిలిచిపోతుందనీ తలకిందులుగా అయినా సరే, త్రిశంకువు స్వర్గంలోనే ఉండిపోతాడని దీవిస్తాడు.
త్రిశంకువు తన పట్టుదల కోసం జీవితం అంతా తపించాడు. రాజ్యాన్నీ వదిలేశాడు, శాపానికి గురైనాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసేలా విశ్వామిత్రున్ని ప్రేరేపించాడు. అద్భుత దేవలోక నిర్మాణానికి మూల కారణమైనాడు. దేవతలతో సమానమైన కాంతిని పొందగలిగాడు. మొండిపట్టుతోనైనా అనుకున్నది సాధించి కృతార్థుడైనాడు. త్రిశంకువు తన తండ్రి రాజ్యంలో కరువు ఏర్పడి భయంకరపరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వామిత్రుని కుటుంబం ఆదరణ కోల్పోయింది. ఆ కుటుంబాన్ని కొంతకాలం పాటు అహర్నిశలూ శ్రమించి పోషించాడు త్రిశంకువు. ఆ కృతజ్ఞతా భావమే విశ్వామిత్రున్ని త్రిశంకువు కోసం అంతటి అద్భుతం చేయడానికి ప్రేరేపించింది. త్రిశంకువులా పట్టుదల స్వీయ శ్రేయస్సుకోసమే అయినా, లోకానికే వన్నెతెచ్చేలా పరిణమిస్తుంది. అందుకే లోకంలోని ప్రతీదీ ఎవరో ఒకరు పట్టుబట్టబట్టే సుసాధ్యాలయ్యాయనడానికి త్రిశంకువు గాథే తార్కాణం.
- ప్రమద్వర
సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడే త్రిశంకువు. ఈతని తండ్రి త్రిధన్యుడు. సత్యవ్రతుని భార్య సత్యరథ. ఇతని కొడుకే హరిశ్చంద్రుడు. సత్యవ్రతునికి మనసులో మూడుసార్లు కలిగిన చెడు తలంపులకూ, వాటి ఆచరణకూ గాను వశిష్ఠుడు అతన్ని త్రిశంకుడవు అయినావని అంటాడు. అలా త్రిశంకువుగానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు.త్రిశంకువు సూర్యవంశంలో పుట్టిన సత్యవాదే అయినా తండ్రి కోపానికి గురై రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్తాడు. తనకు ప్రాణాలతోనే స్వర్గానికి వెళ్ళాలనుందనీ, తన ఆకాంక్షను ఎలాగైనా నెరవేర్చాలనీ కులగురువైన వశిష్ఠునీ అడుగుతాడు. లోక విరుద్ధమైన పనిని నేనెప్పుడూ ప్రోత్సహించనని నిరాకరిస్తాడు వశిష్ఠుడు. త్రిశంకువు అంతటితో వదులక వశిష్ఠుని నూరుగురు పుత్రులనూ కలిసి తన ఆకాంక్షను చెప్పి ఎలాగైనా నెరవేర్చుమని పట్టుబడతాడు. తమ తండ్రి కాదన్న పనిని మేమెలా చేస్తామని అంటారు వశిష్ఠ పుత్రులు.
త్రిశంకువు కోపంతో గురువూ తిరస్కరించాడు. గురుపుత్రులూ కాదన్నారు. ఇక మా వంశానికి మరో గురువును చూసుకుంటానని అంటాడు. నీ అర్థం లేని కోరిక కోసం అనాదిగా వస్తున్న వశిష్ఠ పౌరోహిత్యం నీ వంశానికి వద్దంటావా! నీ అహంకారంతో వశిష్ఠులవారినే అవమానిస్తావా? అని వశిష్ఠ పుత్రులు తిశ్రంకువును చండాలుడివి కమ్మని శపిస్తారు. అలా మారిన త్రిశంకువును అందరూ దూరం పెడుతారు. అయినా పట్టువదలక విశ్వామిత్రుని దగ్గరకు వెళతాడు. సూర్యవంశపు రాజుకు ఏమిటి దుస్థితని ప్రశ్నించిన విశ్వామిత్రునికి తన కోరికనూ, జరిగిన విషయాన్నీ వివరించి ఎలాగైనా నన్ను బొందితో స్వర్గానికి పంపించమని అర్థిస్తాడు త్రిశంకువు.
శబల అనే కామధేనువు విషయంలో వశిష్ఠునికీ, విశ్వామిత్రునికీ మనస్పర్థలు వచ్చాయి. వశిష్ఠుడు కాదన్నాడు కనుక త్రిశంకువు కోరికను నేను తప్పక నేరవేరుస్తానని ప్రతిన బూని తన పిల్లలను పిలిచి యజ్ఞానికి ఏర్పాట్లు చేయమనీ, మహాపండితులను ఆహ్వానించుకొని రమ్మని పురమాయిస్తాడు. త్రిశంకువు మొండిపట్టు, విశ్వామిత్రునికీ అంటుకుంది. తన తపఃశ్శక్తినంతా ధారపోసి త్రిశంకువును స్వర్గానికి పంపిస్తాడు. అక్కడ స్వర్గంలో ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గానికి రావడం ధర్మవిరుద్ధమనీ, అయినా శాపంతో వచ్చిన నీకు ఎట్టి పరిస్థితులలోనూ స్వర్గంలో స్థానంలేదనీ త్రిశంకువును తిరిగి భూమ్మీదకు తలకిందులుగా వెళ్ళమని ఆదేశిస్తాడు. అలా వస్తున్న త్రిశంకువును మధ్యలోనే ఆపి విశ్వామిత్రుడు ఇంద్రునితో చర్చించి, స్వర్గానికి పంపడం సాధ్యపడదనేసరికి త్రిశంకువు ఉన్న చోటనే మరో స్వర్గం నిర్మింపజేస్తాడు. స్వర్గంలోనివన్నీ సృష్టించిన విశ్వామిత్రుడు ఎక్కడ మరో ఇంద్రున్ని సృష్టిస్తాడనే భయంతో దేవతలు, కేవలం త్రిశంకువు కోసం లోకవిరుద్ధంగా చేయడం సరైనది కాదని వారిస్తారు. కానీ తానిచ్చిన మాట ప్రకారం తాను సృష్టి చేసిన స్వర్గం త్రిశంకు స్వర్గమై అలానే నిలిచిపోతుందనీ తలకిందులుగా అయినా సరే, త్రిశంకువు స్వర్గంలోనే ఉండిపోతాడని దీవిస్తాడు.
త్రిశంకువు తన పట్టుదల కోసం జీవితం అంతా తపించాడు. రాజ్యాన్నీ వదిలేశాడు, శాపానికి గురైనాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసేలా విశ్వామిత్రున్ని ప్రేరేపించాడు. అద్భుత దేవలోక నిర్మాణానికి మూల కారణమైనాడు. దేవతలతో సమానమైన కాంతిని పొందగలిగాడు. మొండిపట్టుతోనైనా అనుకున్నది సాధించి కృతార్థుడైనాడు. త్రిశంకువు తన తండ్రి రాజ్యంలో కరువు ఏర్పడి భయంకరపరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వామిత్రుని కుటుంబం ఆదరణ కోల్పోయింది. ఆ కుటుంబాన్ని కొంతకాలం పాటు అహర్నిశలూ శ్రమించి పోషించాడు త్రిశంకువు. ఆ కృతజ్ఞతా భావమే విశ్వామిత్రున్ని త్రిశంకువు కోసం అంతటి అద్భుతం చేయడానికి ప్రేరేపించింది. త్రిశంకువులా పట్టుదల స్వీయ శ్రేయస్సుకోసమే అయినా, లోకానికే వన్నెతెచ్చేలా పరిణమిస్తుంది. అందుకే లోకంలోని ప్రతీదీ ఎవరో ఒకరు పట్టుబట్టబట్టే సుసాధ్యాలయ్యాయనడానికి త్రిశంకువు గాథే తార్కాణం.
No comments:
Post a Comment