వర్షం కురిపించే విమల నాద జైన విగ్రహం... ~ దైవదర్శనం

వర్షం కురిపించే విమల నాద జైన విగ్రహం...


వింత దేవాలయం ..పదమూడవ జైన తీర్ధంకరుడు విమల నాధుని దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరం గ్రామం లో ఉంది .ఈ విగ్రహం రెండు వేల అయిదు వందల ఏళ్ళ నాటిదని చరిత్ర చెబుతోంది .నల్లరాతితో మలచ బడి పద్మాసనం లోనాలుగు అడుగుల ఎత్తు విమల నాధుని విగ్రహం దర్శనమిస్తుంది .
వందేళ్ళ క్రితం పంటపొలాల్లో గోతిలో పడి ఉంది .ఈ విగ్రహం .చాకలి వాళ్ళు దీనిపై బట్టలుతికే వారు .అప్పుడు ఆ వూరిలో కరువు తాండవించింది ,అంటువ్యాధులు ప్రబలాయి .ఒక రోజు ఆ గ్రామ స్త్రీ కలలో అది రాయి కాదని ,దేవుని విగ్రహం అని దాన్ని బయటికి తీసి ప్రతిస్తించమని కోరింది .అప్పుడు అందరుకలిసి బయటకు తీసి ఒక అరుగు కట్టి దాని మీద ప్రతిష్టించారు .ఆ తర్వాతా అరవై ఏళ్ళకు అది జైన విగ్రహం అని తెలిసి భీమ వరం జైనులకు తెలియ జేశారు .వారొచ్చి
అది జైన విగ్రహమే నని తెలుసుకొని దాన్ని పేద తిమిరం గ్రామస్తులను తమకు ఇవ్వమని కోరగా వీరు నిరాకరించారు .అప్పుడు రాజ మండ్రి జైన పెద్దలోచ్చి శ్రీ నందన్ విజయాజ్ మహా రాజ్ ఆధ్వర్యం లో అక్కడే పేద తిమిరం లో అందరి సహకారం తో జైన దేవాలయాన్ని 1965 ఫిబ్రవరి పదిన నిర్మించి విమల నాధుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు .ఉత్తర ,దక్షిణ జైనులకు తీర్ధ స్తలం అయింది .సకాలం లో వర్షాలు కురవక పొతే 108కుండలతో ,108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తే వర్షం తప్పక కురిస్తుంది అని నమ్మకం .ఈ ఆలయం రాజ మండ్రి –నిడద వోలు మార్గం లో ఉంది.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...