కుంభకోణం రైల్వే స్టేషన్, త్రిచి జంక్షన్లు కంజనూర్కు సమీప, ప్రధాన రైల్వే స్టేషన్లు. సందర్శకులు కంజనూర్ చేరుకోవడానికి కుంభకోణం లేదా త్రిచి నుండి ఒక బస్సు లేదా టాక్సీ ద్వారా కూడా వెళ్లవచ్చు.
-
శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..
సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!
-
పంచలింగాల కోన..
అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.
-
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి
నల్లమల ఆడవి లోని ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లెదా వజ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవజ్రాల కొండ గుహలో ఉల్లెడ నరసంహాస్వామి గుహ, ఆశ్వథ్దామ గుహ, వున్నఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ అను మూడు గుహలు కలవు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ లో ఒక శివలింగం, మూడు పడగల నాగుపాము, శంఖం, మరియు వీణ స్వయంబుగా వెలిచినాయి.
-
కాలి నడకన అధ్భుతమైన యాత్ర...
ఈ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించనివారుండరు. ప్రకృతి అందాలను చూస్తూ తమను తాము మరిచిపోతుంటారు. అలాంటి ప్రకృతి అందాలను చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు, కొత్త కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు సహాయాన్ని అందించడానికే ఈ ప్రయత్నం. .
-
జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...
కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.
శివుడి స్వయంగా శుక్ర గ్రహాం గా వెలసిన ఆలయం.
కుంభకోణం రైల్వే స్టేషన్, త్రిచి జంక్షన్లు కంజనూర్కు సమీప, ప్రధాన రైల్వే స్టేషన్లు. సందర్శకులు కంజనూర్ చేరుకోవడానికి కుంభకోణం లేదా త్రిచి నుండి ఒక బస్సు లేదా టాక్సీ ద్వారా కూడా వెళ్లవచ్చు.
తిరువన్నాపురం...శౌరి రాజ పెరుమాళ్.
శౌరి ( తమిళంలో 'శిరోజాలు' ) రాజ పెరుమాళ్ గా నామకరణం చేస్తూ, ఆయన మహిమను జనసామాన్యంలోకి తీసుకువెళతాడు. తనని రక్షించిన దైవానికి ఆ పూజారి కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా, ఆ తరువాత అలాంటి తప్పులు జరగకుండా నడచుకున్నాడు. అప్పట్లో స్వామివారికి శిరోజాలు మొలిచిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయని చెప్పుకుంటూ వుంటారు.
“హోలీ”
మిత్రులందరికి హోలీ శుభాకాంక్షలు...
కాముని పున్నమి రోజే “హోలీ” ...
ఆనందకరమైన హోలీ .. శ్రీ కృష్ణరాసలీలల కేళి ...
.
.
ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు, సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది. ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా ఆడి పాడుకుంటారు. హొలీ అంటే కామదహనం.
.
హోలీ పండగ వసంతాగమనాన్ని తెలియజేస్తుంది. ఈ పండగను మనదేశంలో పలురాష్ట్రాలలోని ప్రజలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసు కుంటారు. ముఖ్యంగా, నగరాలలో వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగ ధర్మంగా వచ్చిన ప్రజలు ఉంటారు. అందరూ కలిసి మెలిసి మెలుగుతూ సంఘీభావంతో, ఆనందంతో, జరుపుకోవడం కనిపిస్తుంది.హోలీ పండగ ఈనాటిది కాదు. దక్షయజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి హిమవంతునికి పుత్రికయై జన్మించి, శివుడినే పతిగా పొందగోరి, అనునిత్యమూ ఆయననే పూజిస్తూ, సపర్యలు చేస్తూ ఉండేది.
.
లోకకళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయదలచిన దేవతలు మన్మథుని సహాయం కోరగా, అతడు శివుడిపై పూలబాణాన్ని కురిపిస్తాడు.ఈ విషయాన్ని దివ్య దృష్టితో చూసిన పరమేశ్వరుడు కోపగించి, తన మూడవ నేత్రాన్ని తెరచి, మన్మధుడిని భస్మం చేస్తాడు.రతీదేవి రోదించగా, జాలిపడిన పార్వతీ దేవి కోరిక మేరకు మన్మధుడు ఆ శరీర రూపంతో, సజీవుడయ్యేట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు.ఆరోజు ''ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. అదే కాముని పున్నమిగా జరుపుతున్నాం.
.
పూర్వం రఘుమహారాజు కాలంలో 'దాండ అనే ఒక రాక్షసి ఉండేదట! అది లోక కంటకురాలై, రాజ్యంలోని శిశువులను పట్టుకొని తినేస్తూ ఉండేదట! ప్రజలంతా వెళ్లి రాజుగారికి మొర పెట్టుకోగా, ఆయన వెళ్లి మునీశ్వరులను ప్రార్థిం చాడట. ఆమె ఒక బాలగ్రహం అనీ, ఆమెకి మంట అంటే భయం అనీ, ఆమె మరణం మంటల వల్లనే జరుగుతుందని చెప్పారట.రాజుగారి ఆజ్ఞమేరకు ఊరినిండా మంటలు వెయ్యగా, భయంతో కేకలు వేస్తూ, ఆ రాక్షసి మరణించిందట. ఆరోజున మంటలో పిడకలువేసి, ప్రజ్వలింపజేసి, ప్రదక్షిణం చెయ్యాలని ధర్మసింధువు, నిర్ణయ సింధువుల్లో హేమాద్రి పండితుడు తెలియజేశాడు.
.
ఇంకొక కథ ప్రకారం, హిరణ్యకశిపుని సోదరి, హోలిక అనీ, ఆమె ''ప్రహ్లాదుడి వల్లనే తన అన్నగారు చనిపోయేరనే కోపంతో, ప్రహ్లాదుడిని మంటల్లో తోయించిందని, కానీ, ఆమంటలు పిల్ల వాడిని ఏమీ చేయక, ఆ హోళికనే దహించి వేశా యని, అంటూ చెడుపై మంచి సాధించిన గుర్తుగా ఈ హోళీని జరుపుకుంటారు. వేరే కథ ఏమి టంటే, ఎంత చెప్పినా హారి భక్తి మానని ప్రహ్లాదు డిని హిరణ్య కశిపుడే మంటల్లో పడేయించితే, అతడి మేనత్తయైన హోలిక పిల్లవాడిని ఒళ్లో పెట్టుకొని మంటల్లో కూర్చుందని, అష్టసిద్ధులూ ఉన్న ఆమెను మంటలు ఏవీ చెయ్యవు కాబట్టి, పిల్లవాడు క్షేమంగా అగ్ని నుండి బైటపడ్డాడని, పండగ చేసుకున్నారట!
.
ఇవన్నీ ఇలా ఉండగా, ద్వాపరయుగంలో తన నెచ్చెలియైన రాధ తనకంటే తెల్లగా ఉందని, తాను నల్లగా ఉన్నానని, అలిగి, తన తల్లియైన యశో దమ్మ వద్ద వాపోయేడట, చిన్నికృష్ణుడు. అయితే ఒక పని చెయ్యి, రాధ శరీరం నిండా రంగులు పూసెయ్యి అని సలహా ఇచ్చి నవ్వుకుందట యశోద! తల్లి సలహా ప్రకారం రాధను పట్టుకొని, రంగునీళ్లను కుమ్మరించాడట కృష్ణుడు. మరిరాధ ఊరుకుంటుందా? తానూ కన్నయ్యపై వసంతాన్ని జల్లింది. అలా మొదలైన ఈ వేడుక, స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తెలిసినవారు, తెలియని వారు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లు కొంటూ, రంగుల్ని పూసుకుంటూ వేడుక చేసుకునే స్థాయికి చేరింది.
.
ఈ 'కామ దహనాన్ని కొన్ని చోట్ల చలిమంటలుగా వ్యవహరిస్తారు. ఇంకా, కొన్నాళ్లకు పండగ వస్తుం దనగానే, కట్టెలు, పిడకలు దుంగలు, చెత్త, చెదారం పోగు చేసి ఉంచుతారు. పిల్లలు, పెద్దలు, అందరూ సంతోషంతో కేరింతలు కొడుతూ, మంట చుట్టూ తిరుగుతూ ఆనందిస్తారు.కాముని పున్నమిగా, డోలికోత్సవంగా ఫాల్గుణోత్సవంగా పిలుస్తూ జరుపుకుంటారు. కామదహనం పేరుతో చేసే ఉత్సవంలో ఎంతో ఆధ్యాతికత దాగి ఉంది. ''కామాన్ని అంటే కోరికని, దహించివేసి (పోగొ ట్టుకొని) అందరూ సోదరభావంతో, వాత్సల్య, అభిమానాలతో, కులాతీత, మతాతీత, జీవితాన్ని గడపడమే, మానవజన్మకు చరితార్థం అనేది ఆంతర్యం. కొన్ని ప్రాంతాల్లో ఈసీజన్కి అను గుణంగా పండిన పంటలతో, అంటే శనగపప్పు, గోధుమలు వగైరాలతో, బొబ్బట్లు చేసి మంటల్లో వేస్తారు.
.
ప్రకృతి ప్రసాదించినవి ప్రకృతికి సమర్పించడమే ఇందులోని సందేశం. పితృ దేవతలను సంతృప్తి పరచి, హోలికా భూమికి నమస్కరిస్తే, సర్వ దుఃఖాలు తొలగుతాయని, శుభం కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ పండగ ఉత్తర భారతంలో చాలా ప్రాచుర్యం పొంది, క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించి, రంగుల పండుగగా ఆచరింపబడు తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమల్లోనూ వైభవోపేతంగా జరుపబడు తోంది. సంస్కృతీ సాంప్రదాయాల మేళవింపుగా, భిన్నత్వంలో ఏకత్వం గోచరిస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దారితీస్తోంది.
.
మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను మంటలో వేసి, దహనం చేస్తారు. ప్రొద్దున్న నుండి రాత్రి వరకూ మంటలను వేసి మహిళలు ప్రత్యేకంగా తీపి పిండివంటలను చేసి నైవేద్యం సమర్పిస్తారు. మణిపూర్లో, వారంరోజుల పాటు ఈ ఉత్సవాలు జరిపి, చివరిరోజున కృష్ణుడి ఆలయం వరకూ ఊరేగింపుతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, వెళ్లి పండగ చేస్తారు. ఇలా వయో భేదాలు మరచి, కులమతాలకు అతీతంగా సుఖసంతోషాలతో జీవితాలు సాగాలనే ఆకాంక్షతో జరుపుకునే సంబరం ఈ పండగ...
https://www.facebook.com/rb.venkatareddy
రామలింగేశ్వర ఆలయం.
నాడీ జ్యోస్యం తెలియజేసే వైదీశ్వరన్ కోయిల్.
పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తున్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయం.
వధువరులకు చుడవాలిసినవి.
ఆది నాడి
అంత్య నాడి
మద్య నాది
వధువరులకు ఇదరికి ఒకటే నాడి అవ్వకూడదు. గుణాలు - 8
గుణాలు - 7
వధువు నుంచి వరుడికి చూడాలి. అందులో ఇదరిది షష్ఠటాష్టకం కాకూడదు. ద్వాదశం కాకూడదు, నవమ్ పంచకం కాకూడదు.
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్
వధువు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు, వరుడు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు చూసి వధువు నుంచి వరుడుకీ లేకించాలి. ఒకవేళ ఎ రాశులలో షష్ఠటాష్టకం పడిన పరవాలేదు, దోషం లేదు.
వధువు నుంచి వరుడుకీ 6, 8 రాసులు అవ్వకూడదు.
సుభ ద్విర్ద్వాదసి
అశుభ ద్విర్ద్వాదసి
గుణాలు - 5
వధువరుల రాశి అధిపతులు శత్రువు అయితే చేయకూడదు.
గుణాలు - 6
దేవా గణం
మనుష్య గణం
రాక్షసి గణం
రాక్షసి గణం - మనుష్య గణం - అస్సలు చేయకూడదు.
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి బాగుండి, జాతక చక్రం లో మిగతా దోషాలు ఏమి లేకుండా వుంటే మనుష్య గణం-రాక్షసి గణం అయిన పరవాలేదు.
అష్ట కూటము లు చూస్తారు
యోని కూటమి
తార కూటమి
వస్య కూటమి
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి కచితంగా కలవాలి. మిగతా కూటమి లో దోషాలు వున్నా పర్వాలేదు.
అమ్మాయి కి కళత్ర స్థానం లో భర్త / అబ్బాయి కి కళత్ర స్థానం లో భార్య స్థానం లో దోషం ఉండకూడదు , పాప గ్రహాలు ఉండకూడదు . అ స్థానాదిపతి దుస్థానలో ఉండకూడదు.
గణ మెలనె పట్టిక - చూసేటపుడు ముందుగ నాడి కూటమి, రాశి కూటమి, గ్రహమైత్రి. వీటి పాఇంట్లు చూసి తరువాత మిగిలిన కూటమి చూసుకోవాలి .
అయిషు
వైదవ్య యోగాలు
వివాహేతర సంబందాలు ఉంటాయ
ఆరోగ్యం
రవి బలవంతుడై, ఉచ్ఛస్థానం లోకాని . సప్తమ స్థానం లో కానీ, లగ్న స్థానం, వక్క్ స్థానం.
కుంభ రాశి - సింహ రాశి సమ సప్తకాలే అవుతాయి కానీ ఇదరికి పరమ శత్రుత్వం. ఇలా వున్దడ్డం వల్ల కుంభ రాశి వాళ్ళు సింహ రాశి వారికీ ఎప్పుడు బయపడుతూ వుంటారు.
రామతీర్థం.
(Ramatheertham Sri Rama Temple In Vizianagaram)
సిద్ధ యోగి పుంగవుడు ''మౌన స్వామి''.
.
చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక చింతన, దేవి ఉపాసన నిత్యకృత్యాలు శివయ్యకు. అబ్కారీ డిపార్ట్మెంట్లో కొంతకాలం , రాజముండ్రిలో ప్లీడరు గుమస్తాగా కొంతకాలం ,ఒక వ్యాపారస్తుని దగ్గర కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ రోజుల్లోనే ఒక భైరాగితో పరిచయమైంది. అప్పుడు బాహ్య జగత్తునుండి అంతర్జగత్తులోకి ద్రుష్టి మళ్ళింది. 1906 డిసెంబరులో అప్పటిదాకా 12 సంవత్సరాలుగా రాజముండ్రిలో సంసారంతో ఉన్న శివయ్య అన్ని లౌకికబంధాలు తెంచుకొని హిమాలయాల వైపు ప్రయాణించారు . అక్కడ నైమిశారణ్యంలో పర్వత గుహల దగ్గర 'వెంకటాచలం పంతులు' అనే తెలుగు వృద్ధ యోగితో భగవంతుని కృపతో పరిచయం అయింది . వారికి సేవచేసి కొన్ని నెలల పాటు వారి అనుగ్రహాన్ని పొంది ఆకలిదప్పులు లేని, విషజంతువులచే బాధనొందని విద్యను పొందారు. అక్కడ నుండి హిమాలయాలకు ప్రయాణం సాగించారు.
.
హిమాలయాలలో అచ్యుతానందసరస్వతి అనే మహాసిద్ధుని ఆశ్రమం కనిపించింది. ఆ స్వామి దత్తాత్రేయుని సంప్రదాయానికి చెందిన యోగి. దశమహావిద్యల మూలదేవత సిద్దేశ్వరీదేవిని పరశురాముని అనుగ్రహంతో సాక్షత్కరించుకొన్న వాడు. అచ్యుతానందసరస్వతీస్వామి శివయ్యకు సన్యాసదీక్షను ఇచ్చి 'శివచిదానంద సరస్వతి' అని యోగపట్టా ప్రసాదించాడు. ఆ ఆశ్రమంలోనే తపస్సు చేసుకుంటుండే నిఖిలేశ్వరానంద,విశుద్ధానంద ఆ ఆశ్రమానికి వచ్చారు. వారితో కలసి సాధన చేశారు శివచిదానందస్వామి.
.
అచటి నుండి గురువుల ఆజ్ఞతో శివచిదానందస్వామి దేశ సంచారం చేస్తూ దత్తభక్తులైన వాసుదేవానందసరస్వతి కలిశారు. వారిని టెంబేస్వామి' అని కూడా పిలుస్తారు. వారు శివచిదానందస్వామికి యోగరహస్యాలు చెప్పి సిద్ధపురుషులుగా తయారు చేశారు. శివచిదానందస్వామి 'మౌన స్వామి'గా ప్రసిద్ధి నందటానికి రెండు కారణాలు చెపుతారు. ఒకసారి స్వామి కాశ్మీరులో పర్యటన చేస్తుండగా అక్కడి వృద్ధపండితుల విద్వద్గోష్టిలో వివాదాస్పదమైన కొన్ని సందేహాలకు సమాధానం చెప్పి వారి కోపానికి కారణమైనారు. ఈ విషయం తెలిసిన గురువుగారు శివచిదానందను మౌనంగా ఉండమన్నారు. మరొక కారణం ఒకసారి వృద్ధాచల సమీపారణ్యంలో తపస్సు చేస్తుండగా కోపావిష్టులైనారు. తన కోపం కారణంగా ఇతరులకు కష్టం కలగవచ్చునని గ్రహించి స్వచ్ఛందంగా 'మౌనవ్రతం' స్వీకరించారు. అప్పటినుండి సంజ్ఞలద్వారానో, లిఖితపూర్వకంగానో తన అభిప్రాయాలను వెల్లడిస్తుండేవారు. ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడేవారు కాదు. అందువల్లనే వారిని 'మౌన స్వామి' అని సమస్త ప్రజానీకం పిలవడం ప్రారంభించింది. అయితే స్వామి వారు ఒకసారి మాత్రం మాట్లాడారు జిల్లెళ్ళమూడి అమ్మతో ఆమెకు 7 ఏండ్ల వయస్సులో.
.
అమ్మ బాల్యంలో తాతమ్మ మరిడమ్మగారితో కలిసి చీరాల వెళ్ళింది. ఆ సమయంలో మౌన స్వామివారు నూనె పానకాలుగారి తోటలో విడిది చేసి ఉన్నారు.తాతమ్మతో కలసి అమ్మ మౌన స్వామిని చూడటానికి వెళ్ళింది. చూచి అందరు తిరిగి వచ్చారు. మరుసటి రోజు అమ్మ ఒక్కతే వారి వద్దకు వెళ్ళింది. స్వామి వద్ద నుండి అందరూ భోజనాలకు వెళ్ళిన సమయం చూచుకొని దొడ్డి వాకిలిగుండా స్వామివారి వద్దకు వెళ్ళింది. అమ్మను చూచి స్వామి దగ్గరకు పిలిచారు. అమ్మ స్వామిని మౌనమంటే ఏమిటి? అని అడిగింది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికి మౌనం ఆధారం అన్నారు స్వామి. మీరుమన్నవలో వేసిన యంత్రం రాజరాజేశ్వరీ యంత్రమా? రాజ్యలక్ష్మీయంత్రమా? అని అడిగింది నీకాసందేహం ఎందుకొచ్చింది? అన్నారు స్వామి.
.
ఆ ఊళ్ళో ఒక్కళ్ళు రాజరాజేశ్వరి అనీ, మరొకరు రాజ్యలక్ష్మీ అని అనుకుంటున్నారు అన్నది అమ్మ. రాజరాజేశ్వరీ యంత్రమే అన్నారు స్వామి. మీరు అసలు మాట్లాడతారో మాట్లాడరో అనుకుంటూ వచ్చాను అన్నది అమ్మ. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించిందమ్మా! ఇంకొకటి గూడా అనిపిస్తున్నదమ్మా! నీవు దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తున్నావు నేనెవరికీ చెప్పను గాని నీవెవరు? అన్నారు. అప్పుడు అమ్మ అదిసరే గాని మీరు అందరికీ బాలమంత్రం ఇస్తుంటారా? అని అడిగింది. స్వామి ఆమాట పట్టించుకోకుండా నీ రాక చాల గోప్యంగా ఉంచుకుంటానమ్మా! నీతో మాట్లాడినట్లు తెలిస్తే వీరంతా ప్రాణాలు తీస్తారు. నేను మౌనం ప్రత్యేక సాధనగా పెట్టుకోలేదు. కొన్ని అవసరాలు అలా కల్పించినవి అన్నారు. మీరు బాల చెప్పిన వాళ్ళందరికీ నేను ఆజపం చేపుతానన్నది అమ్మ. స్వామీ ఆశ్చర్యపోయి అమ్మను చూస్తూ అక్కడున్న రుద్రాక్షమాలను అటునుండి ఇటూ, ఇటు నుండి అటు త్రిప్పుతూ ధన్యోస్మి అని. అజపమంటే ఏమిటమ్మా? అన్నారు. నోటితో ఉచ్చరించనిది అన్నది అమ్మ. అటువంటి దాన్ని ఎట్లా చెపుతావు? అన్నారు. చెప్పటమంటూ వచ్చినపుడు మాటలు లేకుండా ఎట్లా ఉంటాయి. చెప్పేటప్పుడు మాటలతో చెప్పినా చేసేటప్పుడు మాటలు లేకుండా చేసేది అన్నది అమ్మ. స్వామి ఎవరో వస్తున్న అలికిడికాగానే వెళ్ళమ్మా వెళ్ళు అన్నారు అమ్మను. ఎందుకువెళ్ళటం అన్నది అమ్మ. నా నిష్ఠకు భంగం అన్నారు స్వామి. నిష్ఠ అంటే ఏమిటి స్వామి ? అని అడిగింది అమ్మ. నిష్ఠ అంటే అనుష్టానం అన్నారు స్వామి. ఇంతలో బయట నుండి తలుపులు తట్టటంతో అమ్మ మరొక వైపు నుండి బయటకు వచ్చింది.
.
ఇలా అమ్మకు మౌన స్వామికి మహత్తరమైన సంభాషణ జరిగింది. అమ్మ ఆ చిన్నప్పుడే మన్నవలో రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళినపుడు అమ్మవారి క్రింద వున్న యంత్రం మౌన స్వామి వేశారు అన్నారు. అందుకని అమ్మ మౌన స్వామిని ఆ యంత్రాన్ని గూర్చి ప్రశ్నించింది. తను చెప్పింది సత్యమని ఋజువు చేసింది. ఆ రోజులలో స్వామివారు చీరాల ,బాపట్ల , మన్నవ , రాజమండ్రి ప్రాంతాలలో సంచరించి నట్లు కొన్ని చోట్ల దేవతా ప్రతిష్టలు చేసినట్లు దాఖలాలున్నాయి.
.
కుర్తాళం స్వామి దత్తమఠాన్ని నెలకొల్పారు. స్వామివారు ఎన్నో మహిమలు చూపించారని వారి జీవితచరిత్ర చదివిన వారికి అర్ధమౌతుంది. తమిళనాడు గవర్నరు ఇంగ్లీషు దొర తన సతీమణితో స్వామి దర్శనానికి రాగా రెండు గులాబీ దండలు యాపిలు పండ్లు సృష్టించి ఇచ్చారు. ఇసుక పట్టుకుంటే బంగారుమయ్యే సువర్ణవిద్య స్వామి కరతలామలకం. మౌన స్వామి మహాయోగసిద్ధుడు. 23. 12. 1943 పుష్యశుద్ధ పాడ్యమినాడు సిద్ధిపొందారు. వారి తర్వాత వచ్చిన పీఠాధిపతులలో శ్రీ శివచిదానంద భారతీస్వామి. శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి అమ్మవద్దకు వచ్చిన మహనీయులు.
శ్రీకృష్ణుడు వెన్న ముద్దలు దొంగిలించడంలోని దేవ రహస్యం..!
* బాల్యంలోనే తన లీలల ద్వారా శ్రీకృష్ణు తత్వన్ని బోధించిన గోపాలుడు...
.
.
.
మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.
.
ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు.వున్న ముద్దలు ఎక్కువ తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం.
.
వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే మృత్తికా రూపమైన వెన్నకుండ,మన మనస్సే కుండ లోని వెన్న ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ మనస్సే వెలుగుకు,విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.
.
యదా యదా హి ధర్మస్య జ్జానిర్భవతి భారత..!
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం..!
శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోరులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిధి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం, శ్రావణ బహుళ అష్టమి తిథి.
శ్రీ తిలబండేశ్వర మహాదేవ్.
2500 సం"ల స్వయంభూ శ్రీ తిలబండేశ్వర మహాదేవ్,వారణాసి.సంవత్సరానికి నువ్వుగింజ అంత వృద్దిచెందుతూ వుంటుందిట.ప్రస్తుతం 3.5 అడుగులు వుంది.భూమిలో 30 అడుగులుందిట.అంటే ఎన్ని యుగాల నుండి ఈ స్వామి వృద్దిచెందుతూ వున్నారో ఈ శివ లింగాన్ని ముట్టుకుంటే రాయి లాగా కాకుండా మృదువుగా ఉంటుంది అంటారు..హరహరమహదేవ!
https://www.facebook.com/rb.venkatareddy
మాధవ సరోవరం శ్రీ కృష్ణదేవాలయం.
మహోన్నతమైన శక్తిగా "ఓంకారం".
* శివునికి ఎన్ని అవతారాలు ఉన్నాయో మీకు తెలుసా..?
.
.
మహాశివుడు హిందువులకి ఉన్న ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు. "శైవులు" లేదా మహాశివుని భక్తులు ఆయనను ఒక మహోన్నతమైన శక్తిగా కొలుస్తారు."ఓంకారం" లేదా అస్థిత్వానికి ముందునుండి ఉనికిలో ఉన్న శబ్ధమే మహా శివుని మూలం అని చెబుతారు.
.
మొట్టమొదటి దైవ రూపం ఎమిటి అన్నదానిపై హిందూ పురాణాలు కూడా తరచూ వివాధపూరితమైన చర్చగానే మిగిలినా, శైవులు మాత్రం మహాశివుడినే మొట్టమొదటి దైవ రూపంగా నమ్ముతారు. ఈ విశ్వంలొ మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన దేవుడిగా నమ్మబడే మహాశివుడు, నిరాకారుడు , లింగాకారుడు మరియు అనంతుడు.
.
సృష్టిలొని పంచ భూతాలైన పృధ్వి , గాలి , నీరు ,అగ్ని, ఆకాశాలకు పరమ శివుడు అధ్యక్షుడు. ప్రకృతిలొని ఈ రూపాలు అన్ని కలిపితే శివ లింగం అని అంటారు.
.
సాదారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా?
దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది. శివుని గురించి మాట్లాడితే, మాకు 19 అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది.
శివుని యొక్క19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ అవతారాల గురించి తెలుసుకుందాం .
.
పిప్లాద్ అవతారం: ..
శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్ గా జన్మించెను. అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయెను. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనెను. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించెను.
తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించేను. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకుడదని చెప్పెను. అందువల్ల శివడుని పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు.
.
నంది అవతారం: ..
నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకొని ఉంటారు.
.
వీరభద్ర అవతారం:..
సతీ దేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత,శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రెంపి మైదానంలోకి విసిరెను. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను.
ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పుర్రెల దండ ధరించి, భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక డార్క్ దేవుడుగా కనపడతారు. శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది.
.
భైరవ అవతారం:..
శివుడు,బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్దం చెప్పిన సమయంలో,శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేను. బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసెను. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్పుతారు.
.
అశ్వత్థామ అవతారం: ..
క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకొనెను. అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది.లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చెను. మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను. అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను.
.
శరభ అవతారం :..
శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి,మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం, విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తెను .
.
గ్రిహపతి అవతారం: ..
శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుకు గ్రిహపతి అనే పేరు పెట్టెను. గ్రిహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లితండ్రులకు చెప్పెను. అందువలన,గ్రిహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళెను. గ్రిహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను.
.
దుర్వాస అవతారం: ..
శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ది గాంచారు.
.
హనుమాన్ అవతారం: ..
హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు.
.
వృషభ అవతారం :..
సముద్ర మంథనం తర్వాత, ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మొహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు.
కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేదించటం ప్రారంభించారు. అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణు మూర్తి యొక్క కుమారులను చంపివేసెను.
అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత,అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయెను.
.
యతినాథ్ అవతారం: ..
ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతను,అతని బార్య శివుని యొక్క భక్తులు. ఒక రోజు శివుడు యతినాథ్ రూపంలో వారికీ దర్శనం ఇచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ ను లోపల పడుకోమని చెప్పెను.
దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు.ఉదయం, ఆహుక్ చనిపోయినట్లు కనుకొని, తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మ లో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు దమయంతిలుగా జన్మిస్తారని చెప్పెను. అప్పుడు వారు శివునిలో ఐక్యం అయ్యారు .
.
కృష్ణ దర్శన్ అవతారం :..
శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను ఈ లోకానికి తెలియచేయడానికి ఈ అవతారం జరిగింది.
.
భిక్షువర్య అవతారం :..
శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగెను.
.
సురేశ్వర్ అవతారం: ..
శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారంను సురేశ్వర్ అవతారం అని చెప్పుతారు.
.
కిరీట్ లేదా వేటగాడు అవతారం :..
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. దుర్యోధనుడు అర్జునుడుని చంపటానికి మూక అనే రాక్షసుణ్ణి పంపెను. మూక ఒక పంది రూపంలో వచ్చెను. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా,తన ఏకాగ్రతను భంగపరస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చెను. అప్పుడు కళ్ళు తెరచి మూకను చూసేను. అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేసెను. ఇద్దరు కలిపి పందిని ఓడించెను. అర్జునుడుతో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంను మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను.
.
సుంతన్ తారక అవతారం: ..
శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తేను.
.
బ్రహ్మచారి అవతారం: ..
పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో,శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను.
.
యక్షేశ్వర్ అవతారం: ..
శివుడు దేవతల యొక్క మనస్సులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగేను.
.
అవధూత్ అవతారం: ..
ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారంను తీసుకున్నారు.
నేల క్రింద చారిత్రాత్మక అద్భుత శివలింగం.
కాలకూటా విషాన్ని త్రాగి సకల సృష్టిని రక్షించిన పరమ శివుడు.
శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి.
పౌరాణిక గాధ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమ్రుతలింగాన్ని రాక్షసులు ఒక 'పల్వలము' (గొయ్యి)లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమ్రుతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది.