కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం బ్రహ్మంగారిమఠంలో శివరాత్రి పర్వదినాన బ్రహ్మంగారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ ఉత్సవ విగ్రహాలను మఠం ఆవరణలో సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలో కొలువుదీర్చారు. దేవస్థానం వేద పండితులు కందుకూరి గోవింద శర్మ, జనార్ధన శివా చారి ,పడకండ్ల వెంకటాచార్యులు ,పోలేపల్లి రాంబ్రహ్మం ఆధ్వర్యంలో మఠం పీఠాధిపతి వీర బోగ వసంత వెంకటేశ్వర స్వామి ఆయన ధర్మపత్ని మారుతి మహాలక్ష్మి దంపతులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు మఠం మేనేజర్ ఈశ్వర్ ఆచారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువపందిళ్లు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు .బ్రహ్మంగారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు బ్రహ్మం గారి మఠం ఎస్సై ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
No comments:
Post a Comment