April 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

సిద్ధనాథ్ మహదేవ్ - అతి పురాతన శివాలయం.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలోని నేమవర్ అనే పట్టణనికి దగ్గర నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం. . ఈ ఆలయంలోని శివలింగాన్ని సనంద్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే నలుగురు సిద్ధ ఋషులు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు అభిప్రాయపడుతారు.
ఈ శివాలయాన్ని క్రీ.పూ.3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఆరంభంలో ఆలయ ముఖద్వారం తూర్పు దిశగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమవైపుకు తిప్పినట్టు చెప్పుకుంటారు.
ప్రతి రోజు ఉదయం.. నదీతీరంలోని ఇసుక మేటలపై అతిపెద్ద పాదముద్రికలు కనిపిస్తుంటాయి. ఇవి నలుగురు సిద్ధ ఋషుల పాద ముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా.. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణం చేస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని భక్తులు భావిస్తుంటారు.

Share:

చతుర్ముఖ లింగం క్షేత్రం ... పశుపతినాథ్ ఆలయం.

ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.
ఇంకో కథ ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.
ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.
నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది.
శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

Share:

తిరుమల వెంకేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉండే క్షేత్రం.

విశాఖ పట్టణము జిల్లలోని , నక్క పల్లిమండలములో, ఉపమాక గ్రామములో వెలసిన స్వామి వారి కోవెల పావనమైన పుణ్య నిలయము. తూర్పు గోదావరి జిల్లాలోని కాండ్రేగుల సంస్తానమున కు అధిపతి ఐన శ్రీ కృష్ణ భూపాలుడు.శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెలను నిర్మించెను. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన ' ఉపమాక వెంకన్న' 'గా పిలువ బడే వేంకటేశ్వరస్వామి ఆలయం యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో కల ఉపమాక గ్రామం లో వెలిసింది. ఈ దేవాలయం తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ క్షేత్రం క్రీ..శ. ఆరవ శతాబ్దంలో వెలిసినట్లు తెలస్తుంది.
వెంకటేశ్వర స్వామి వెలసిన పర్వతాన్ని గరుడాద్రి పర్వతమని పిలుస్తారు. గరుక్మంతుడు, విష్ణుమూర్తిని ఎల్లవేళలా తన వీపు పై కూర్చుండునట్లు వరం కోరగా, దక్షిణ సముద్ర తీరమందు నీవు కొండగా ఆవిర్భవిస్తే, తిరుపతి నుండి వచ్చి నీ పై అవతరించి పూజలందుకొంటానని విష్ణుమూర్తి తెలపగా గరుక్మంతుడు గరుడాద్రి పర్వతంగా వెలిశాడని స్థలపురాణం. ఇక్కడ ఆలయంలో స్వామి గుర్రం పై కూర్చున్నట్టు లక్ష్మిదేవి క్రింద వెలసినట్లు దర్శనమిస్తారు.
కొండ దిగువన విశాలమైన మరొక ఆలయంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దర్సనమిస్తాడు. ఆలయాన్ని ఆనుకొని రెండు పుష్కరుణులు క్షేత్రానికి ప్రత్రేక శోభను చేకూర్చుతున్నాయి. ఎత్తయిన పర్వతం, సుందరమైన ఆలయ బేడామండపం, ఇతర కట్టడాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెపుతాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి .ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనం లో ఆలయం నడుస్తోంది.

Share:

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పునర్నిర్మించిన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ఆలయం.

దక్షప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (27 నక్షత్రాల పేర్లు వారివే) చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాని చంద్రుడు మాత్రం అందరికంటే అందమైన రోహిణి పైననే ప్రేమ చూపి తక్కినవారిని నిర్లక్ష్యం చేస్తాడు. మిగతా 26 మంది తండ్రి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి తమకు జరుగుతున్నా అన్యాయాన్ని విన్నవించుకుంటారు. చంద్రున్ని పిలిచి అందర్నీ సమానంగా ఆదరించమని చెపుతాడు. అయినా చంద్రుడు రోహిణి పైననే తన ప్రేమంతా కురిపిస్తుంటాడు, దాంతో ఆగ్రహం చెందిన దక్షుడు చంద్రున్ని క్షయ వ్యాధి గ్రస్తుడివికా అని శపిస్తాడు. శాప నివారణకు దేవతలా నెవరి నాశ్రయించినా దక్షుని శాపం నుండి కాపాడగలవాడు శివుడొక్కడే అని, శివునికి తపస్సు చేసి మెప్పించమని సలహా ఇస్తారు. చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి ఘోర తపస్సు నాచారిస్తాడు, ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, దక్షుని శాపానికి తిరుగుండదని అయినా నీ భక్తికి మెచ్చి నెలలో 15 రోజులు క్షయం, 15 రోజులు వృద్ది అయ్యేలా చేస్తానని చంద్రుని శాపాన్ని మారుస్తాడు. చంద్రునికి శాప విమోచనం చేసిన పరమేశ్వరుడు ఇక్కడ సొమనాథునిగా వెలిశాడు. చంద్రుడు కృతజ్ఞతగా సొమనాథునికి బంగారు ఆలయాన్ని నిర్మిస్తాడు.
గుజరాత్ రాష్ట్ర ప్రభాస క్షేత్రంలో సోమనాథ దేవాలయం కలదు. అతి పురాతనమైనది ఈ దేవాలయం. భారత దేశంలో ఈ దేవాలయం దోపిడీకి గురైనంతగా మరే దేవాలయం గురి కాలేదు. క్రీ.శ.722 లో సింధూ ప్రాంత అధిపతి అయిన జునాయిద్ తన సైన్యాన్ని పంపి ఆలయాన్ని ద్వంసం చేయించాడు. భారత దేశపు రాజులు, భక్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. కాగా క్రీ.శ.1026 లో ఘజనీ మొహమ్మద్ తన సైన్యంతో దండ యాత్ర చేసి ఆలయాన్ని ద్వంసం చేసి ఆలయంలో కల అపార సంపదనంతా దోచుకెళ్ళాడు. ముస్లీం పాలనలో ఆలయం పలు మార్లు దాడులకు గురయింది. క్రీ.శ.1297, 1394, 1607 ల్లో ద్వంసం చేసి దోపిడీ చేశారు. స్వాతంత్ర్యం లభించాక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆలయ పునర్నిర్మాణం చేయబడింది. ఎన్ని కాలాలు గడిచినా చెరగని, తరగని భక్తి ప్రపత్తులతో అశేష జనం అనుదినం సొమనాథున్ని దర్శించి తరిస్తున్నారు.
ఎక్కడా లేని విధంగా ఇక్కడ గర్భాలయం, సభా మండపం, నృత్య మండపం గోపురములు 150 అడుగుల ఎత్తుతో విరాజిల్లుచున్నది. గర్భాలయపు శిఖర కలశం 10 టన్నుల బరువు కలిగి ఉంది, శిఖరద్వజమ్ 27 అడుగులతో చూపరులను ఆకట్టుకొనును. శ్రీ కృష్ణుని నిర్యాణం కూడా ఇక్కడికి సమీపంలోనే జరిగిందని చెపుతారు. అరేబియా సముద్రం ప్రక్కన ఉండే ఈ క్షేత్రం కడు రామనీయస్థలం.

Share:

దేవతలు నిర్మించిన శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయం.

పచ్చని కోనసీమ అందాలు, విశాలంగా పరుచుకున్న సుందర దృశ్యాల నడుమ అలరారుతున్న ‘అయినవిల్లి’ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరానికి సమీపంలో ఉంది. పవిత్ర గోదావరి నదీమతల్లి పాయ ఒడ్డున అలరారుతున్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామివారి ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థల పురాణాలు చెప్తాయ. సర్వశుభ కార్యాలలోనూ విఘ్నేశ్వరునికే అగ్ర పూజ. దేవతాసమూహంలో గణపతికి విశిష్టస్థానముంది.
విష్ణువు ఆయనే…ఓంకారం ఆయనే… సిద్ధిని, బుద్ధినీ ఇచ్చేది ఆయనే…అలాంటి మహిమాన్విత దైవం విఘ్నవినాయకుడు కొలువైన దివ్యథామం అయినవిల్లి. అనంతరంతర కాలంలో ఆలయ పునర్నిర్మాణాలు, అభివృద్ధి పనులు పెద్దాపురం సంస్థానాదీశులు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల తెలుపుతున్నాయ. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో చేసిన దక్షయజ్ఞం నిర్వహించేముందు విఘ్నవినాయకుడైన అయినవిల్లి వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడ్ని ప్రతిష్టించాడని మరో కథ ప్రచారంలో ఉంది. సిద్ధివినాయక స్వామి ఆలయంతోపాటు కొన్ని ఉపాలయాలతో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికానురక్తిని ద్విగుణీకృతం చేస్తుంది.
ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే స్వామి విఘ్నేశ్వరుడు. తనలో ఈశ్వర అంశను పుణికిపుచ్చుకున్న ఆ స్వామి తనను నమ్మి దర్శించే భక్తుల మనోభిష్టాలు నెరవేరుస్తాడని భక్తులు దృఢంగా నమ్ముతారు. ఆ కారణంగానే భక్తులు సర్వప్రాపంచిక విషయాలు పక్కనపెట్టి, నిర్మల చిత్తంతో దక్షిణ ముఖంగా ఉన్న సిద్ధివినాయక స్వామిని మనసావాచా కొలుస్తారు. అలాగే ఇక్కడ కొలువైన స్వామిని దర్బ గడ్డితో పూజిస్తే, మనోవాంచలన్నీ నెరవేరుతాయన్న నానుడి ఉంది. భక్తజన సందోహంతో సందడిగా ఉండే ఈ ఆలయంలో స్వామికి నిత్య పూజలు, అర్చనాభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశే్వశ్వరస్వామి దర్శనమిస్తారు. సాక్షాత్తు విఘ్నవినాయకుడికి తల్లిదండ్రులైన ఆ తేజోమూర్తుల దర్శనం శుభదాయకం.
అయినవిల్లి శ్రీ సిద్ధివినాయక క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఒకపక్క కాశీ విశే్వశ్వరస్వామి కొలువై ఉంటే మరోపక్క శ్రీదేవిభూదేవి సమేత కేశవస్వామి నయనానందకరంగా దర్శనమిస్తారు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. శివ అంశతో ఉదయించిన ఆ స్వామి దర్శనం సదా మంగళకరం. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క అయ్యప్పస్వామి, ఇంకో పక్క గంగామాతలు దర్శనమిచ్చి, భక్తులను నిత్యమూ అనుగ్రహిస్తూ ఉంటారు. నిత్యమూ భక్తులతోనూ, వారి అర్చనలు, అభిషేకాలతోనూ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ దివ్యధామంలో కొలువైన శ్రీ సిద్ధివినాయకస్వామి దర్శన భాగ్యం పూర్వజన్మల సుకృత ఫలంగా పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు. ఆ స్వామి యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గలవారికి విద్యాగణపతి. సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత. ఏకాత్మకు సంకేతమయిన వినాయకుడు విశ్వజన ప్రియుడు.

Share:

పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూన్న శివలింగం.

దక్షారామం కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు.పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని చెబుతారు. దానికి తగ్గట్లుగానే పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూ నేత్రానందం కలిగిస్తారు స్వామి వారు. దేవాలయానికి అభిముఖంగానున్న సోమకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేశంలో మరో శివాలయంలోనూ లేని విధంగా, ఆలయానికి ఎదురుగా ఎత్తైన స్తంభం మీద కూర్చున్న నందీశ్వరుడూ ఇక్కడే కనిపిస్తాడు. స్వామి వారి ఆలయంపైనే అన్నాపూర్ణాదేవి కొలువై ఉండటం మరో విశేషం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమం లో తూర్పు ముఖం గా ఉంటాడు అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకో వచ్చు .
.
1434 లోదేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు .ఒక సారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమ రామం లో శివుని అమృత లింగ శకలం పడి ఉందని ,అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అన్న పూర్ణా సమెత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు .అలాగే మాటలు వచ్చాయి రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు.
.
దక్షిణం లో సూర్య నారాయణుడు ఉత్తరం లో సుబ్రహ్మణ్య స్వామి ,ఈశాన్యం లో నవ గ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖం లో గణపతి ,ఉత్తరాన కుమార స్వామి ,సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖం గా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మ వారు కోటి కాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు .గర్భాలయం లో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తునకన్పిస్తాడు .దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్న పూర్ణ అమ్మ వారు దర్శన మిస్తారు .దక్షిణాన కళ్యాణ మండపం ఉంది .
.
రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు శాప విమోచనం తెలప మంటే చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అక్కడి శివుడిని అషె కిస్తే .విమోచనం జరుగుతుందని చెప్పాడు అలాగే చేశాడు.అందుకే అది చంద్ర పుష్కరిణి అని పేరొచ్చింది స్వామిని కి సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది .

Share:

ఒకే శివ లింగానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య అని పేర్లు గల ఆలయం.

ఎతైన కోండల నుండి విచే చల్లని గాలి పిట్టల కిలకిల రావలు పింఛాలు విప్పి ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఇన్ని కావు ఆశ్చర్యముగా చూడవలసినవి మరేన్నోకలవు. రాజస్థాన్ లో ఉదయ పూర్ కు దగ్గర లో ‘’ఏక లింగ జీ ‘’ఆలయం గొప్ప శైవ క్షేత్రం .గర్భాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండటం వింత .శివ లింగం నల్లని రాతితో మలచ బడింది .దీనికి నాలుగు ప్రక్కలా నాలుగు ముఖాలు ఉండటం విచిత్రం ఈ ముఖాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్య అని పేర్లు .ఆదిశంకరులు పూజించిన లింగం అవటం మరో విశేషం .స్వామిని ఏక లిగాజీ అని అమ్మ వారిని ఏక లింగేశ్వరి అని అంటారు ఈ ఆలయం ఖాట్మండు లోని పశు పతి నాద దేవాలయాన్ని పోలి ఉండటం మరో విశేషం .అక్కడ ఊర్ధ్వ ముఖం కూడా ఉంటుంది.దానికి యజమాని లింగం అని పేరు.

Share:

సర్పముచే ప్రతిష్ఠించబడిన నారాయణ స్వామి.

.
కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ స్వామి గా ప్రతిష్ఠ చేశాడట. ఇది పురాణాలలో చెప్పిఉన్నందున, ఈ ప్రతిష్ఠని పురాణవ్యక్తమైన మూర్తి అంటారు. ఒక సర్పముచే ప్రతిష్ఠించబడిన మూర్తి గల క్షేత్రం కనుక ఈ ఊరిని సర్పవరం అని పిలుస్తారు.
ఒకసారి నారద మహర్షి దేవతలసభలో 'విష్ణుమాయను తెలుసుకోవడం నిరంతర నారాయణ జపం చేసే తనకు సాధ్యమని ' పలికెనట. తరువాత కొంతకాలానికి ఆయన భూలోక సంచారంచేస్తూ ఒక సుందరమైన సరస్సు చూసి, అక్కడ స్నానము చేయవలెనని తలచి, ఆసరస్సులో మునిగి తేలేసరికి విష్ణుమాయ వలన స్త్రీ రూపం పొదుతాడు.స్త్రీరూపంలో ఉన్న నారదుడిని నారదస్త్రీ అని వ్యవహరిస్తారు.
ఆమె పీఠికాపుర మహారాజుని వివాహమాడి 60మంది సంతానాన్ని కంటుంది.వారి పేర్లే 60 తెలుగు సంవత్సరాలపేర్లని చెబుతారు.పొరుగు రాజ్యంతో జరిగిన యుద్దంలో నారదస్త్రీ యొక్క భర్తా, 60మంది సంతానమూ మరణిస్తారు. అప్పుడు ఆమె ఆకలిబాధతో తనవారినిపోగొట్టుకొన్న దు:ఖ్ఖాన్ని కూడా మరచి అలమటిస్తుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్న సరస్సులో ఆమె ఎడమచేయి తడవకుండా స్నానం చెయ్యమని చెబుతాడు.
అతనుచెప్పిన విధంగానే సరస్సులో స్నానం చేసి భయటకు వచ్చేసరికి ఆమెకి అసలు రూపం వస్తుంది కానీ ఎడమచేతికి ఉన్న గాజులు అలానే మిగిలిపోతాయి. బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు. నారదమహర్షి విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి వాటిని వదిలించుకొంటాడు. అప్పుడు నారద మహర్షి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నారదుని గర్వమనే భవరోగాన్ని వదిలించినస్వామి కనుక ఈయనను భావన్నారాయణ స్వామి అంటారు. ఋషిచే ప్రతిష్ఠించబడినది కావున ఈ క్షేత్రాన్ని ఆౠషం అంటారు.
ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.
కాకినాడలో, సర్పవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని చెప్పబడుతున్న ఒక దేవాలయం ఉంది! అదే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం. ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, పురాతనంగా కనిపించే మండపమూ, ప్రవేశద్వారాలూ, నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబమూ… మనకి ఒక కొత్త అనుభూతి కలుగజేస్తాయి. గాలిగోపురానికి ఎదురుగా రోడ్డుకి అవతలివైపు నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను ఉంది.
మాఘమాసంలో నాలుగు ఆదివారాలూ తిరుణాళ్ళు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది.

Share:

యమ తీర్థం శివాలయం.


ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడినది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు.
ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయం లో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .
పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు.
దేవతలు
ఈ దేవాలయానికి ఉత్తర దిశగా పెరియ నాయకి అమ్మన్ దేవాలయం విడిగా ఉన్నది. బయటి భాగంలో ప్రాకారాల నిర్మాణం తర్వాత ఇది ప్రధాన దేవాలయంలో ఒక భాగంగా నెలకొంది. ప్రస్తుతం ఆలయంలో దెవత నిలబడి ఉండేటట్లు ఉండే దేవాలయంగా వేరుగా నెలకొంది.
ఈ దేవాలయం అనేక శిల్పాల సమాహారం. ఇందులోఅనేక రాతి శిల్పాలు నెలకొన్నవి. ఈ దేవాలయం బృహదీశ్వరాలయం లేదా గంగైకొండ చోళీశ్వర దేవాలయాల కంటే కొంచెం చిన్నది. శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాశ్వత వినోదం కోసం నిర్మించబడినట్లు తెలుస్తుంది.
ఈ దేవాలయం యొక్క మహద్వారం తూర్పు వైపున కలదు. ఈ వేవాలయ విమానం (టవర్) 24 మీ (80 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయం లోని గర్భగుడి అక్ష మంటపాలతో మరియు పరివృత్త మార్గంతో గాని కూడుకొని లేదు. దాని దక్షిణ వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు మరియు గుర్రాలతో కూడుకొని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయం మంటపాలు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడి ఉంటాయి. అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి. అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో "బలిపీఠం" కలదు. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు కలవు. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది.
నైరుతి మూలలో గల మంటపం లో నాలుగు విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడు విగ్రహం. ఈ విగ్రహంతోపాటు అతి పెద్ద రాళ్లపై "సప్తమాతలు" యొక్క శిల్పాలు చెక్కబడినవి. విడిగా నిర్మించబడిన దేవీ యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడినది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనదైనందున దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది.
ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో "కుళుత్తుంగ చోళుడు (రెండవ)" దేవాలయాన్ని పురరుద్దరించినట్లు తెలుస్తోంది.
వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం మరియు వివరాలు ఉన్నవి. వారి జివితంలో ప్రధాన ఘట్టాలు అందులో ఉన్నవి. హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేవాలయంలో రాజరాజ II కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలున్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి మరియు నర్మద వంటి నదీమ తల్లుల గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నవి.
ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004 లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం లోని చండైకొండ చోళీశ్వరాలయం మరియు దారసురంలోని ఐరావతేశ్వరాలయం లు ప్రసిద్ధమైఅంవి. ఈ దేవాలయానన్నీ 10వ మరియు 12 వ శతాబ్దముల మధ్య చోళుల కాలంనాటివి. మీ మూడు దేవాలయాలకొ అనేక పోలికలున్నాయి.

Share:

నేడే ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం.

* రాయలసీమ అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం ...
* జాంబవంతుడు ప్రతిష్టించింన సీతారాముల విగ్రహాలు..
* శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన స్థలం...
.
.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక ఒంటిమిట్ట ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
.
ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది. మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.
.
ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రయైన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి భాకరాపేట వెళ్ళే మార్గమధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్ళారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గుపక్కల కొండలే కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు. గ్రామంలో ఓ ముసాఫరుఖానా(యాత్రికుల నిలయం) ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు.
.
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
.
చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ప్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకిత మిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీప వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.
.
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధి తో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తి కి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.
.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

శివలింగం చుట్టూ సంచరిస్తున్ననాగుపాములు.

మహబూబ్‌నగర్ జిల్లా, బల్మూరు మండలంలోని కొండనాగుల సమీపంలో ఉన్న గుడిబండ శివాలయం. ఈ ఆలయం, శ్రీశైలంకు దాదాపుగా ఒకే రకమైన్న పోలికెలు కన్పిస్తా యి. కాకతీయ రాజుల కాలంలో నాగేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. కొండపై నాగుపాములు శివలింగం చుట్టూ సంచరించడంతో ఇది నాగలింగేశ్వర ఆల యంగా ప్రసిద్ది చెందిందట.
రానురాను ఆలయం రామలింగేశ్వర ఆలయంగా మారిందని స్థానికులు చెబుతరు. కర్నాటక, మహారాష్ట్ర, తదితర దూర ప్రాంతాల నుం చి వచ్చే భక్తులు ఈమార్గాల నుంచి శ్రీశైలం వెళ్లే వా రు. అటవీ మార్గం ద్వారా వెళ్లే భక్తులకు ఈఆలయం ఆ రోజుల్లో సేద తీరడానికి ఎంతో ఉపయోగపడేదని గ్రామస్తులు తెలిపారు.
శివలింగంపై పడనున్న సూర్యకిరణాలు....
ఈ ఆలయంలో ప్రతి మహాశివరాత్రికి రెండు రోజుల పాటు ఉదయం సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడుతాయి. ఆ సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో పూజ లు చేస్తుంటారు. ఆ రోజుల్లో బో ళాశంకరుడు సాక్షాత్తు ఇక్కడ దర్శనమిస్తారని ప్రజ ల విశ్వాసం. శివరాత్రికి ఆలయంలో జరిగే కాల్యాణ మహోత్సవానికి ఈచుట్టు పక్కల ప్రజలు అధిక సం ఖ్యలో తరలివస్తారు.
శ్రీశైలంలో గర్భాలయానికి మొ దటి పూజలు అందుకునే వినాయకుడు దర్శనమివ్వ గా ఇక్కడ ఆలయ గర్భగుడికి వినాయక విగ్రహం ద ర్శనమిస్తుంది. గర్భగుడిలో స్వామి వారితోపాటు భ్ర మరాంబికదేవి, సూర్య భగవానుల విగ్రహాలు ఉన్నా యి. శ్రీశైలానికి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నట్లుగా ఈ ఆలయానికి మూడువైపుల ద్వారాలు ఉన్నాయి. కోనేరు పక్కనే స్వామి వారి పాదాలు వెలిశాయి.
చెంచులే ధర్మకర్తలు..
ప్రస్తుతం ఆలయానికి ఇక్కడి చెంచులే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో కొన్ని సంవత్సారాల కిందట గుప్తనిధుల కోసం కొంత మంది దుండగులు తవ్వాకాలను జరిపారు. ఆలయం చుట్టూ కొండ ఉండడంతో బ్లాస్టింగ్ చేసి కొండను పగులకొట్టి రాళ్ల కోసం ప్రయత్నాలు చేయగా ఆలయం చుట్టూ పగుళ్లతో నెర్రెలు ఏర్పడ్డాయి. ఆలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖకు 2006లో నమోదు చేయించారు. ప్రతి వహాశివరాత్రికి ఆలయంలో స్వామి వారికి కల్యాణ మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చెంచులే తమ సొంత ఖర్చులతో నిర్వహిస్తారు.

Share:

తిరువల్లిక్కేణి క్షేత్రం.

సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వర స్వామి పార్థసారధిగా ఇక్కడ వెలసినాడని అంటారు. ఈ పార్థసారధి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఇంకో కథ ప్రకారం శ్రీ రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి సంతానం కొఱకు స్వామిని వేడుకొనగా రామానుజాచార్యుడు జన్మిస్తాడు. మఱియొక కథ ప్రకారం పార్థసారథి స్వామి ధర్మ సంస్థాపనకు విశిష్టాద్వైతాన్ని ఆవిష్కరించడానికి రామానుజాచార్యులగా జన్మించాడని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికి తిరువల్లిక్కేణి అని పేరు. ఆంగ్లేయులు తిరువల్లిక్కేణి ని ట్రిప్లికేన్ అని వ్యవహరించిరి .
చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేను(తిరువల్లిక్కేణి)లో కలదు. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది.
మహాభారత ఇతిహాస ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథసారధిగా ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఇరువైపుల ఉన్న బంధువు యుద్ధ సంగ్రామంలో మరణిస్తారని తలచి అస్త్రాలను విడిచి పేడుతుంటె కృష్ణుడు భగవద్గీతను భోధించి అర్జునుణ్ణి యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాళ్ళను తెలియజేస్తూ ఇక్కడి మూల విరాట్టుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భీష్ముడు విడిచిన అస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడ తగలడం వళ్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. పార్థసారధి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు.

Share:

ఓం.. ఓంకారం...

సృష్టి ఆరంభంలో బ్రమ్హ్మ దేవుడు, శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు వారిరువురి మధ్యన ఓంకార నాదంతో లింగా కారంలో ఉన్న అగ్ని ఉద్భవించినది. అది ఎవరా ? అన్న ఆశ్చర్యానికి లోనైనా వారికి " మీ ఇరువురలో ఎవరైతే నా అది అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప " అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా, మహా విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళం లోనికి వెళ్ళారు. ఎంతో దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొన లేక పోయారు. శ్రీ హరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని విధాత మాత్రం తాను లింగ అగ్ర భాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపారు. అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగ రాజు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించారని, వంత పాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు. ఈ సంఘటన జరిగినది , తొలిసారి ఓంకార నాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి "ఓంకారం" అన్న పేరోచ్చినదని స్థానిక నమ్మకం.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. మూడుపక్కలా పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతితో కూడిన ప్రదేశంలో ఉంటుంది శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆలయం. శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం.
స్వచ్చమైన గాలి, పచ్చని ప్రకృతి, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధి, అందరికి అన్నం అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం, ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం.
విజయనగర సామ్రాజ్యాదీశుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంత కాలమిక్కడే ఉన్నారని అంటారు. దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వట వృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. అపర ఆంజనేయ భక్తులైన వ్యాస రాయలు తమ నిత్య పూజకై అంజనా సుతుని ప్రతిష్టించారు. ఈ ప్రాంతాలలో పేరొందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరి ప్రతిస్టే అని ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
అదే వృక్షం క్రింద విఘ్న నాయకుని విగ్రహం, ఎన్నో నాగ ప్రతిష్టలు ఉంటాయి.
రాతి మండపాలను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూతి కుంకుమ లెపనాలతొ సదాశివుడు లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు.
ప్రక్కనే అమ్మవారి సన్నిధి ఉంటుంది. ప్రతినిత్యం ఎన్నో అబిషేకాలు, అర్చనలు, పూజలు, అలంకరణలు ప్రధాన అర్చనా మూర్తులకు జరుగుతాయి. ఆలయానికి సమీపంలోనే అవధూత శ్రీ కాశి నాయన ఆశ్రమం ఉన్నది. ఓంకార క్షేత్ర సందర్శనార్ధం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం లభిస్తుంది ఈ ఆశ్రమంలో. ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ శనేశ్వర స్వామీ తపో వనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహా మూర్తులను ఉంచారు.
ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతుంటారు.

Share:

పెళ్లి నిశ్చయమయ్యాక అమ్మవారి ఆశీర్వాదం పోందిన కలియుగ శ్రీనివాసుడు, పద్మావతమ్మ.

పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట. అప్పుడు పార్వతీదేవీ అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకి అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయాక్షిగా వెలిసిందట. అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట. తరువాత కాలంలో అగస్త్య మహర్షి, ఆకాశరాజు... ఆ చిన్న విగ్రహం వెనుకనే, అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమకుణ్ణి సంహరించిన ఈ అమ్మ కాళికామాతను పోలి ఉంటుంది.
వేదాలను పరిరక్షించి వెలసిన తల్లి... ఆకాశరాజు కులదైవం... పద్మావతీదేవి నిత్యం కొలిచిన దేవి... ఆమ్నాయాక్షి. శ్రీనివాసుడు, పద్మావతిలకు వివాహం నిశ్చయమయ్యాక కల్యాణానికి ముందు ఈ అమ్మనే దర్శించుకున్నారట. చిత్తూరు జిల్లా నారాయణవనం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం మరెన్నో విశేషాలకు ఆలవాలం.
ఆమ్నాం అంటే వేదమనీ, అక్షి అంటే కన్నులు అనీ అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి... ఆ తల్లికి ఆమ్నాయాక్షి అనే పేరువచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనం(వరం) గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.
లక్ష్మీదేవి అవతారంగా చెప్పే పద్మావతీ దేవి తండ్రి ఆకాశరాజు. వాళ్ల కులదేవతే అవనాక్షమ్మ. అప్పట్లో ఆకాశరాజు కోట ముందుభాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లేముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట. ఆయనకు చాలాకాలం వరకూ పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీదేవి తండ్రితో సహా రోజూ ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయణవనంలోని ఉద్యానవనంలో ఓరోజు శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది పద్మావతి. ఆ శ్రీనివాసుణ్ణే తనకు భర్తను చేయమని అవనాక్షమ్మను కోరుకుందట. శ్రీనివాసుడు, పద్మావతిలకు పెళ్లి నిశ్చయమయ్యాక... వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పద్మావతి ఈ ఆలయంలో గౌరీవ్రతం చేసిందట. పరిణయం తరువాత వాళ్లిద్దరూ తిరుమలకు వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు 'పద్మావతీ పరిణయం' పుస్తకంలో ఉంది.
అవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్త్యీశ్వరాలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారట. ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు. ఈ గుడిలోని అమ్మవారిని మరకతవల్లి అంటారు. సాధారణంగా శివాలయాల్లో ముందు శివలింగం, దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు. కానీ, ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉండి, ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం. పద్మావతీ దేవికి ఒకానొక సమయంలో జబ్బుచేసిందట. అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయించగా వ్యాధి నయమైనట్లు 'వేంకటాచల మహత్యం'లో ఉంది.
ఈ ఆలయానికి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కానివారికి వివాహం అవుతుందనీ, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారనీ భక్తుల నమ్మకం. అమ్మవారికి ఏటా 18రోజులపాటు జాతర జరుగుతుంది. ఏటా అక్టోబరులో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.
ఈ ఆలయానికి దాదాపు మూడువేల సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట ఆకాశరాజు, తరువాత కార్వేటి వంశస్థులు, అనంతరం తిరుత్తణి రాజులు దీని అభివృద్ధికి కృషిచేశారు. 1967లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చింది. అప్పట్నుంచీ పూజాద్రవ్యాలూ వసతులూ అన్నీ వారే సమకూరుస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం రాష్ట్రపర్యాటక అభివృద్ధి సంస్థ వసతులు సమకూర్చింది. భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు వీలుగా షెడ్డు, ఇతర సౌకర్యాల్లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించారు.
అవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతోపాటు పెద్ద విగ్రహం, శాంకరీదేవి విగ్రహం, వేపచెట్టుకింద గణపతి విగ్రహం, ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయం ముందుభాగంలో రెండు పెద్ద రాతిస్తంభాలున్నాయి. వీటి మధ్యలో భారీ గంట ఉండేదట. అమ్మవారికి పూజలు నిర్వహించే సమయంలో దీన్ని మోగిస్తే చుట్టుపక్కల గ్రామాలూ పొలాల్లో ఉన్నవారు అవనాక్షమ్మను ప్రార్థించేవారని చెబుతారు.
అవనాక్షమ్మ ఆలయం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే బస్సు ఎక్కి నారాయణవనంలో దిగాలి. అక్కడి నుంచి కిలోమీటరు నడిస్తే ఆలయం వస్తుంది. రైళ్లలో వచ్చేవారు తిరుపతి, పుత్తూరు (5 కి.మీ. దూరం) నుంచి రావచ్చు.

Share:

ఆత్మీయ మిత్రులకు, ఆత్మ బంధువులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.!!​

* శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ...
* సీతారామ కళ్యాణం చూస్తే వచ్చే ఫలితం ఏమిటి...?
* సీతమ్మతో రాముని కళ్యాణం ఎలా జరిగింది..?
.
.
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం...
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్...
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం...
రామం నిశాచర వినాశకరం నమామి...
అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
.
తాను చేస్తున్న యాగాల రక్షణ కొరకై శ్రీరామ లక్ష్మణులను తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తరువాత వారిద్దరినీ మిథిలకు తీసుకుపోతాడు. అక్కడ జనకుడు యజ్ఞాన్ని చేస్తుంటాడప్పుడు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. మునీశ్వరుడిని సేవించాడు. ఆయన వెంటే వున్న రామ లక్ష్మణులెవరని ప్రశ్నించాడు జనకుడు. వారు దశరథ మహారాజు కొడుకులని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను చంపారని, వారిద్దరూ ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూసేందుకొచ్చారని అంటాడు విశ్వామిత్రుడు. మర్నాడు ఉదయం జనక మహారాజు ఆహ్వానం మేరకు శివ ధనస్సును చూసేందుకు వెళ్లారు రామలక్ష్మణులు. తన దగ్గరున్న ధనుస్సు విషయం చెప్పి, దానిని ఎక్కుపెట్టగల వాడికే తన కూతురు సీతను ఇస్తానని చెప్పాడు. దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపిస్తానని, శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే తాను అదృష్టవంతుడిని, అయోనిజైన సీతను ఆయన కిస్తాను అని అంటాడు.
.
జనకుడి ఆదేశం ప్రకారం, ఐదువేల మంది బలశాలులు ఇనుప పెట్టెతో సహా దాంట్లో వున్న పెద్దవింటిని తెచ్చారు వారున్న చోటికి. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని-తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. విశ్వామిత్రుడు, జనకుడు అంగీకరించగానే, రాముడు, అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరూ చూస్తుండగా అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. ఆ వెం టనే నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్పగుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను’’ అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేశాడు కాని, రాముడందుకు అంగీకరించలేదు. తనను విశ్వామిత్రుడు చెప్పిన పని చేయాల్సిందిగా తన తండ్రి ఆజ్ఞాపించాడని, ఆయన వింటిని చూడమంటే చూసానని, ఎక్కుపెట్టమంటే పెట్టానని, అంటూ, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞ లేదని జనకుడికి చెప్పాడు. జనకుడు దశరథ మహారాజుకు కబురు పంపి ఆయన్ను పిలిపించాడు.
.
మిథిలా నగరం చేరుకున్న దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాక వంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. ఇది సాంప్రదాయ బద్ధంగా వచ్చే ఆచారం. తదనుగుణంగానే, వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు వెంటనే. ఆ తరువాత ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడు. శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, దశరథుడి ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటాడు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని విశ్వామిత్రుడు సూచించగా దానినీ అంగీకరించాడు జనకుడు. రెండు రోజుల తరువాత వచ్చే ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున వివాహంచేద్దాం అని అంగీకారం కుదిరింది. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి భగుడనే ప్రజాపతి అనీ, ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసించారు.
.
ముహూర్తం రోజు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు దశరథుడు. చక్కటి ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించారు. వశిష్టుడితో జనకుడు, త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్ర్తోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.
.
‘‘సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస/ ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్‌’’.
అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:
‘‘ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా / కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్‌’’.
‘‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్‌ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’’ అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు.
.
సంతోషాతిషయంతో దేవతలు పూల వాన కురిపించారు. దేవదుందుభులను చాలాసేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు, తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సుల నుండి తొలగించుకున్నారు. ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, ‘‘లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు’’ మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది.
.
సీతా కల్యాణ ఘట్టం చదివిన వారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘‘కౌసల్యా సుత’’ అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? సీ్త్ర పేరుతో పిలవకుండా, వాడుక పేరైన ‘‘రామా’’ అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘‘ఈ సీత’’ అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణ మంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు జనకుడు.

Share:

జ్ఞానామృతాన్ని కురిపించిన ‘శ్రీ పిచ్చమాంబ’.

* మహిమాన్వితరాలు ‘శ్రీ పిచ్చమాంబ’ 
* శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ వంశ జ్ఞాన ప్రభోదకురాలు ‘శ్రీ పిచ్చమాంబ’
* కడప జిల్లా చరిత్రలో విశిష్టమైన ‘శ్రీ పిచ్చమాంబ మఠం’
* మైదుకూరులో వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్టమైన స్థానం.
.
Sri Pichamamba Matam, Mydukur Mandal, Kadapa District, AP

ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, భగవంతునితో తనకు గల అనుబంధాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధగల వారికే ‘గురువు’ అత్యంతావశ్యకం. అందుచేత ప్రామాణికులైన గురువును శరణువేడితే, భగవంతుని శరణు వేడినట్లే. శిష్యుడు గురువుకు చేసిన శరణాగతిని భగవంతుడు తనకు చేసిన శరణాగతిగా స్వీకరిస్తాడు.
.
గురువు, దేవుడు వేర్వేరు కాదు ఒక్కడే. వేదవ్యాసుడు సాక్షాత్‌ విష్ణుస్వరూపుడు. భగవంతుని అవతారాల్లో ప్రతిద్వాపరంలోనూ విష్ణువు వ్యాసుడై ఆవతరించి కర్మ, భక్తి, జ్ఞానాలను ప్రబోధం చేసి సమాజాన్ని ధార్మిక నిష్ఠతో నడిపిస్తాడని విష్ణుపురాణాది గ్రంథాలు పేర్కొన్నాయి. ద్వాపరయుగంలో విష్ణువు వ్యాసరూప జ్ఞానావతారుడై సమాజసేవ చేశాడు. వేదవ్యాసులవారు మన భారతీయ సంస్కృతి మహాపురాణాలను, మహాభారత ఇతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని, బ్రహ్మసూత్రాలను అందించి మనలో కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసాడు. భారతీయులందరూ జ్ఞానవిజ్ఞాన సంపన్నతకై వ్యాసభగవానుని స్మరించుకుని, తమ జీవిత రూపురేఖలు ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటట్లుగా చేసుకుంటున్నారు. బ్రహ్మ, వశిష్ఠ, శక్తి పరాశర, వ్యాస, శుక, గౌడపాద, గోవింద భగవత్పాద, శంకరాచార్యులను స్మరించుకుని, గురుపరంపరని పూజించాలి. వ్యాసమహర్షి గురుపరంపరకు ఆద్యుడు. మన భారతీయ సంస్కృతిలో గురువుకు ముందు ప్రథమ గురువులైన తల్లిదండ్రులను సైతం పూజించడం ఓ సంప్రదాయంగా వస్తోంది.
.
శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ వంశం నందు శ్రీ సిందే పెద్ద వేంకట రాంజీ శ్రీమతి వెంకమాంబ లకు కొత్తబ్బి అనే పెద్ద మారుడు జన్నించినాడు. శ్రీ పిచ్చమాంబ ప్రేమతో నాన్నను పెద్దయార్యులు (పెద్దయ్య) అని పిలిచేది. పెద్దయ్య గారు 12 సంవత్సరాల ప్రాయం నుండే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ గారి ప్రియ శిష్యప్రశిష్యులలో బజ్బిగారి వెంకటమ్మకు ప్రియ శిష్యుడుగా పెద్దయార్యులు సేవ చేసేవారు. శ్రీ ఈశ్వరమ్మ గారి ప్రియ శిష్యప్రశిష్యులలో ఒక్కరైన జడల రామయ్య. వీరి ప్రియ శిష్యుడు సద్విద్వాంసుడైన మోరె జోగయ్య భోధనలు చేస్తుండేవాడు. శ్రీ జోగయ్య - లక్ష్మాంబ పుణ్యదంపతుల ఏకైక కూమార్తె ఈశ్వరాంబ ను పెద్దయార్యులకు ఇచ్చి వీరి స్వగ్రాం నరసాపురం నందు వివాహం జరిపించినారు. ఈశ్వరాంబ కు పెద్దయార్యులకు పెద్ద కూమార్తెగా పిచ్చమాంబ జన్మించింది. పెద్దయార్యుల సోదరి కుమారునికి 5 సంవత్సరాలు నిండకముందే పిచ్చమాంబకు వివాహం జరిపించినారు.
.
పిచ్చమాంబ తండ్రిగారైన పెద్దయార్యులు నరసాపురం వదలి మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామం చేరి అక్కడి పిల్లలకు ఉపాధ్యాయుడై విద్యను భోదించేవాడు. చుండుపల్లె వెంకయ్య సహసేవకుడిగా పని చేసినాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి మఠంకు పోయి అక్కడ పూర్ణబ్రహ్మవిచారులైన సాధుపుంగవులకు మరియు భక్తులకు అన్న ప్రాసాదులను తమ శక్తి కొలది సమర్పించుచు, వారి సువిచారమువల్ల సత్యమును గ్రహించుచు పెద్దలయందు నిరహంకార బుద్ధితో మెలంగుచు నిజమేరింగి ప్రభుసత్తముడు.
.
పిచ్చిమాంబ యుక్త వయస్సు రాగానే తల్లి తండ్రులు అత్తరింటికి పంపించడం జరిగింది. కొద్ది సంవత్సరాల తరువాత పూర్వజన్మపుణ్య ఫలంగా పిచ్చమాంబకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ దర్శనంతో దైవాంతసంభూతరాలైంది. అత్తరిల్లు వదిలి తండ్రిగారి వద్దకు వచ్చింది. పెద్దయార్యులు పిచ్చమాంబ పరిస్థతిని గమనించి దైవమార్గమును పరిపూర్ణతో భోధించి, అమ్మా నీవింక జ్ఞానోపదేశము చేయమని తండ్రిగారు ఆజ్ఞాపించినారు. తండ్రిగారి అజ్ఞానుసారం పిచ్చమాంబ భక్త జనులకు జ్ఞాన అమృతాన్ని పంచిపెట్టుతుండేది. కొంత కాలానికి అచలబోధయందు కొంత సందేహము రావడంతో పోకల వేంకట నరసింహా రావు గారిని దర్శంచి అప్పుడు పరిపూర్ణ వాత్సత్యంతో అమ్మా నీవుఇప్పుడు చెప్పిన మీ తండ్రిడారి భావము సత్యమైనది. అంత కంటే మరేమిలేదని ద్వాదశి, షోడశి, పంచదశి మహా మంత్రములను వివరించి, భోధించి ఇదియే నీకు శ్రీ శివరామదీక్షితుల పరంపర యగుటవలన పిచ్చమాంబ శ్రీవారిని రెండవదైవముగా పూజించి జ్ఞానఅమృతాన్ని భోధిస్తుఉండేది.
.
శ్రీ పిచ్చిమాంబ ఉపదేశం...
”గురుచరణాంబుజ నిర్భర భక్త: సంసారా దచిరాద్భవముక్త:
సేంద్రియ మానస నియమాదవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్‌”
అన్నారు శ్రీపిచ్చిమాంబ గారు.. గురుపాద పద్మముల యందు తొణకని బెణకని నిండైన భక్తి కలవాడై సంసారము నుండి విముక్తుడివికా, ఇంద్రియములతో కూడిన మనస్సును నియమించినందువల్లనే హృదయంలో ఉన్న ఆత్మతేజాన్ని చూడగలుగుతావు. పారమార్థిక విషయాల్లో గురుభక్తి లేనివాడు ఎంత కృషి చేసినా నిష్ప్రయోజనమే. దైవం పట్ల గురువు పట్ల నిరతిశయ దృఢభక్తి గలవానికే పరమార్థసిద్ధి కలుగుతుంది. గురువు అనుగ్రహ పాత్రుడైనవాడు సంసార సాగరం నుండి విముక్తి పొందగలడు. పరమార్థ సాధనకు ఇంతకంటే స్పష్టమైన ఉపదేశం ఏముంటుంది.
.
కడప జిల్లా, మైదుకూరులో వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్టమైన స్థానం కలదు. శ్రీశ్రీ పిచ్చిమాంబ ప్రియ శిష్యుల అభ్యర్థన మేరకు మైదుకూరు మండలం పోరుమామిళ్ళ పోవు రహదారి ప్రక్కన శ్రీ సదానంద ఆశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో దాత్వక చింత, ఆధ్యత్మిక భావాలను పెంపొందించి ఈ ఆశ్రమంను మరింతగా అభివృద్ధి చెందడానికి విశేష కృషి చేసింది. మద్రాసులోని శ్రీ పోకల శేషాచార్యుల మార్గదర్శకత్వంలో శ్రీ పిచ్చమాంబ తారక యోగిగా మారి బృహద్వాశిష్ట సిద్ధాంతాన్ని ప్రతిపదికగా చేసుకొని ఆ సిద్ధాంత భావనలను విస్తృత ప్రచారం కల్పించేందుకు 1931 జూన్ నెలలో సదానంద ఆశ్రమ ట్రస్టును శ్రీ పిచ్చమాంబ ఏర్పాటు చేశారు. సదానంద ఆశ్రమంలో పూజా మందిరం, భజన మందిరాలను ఏర్పాటుచేసి ఆశ్రమంలో అహర్నిశలూ ఆధ్యాత్మిక, తాత్విక కార్యక్రమాలనూ, ధ్యాన పూజూ కార్యక్రమాలనూ నిర్వహించేవారు.
.
కడప జిల్లాలోని పులివెందుల, చవ్వారి పల్లె, పెద్ద అక్కులవారి పల్లె, సున్నపూరాళ్ళ పల్లె, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, యాడికి మరియు మైదుకూరు ప్రాంతంలోని భూమాయ పల్లె, పెద్దపసువుల, స్వరాయ పల్లె కొత్తపల్లె, శేట్టవారి పల్లె నుండి గురుశిష్య పరంపర శ్రీ సదానంద అశ్రమానికి తరలివచ్చి ఇక్కడ కార్యక్రమాలలో రోజుల తరబడి పాల్గోనేవారు. రాష్ట్రం నలుమూలలనుండి గురు భోధకులు తరలివచ్చి ఆశ్రమంలో శిష్యులకు భోధనలు చేసేవారు. శ్రీ పిచ్చమాంబ స్వయంగా తమ శిష్యులకు, జిజ్ఞాసులకూ భోధనలు చేస్తూ, వారి తాత్విక సందేహాలను తీరుస్తూ ఉండేవారు.
.
శ్రీ పిచ్చమాంబ జ్ఞానామృత భోధన కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాలేదు. శ్రీ పిచ్చమాంబ రచించిన శ్రీ ప్రబోధచంద్రోదయం, శ్రీ వీరగురురాజ శతకం, తత్వరామాయణం, తత్వ ప్రబోధిని, అచల శతకం గ్రంధాలనే కాకుండా తాత్విక, శతక, పురాణాలను శ్రీ పిచ్చమాంబ రిచించినారు. శ్రీ వీరగురురాజ శతకం ఆధ్యాత్మిక, విద్యా పరమార్ధాలను గొప్ప వివరణాత్మక గ్రంథంగా పేరుగాంచింది తత్వ రామాయణం అనే గ్రంధాన్ని పోరుమామిళ్ళ మండలంలోని చల్లగిరి గ్రామం లో వెలసిన శ్రీరామచంద్రుని దేవాలయంలో శ్రీ రామ చంద్రుని సన్నిధిలో శ్రీ పిచ్చమాంబ రచించినారు. శ్రీ ప్రబోధ చంద్రోదయం గ్రంథం, శ్రీ కృష్ణుశ్రీయం అనే హిందీ గ్రంధాలన్ని అనువాద గ్రంథంగా శ్రీ పిచ్చమాంబ వెలువరించారు. అలాగే తత్వ ప్రబోధిన లో కందార్థ తత్వాలను శ్రీ పిచ్చమాంబ హలిద్యమైన రీతిలో రూపోందించారు. మానవ దేహ తత్వానికి రామాయణం గాథను అనవయించి రచించిన తత్వరామాయణం తాత్విక సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగంగా శిష్యపరంపరలో శిశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. అంతే కాకుండా శ్రీ పిచ్చమాంబ రచించిన చాల గ్రంధాలు వెలుగోనిరాలేదు. చాల బాధకరానికి గురిచేస్తుంది.
.
శ్రీ పిచ్చమాంబ ఆశ్రమంలో మరో ప్రత్యేకమైన చెక్రాంతి చెట్టు (కొండగోయ్యి) చెట్టు కలదు ఎన్నో ఒౌషద గుణాలు ఉన్నట్టు విజ్ఞాన పూర్వకంగా నిరూపించ బడింది. అంతేకాకుండ దీర్ఘ కాలిక రోగాలు నయమవడంతో పాటు, మరేన్నో వ్యాధులను నయం చేయగల శక్తి ఈ చెట్టుకు కలదు. ఇక్కడ తప్ప మరెక్కడ ఈ చెట్టు కనపడదు.
.
సదానందాశ్రమ నిర్వహణలో శ్రీ పిచ్చమాంబ ఆమే శిష్యులు విశేష సహాకరాన్ని, సేవలను అందించినారు. సదానందశ్రామంలో శ్రీ పిచ్చమాంబ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరగడం వలన కాలక్రమంలో సదానంద ఆశ్రమానికి బదులుగా శ్రీ పిచ్చమాంబ మఠంగా పేరువచ్చింది. తన ప్రబోధ చంద్రోదయ గ్రంధానికి తాను రాసున్న భరతవాక్యంలోని మన దేశంపట్ల, దేశంలోని ప్రజల సుఖ శాంతులపట్ల అపారమైన ఆకాంక్షను శ్రీ పిచ్చమాంబ వ్యక్తంచేశారు. శ్రీ పిచ్చమాంబ మఠంలో అందమైన పూలతోట, పండ్లతోట, మంచినీటి బావి ఉండేవి. 1957 హేవిళంబి నామ సంవత్సరం చైత్రమాసం బహుళ ద్వాదశి శుక్రవారం నాడు శ్రీ పిచ్చమాంబ బ్రహ్మాండయిక్యం అయినారు.
.
భారతవని పరమపారకమైనది. మహామహులైన మహాతత్వవేత్తలు నడయాడిన పుణ్యభూమి. మూర్తిభవించిన మాతృతత్వం మన్నుగా రూపుదాల్చి కొంగుపరిచి తనబిడ్డలకు నివాస క్షేత్రంగా ఏర్పరచిన ఆధారం. జీవితానికీ జీవనానికీ, జాతిమనుగడకూ మూలాధారమైన ఏకైక ఆలంబనం. అదే పుడమితల్లి భారతమాత! భారతభూమి! పరమపావనమైన భారతీయ సంసృతికీ, దైవీభావనలనూ అణువణువునా జీర్ణింపచేసిన మహర్షులు నడచిననేల!భారతదేశం పుణ్యభూమిగా, పేదభూమిగా, ప్రపంచ దేశాలలో తనకంటూ విశిష్టస్థానాన్నీ, విలక్షణ వారసత్వాన్నీ సంతరించుకున్న భారతదేశంలో ఎందరో సాధుపుంగవులు, సాధ్వీమాతాలు, సిద్దులు, అవధూతలు, అవతరించి, భారతదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానామృతానికి తమ భోధనలనూ, రచనలనూ అందించినారు శ్రీ పిచ్చమాంబ అలాంటి మహానీయుల కోవకు చెందిన అమృత మూర్తిగా చరిత్రకు ఎక్కినారు. తెలియని వారికి జ్ఞాని, తెలిసిన వారికి అవ ధూత, భక్తుకు క్పవల్లి, ఆర్తుకు వరదాయిని, జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, మహాయోగి శ్రీ పిచ్చమాంబ గారు.
.
గురు సాంప్రదాయంలో ఉన్నవారంతా తమతమ గురువుల్ని దర్శించి సేవించేరోజున గురువు యొక్క గత కీర్తిని చాటినట్లు అవుతుంది.
అపార కారుణ్య సుధాతరంగై:
అపాంగ పాతైరవలోకయంతమ్‌
కఠోర సంసార నిధాఘతప్తాన్‌
మునీనహం నేమి గురుం గురూణామ్‌..
తస్మై: శ్రీ గురవే నమ:
.........
సేకరణ…
రచన...
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

* ఓం శివోహం ... రుద్రరూపం భజేహం ... * శివునికి అర్చన ఎలా చేస్తే ఏమి జరుగుతుంది…? * శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది...

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోబితలింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ర్పణమామి సదాశివలింగం..
.
అంటూ..ఆ శివుని స్మరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడు నిరాకారుడు. భోళా శంకరుడు. కోరిన కోరికలు తీర్చేవాడు. ఆదుకో శివయ్యా..అని శరణు వేడుకోగానే భక్తులను రక్షించేవాడు.శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. ఆయన పశుపతిగాను, లింగరూపములోననూ సింధు నాగరితక కాలం నుంచే పూజలందుకొంటున్నాడు. శివుడు అనార్యదేవుడు. కాని తర్వాత వైదిక మతంలో లయకారునిగా స్థానం సంపాదించుకున్నాడు. నేటికి దేశమంతా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి.
.
విశ్వమహారూపం శివం, భూకక్ష్య ఎలా ఉంటుందో విశ్వరహస్య మూలాలు ఎలా మొదలయ్యాయో ఆ లయకారక రూపమైన శివలింగం లోనే ఉన్నాయని చెప్తారు పెద్దలు. నిజానికి శివలింగ రూపం అటు స్పేస్ సైన్స్ నీ, ఇటు తాత్విక విశయాలనీ ఒకే విధంగా తనలో ఇముడ్చ్గుకున్న అద్బుత ఆకారం. విశ్వం లో ఆకర్షణ, వికర్షణ బలాల ని వివరించే విధంగా అండాకారం లో శివలింగం ఉంటుంది. నిరాకారాన్ని చెబుతూనే తనే ఆకారమంటూ చెప్పే శివతత్వం ఒక మహాద్బుత మోక్ష మార్గం.
.
అయితే ప్రతీ దైవాన్ని పూజించటానికి భిన్న పద్దతులున్నాయి. ఆకలేస్తుందనీ, నీళ్ళు కావాలనీ, కడుపులో నొప్పిగా ఉందనీ చెప్పటానికి అమ్మకైనా ఒకే సైగతో ఎలా అయితే చెప్పలేమో అదే విధంగా దేవుడికీ అంతే ఒక్కో కోరికకీ ఒక్కో రకమైన ఆరాధనా పద్దతి ఉంది మరి.. అదేమిటో తెలుసుకోండి….
.
శివార్చన ఎలా చేస్తే ఏమి జరుగుతుంది…?
∙ పుష్పోదకము(నీరు,పువ్వులతో అభిషేకిస్తే) చేత అభిషేకించిన భూ’లాభము కలుగును.
∙ ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
∙ మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
∙ అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
∙ రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
∙ బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
∙ తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
∙ నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.
∙ నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
∙ భాస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
∙ మామిడి పండ్ల రసము చేత అభిషేకము ధీర్ఘ వ్యాధులు నశించును…
.
శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది. శివలింగాన్ని వజ్రం నుంచి మట్టి వరకు అనేక అనేక పదార్థాలతో తయారుచేసుకుని పూజించవచ్చు. స్టీలు, ఇనుముతో మాత్రం చేయకూడదని పండితులు చెబుతారు. లింగం చేసిన పదార్థాన్ని బట్టి వచ్చే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.
.
* వజ్రంతో చేసిన శివలింగానికి పూజ చేస్తే ఆయువు వృద్ధి చెందుతుంది.
* ముత్యంతో చేసిన లింగాన్ని సేవిస్తే రోగాలు నాశనం అవుతాయి.
* పుష్యరాగంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే కీర్థి లభిస్తుంది.
* నీలంరాయితో చేసిన లింగాన్ని సేవిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
* మరకతంతో చేసిన లింగాన్ని పూజించడం వల్ల సుఖమైన జీవితం లభిస్తుంది.
* స్ఫటికంతో చేసిన లింగార్చన అన్ని కోరికలను తీరుస్తుంది.
* స్త్రీలు గంధంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే నిండు నూరేళ్ల సౌభాగ్యం లభిస్తుంది.
* ఇత్తడితో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల తేజస్సు దక్కుతుంది.
* ధాన్యపు పిండితో చేసిన లింగాన్ని సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు.

Share:

నీటిపైనే కొలువు దీరిన స్వామి వారిని దర్శించుకోవాలంటే, నడుము లోతు నీటి ధారలో నడుస్తూ, తడుస్తూ సొరంగ మార్గంలో చాల దూరం ప్రయాణించేస్తేగాని చూడలేము.

సొరంగ మార్గంలో కొలువైన దేవదేవుడు: నడుము లోతు నీటిలో, కొంత దూరం సొరంగ మార్గంలో ప్రయాణిస్తే తప్ప జర్న నృసింహస్వామి మూల విరాట్ విగ్రహాన్ని మనం దర్శించుకోలేం. ఈ అరుదైన దేవాలయం జహీరాబాద్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో ఉంది. అనేక చారిత్రక ఆనవాళ్లకు నిలయమైన ఈ పట్టణంలో పేరెన్నిక గన్న సందర్శనీయ ప్రదేశం నృసింహస్వామి దేవాలయం.
బీదర్ పట్టణంలోని జర్న నృసింహస్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం కొండల మధ్య ఉంది. ఒక కొండను తొలిచి దీనిని నిర్మించారు. అంతేకాక, ఈ స్వామి మూలవిరాట్‌ను దర్శించుకోవడానికి నడుము లోతు నీటిలో సొరంగ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది.దుర్జనులను హరించి సజ్జనులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతరాలలో నృసింహస్వామి అవతారం ఒకటి. భయంకర రూపంలో ఉన్నప్పటికీ భక్తులను కరుణించే మహాదేవుడు ఆయన. తన దగ్గరకు వచ్చే భక్తుల భయాలు పోగొట్టి, వారికి ఆభయమిచ్చి చల్లని చూపుతో ఏలుతున్న దేవుదేవుడుగా జర్న నృసింహస్వామి ప్రసిద్ధుడైనాడు. అందుకే, ఆ దేవునికి వద్దకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆశ్చర్యకరంగా సొరంగ మార్గంలోని గుడిలో కొలువై, భక్తుల కోర్కెలను తీరుస్తూ, ఎందరికో ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు. జర అంటే నీటి ధార. ఇక్కడ నృసింహస్వామి వారు ఏ కాలంలోనైనా జరలో కొలువు దీరి ఉంటారు. కాబట్టే, ఈ దేవాలయాన్ని ‘జర్న నృసింహస్వామి దేవాలయం’గా పిలుస్తారు. ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి బీదర్ పట్టణానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తారు. అక్కడ సొరంగ మార్గంలో నీటి ధారలో తడుస్తూ వెళ్లి నృసింహస్వామిని దర్శించుకుని, పూజలు చేస్తుంటారు. ఈ జర్న నృసింహస్వామిని దర్శించుకుంటే పాపాలు, భయాలు తొలగుతాయని పెద్దలు చెబుతుంటారు.
ఎంతో ప్రసిద్ది చెందిన బీదర్ జర్న నృసింహస్వామి దేవాలయానికి వెళ్లాలంటే బస్, రైలు సౌకర్యాలు రెండూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి, జహీరాబాద్ మీదుగా నేరుగా ఆర్టీసీ బస్సులలో బీదర్ పట్టణానికి చేరవచ్చు. అక్కడ ఆటోలు, ట్యాక్సీలను నామమాత్రపు అద్దెకు మాట్లాడుకుని జర్న నృసింహస్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. అనంతరం సొరంగ మార్గంలోని నీటి ధారపై కొలువు దీరిన మూల విరాఠు నృసింహస్వామిని దర్శించుకుని, పూజలు చేసి మొక్కులు తీర్చుకోవచ్చు.
రైలు మార్గం: సికింద్రాబాద్ నుంచి బీదర్ పట్టణానికి చేరుకోవడానికి అనేక రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-ముంబాయి, సికింద్రాబాద్-షిర్డీ, సికింద్రాబాద్-బీదర్ మార్గంలో అవి నడుస్తుంటాయి. బీదర్ నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్‌సిటీ రైల్వే సౌకర్యమూ ఉంది.
ఇక్కడి నృసింహస్వామి మూలవిరాట్ స్వరూపాన్ని చూడాలంటే మాత్రం ఎంతటి వారైనా ఆలయం నుండి మరి కొద్ది దూరం వెళ్లాల్సిందే. అదీ కూడా నీటి ధారలో నడుస్తూ, తడుస్తూ! దాదాపు మోకాలు లోతు నీరు అక్కడ ఉంటుంది. ఈ దారిగుండా కొన్ని ఫర్లాంగుల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లిన తర్వాత సొరంగంలో కొలువుదీరిన అసలు నృసింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని చూసిన భక్తులు ఎంతో తన్మయ త్వం చెందుతారు. ఆనం దంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటా రు. సంవత్సరంలో 365 రోజులు స్వామి వారు ఇలా నీటిపైనే కొలువు దీరి ఉండటం ఇక్కడి విశేషం. వేసవి కాలం..వర్షాకాలం.. శీతాకాలం అంటూ ఏదీ లేదు. ఏ కాలంలోనైనా స్వామి వారు కొలువు దీరిన మార్గంలో నీరు ఉంటుంది. అదీ కూడా నడుము లోతులో ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతో అధ్యాత్మిక భావనతో ఇక్కడి నృసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు మూల విరాఠు రూపాన్ని మనస్సులో తలచుకుంటూ ముందుకు సాగుతారు. అలా తన దగ్గరకు వచ్చే భక్తులను ఎటువంటి ప్రమాదం జరుగకుండా కాపాడుతూ ఉంటాడన్నది భక్తుల నమ్మకం.
విడియోని చూడండి.. https://www.youtube.com/watch?v=XHDAAbN9aQE
Share:

ఎనిమిది వందల ఏళ్లనాటి పురాతన మహిమానిత క్షేత్రం.


శ్రీవాసుదేవపెరుమాళ్‌ ఆలయం... పేరు వింటే, ఎక్కడో తమిళదేశంలోని వైష్ణవాలయమని అనుకుంటాం. కానీ కాదు, శ్రీకాకుళానికి వంద కిలోమీటర్ల దూరంలో... ఆంధ్రప్రదేశ్‌ - ఒరిస్సా సరిహద్దులోని మందస ప్రాంతంలో ఉంది. ఎనిమిది వందల ఏళ్లనాటి ఈ పురాతన ఆలయం శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక.
చుట్టూ పచ్చని వాతావరణం, ఎత్తయిన కొండలు. శ్రీకాకుళం- ఒరిస్సా సరిహద్దులోని వాసుదేవపెరుమాళ్‌ ఆలయాన్ని సందర్శిస్తే...సమస్త వైష్ణవ క్షేత్రాలనూ దర్శించినంత ఫలమని చెబుతారు. ఆవరణలో ప్రవేశించగానే మనసు ప్రశాంతం అవుతుంది. ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. వాసుదేవ పెరుమాళ్‌ ఆలయానికి ఎంతో ఐతిహాసిక ప్రాధాన్యం ఉంది.
దేవకి అష్టమగర్భంలో జన్మించే బిడ్డే... తన ప్రాణాల్ని హరిస్తాడని తెలుసుకున్న కంసాసురుడు దేవకీవసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. పుట్టిన పిల్లలందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారా దంపతులు. చెరసాలలోని చిమ్మచీకట్లను తరిమేస్తూ ...వేయి సూర్యుల వెలుగుతో నాలుగు చేతులతో...శంఖ, చక్ర, గద, అభయ ముద్రలలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చి... తన కృష్ణావతార రహస్యాన్ని వివరిస్తాడు. అచ్చంగా అదే స్వరూపం శ్రీవాసుదేవపెరుమాళ్లదని వైష్ణవాచార్యులు చెబుతారు. కంచిలో కొలువైన వరదరాజ స్వామి కూడా ముమ్మూర్తులా ఇలానే ఉండటం విశేషం. ఆరు అడుగుల ఆ శిలామూర్తి - వైకుంఠవాసుడిని కళ్లముందు నిలుపుతుంది.
వాసుదేవ పెరుమాళ్‌ ఆలయం ఎనిమిది వందల ఏళ్లనాటిదని చెబుతారు. నిర్మాణ శైలిని బట్టి చూసినా, చాలా ప్రాచీనమైందనే అర్థమౌతుంది. ఎందుకంటే, కోణార్క్‌ సూర్య దేవాలయం సహా అనేకానేక ఆలయాల నిర్మాణశైలి ఇక్కడ ప్రతిబింబిస్తుంది. కొన్ని కోణాల్లో పూరి జగన్నాథుడి ఆలయాన్ని కూడా గుర్తుకుతెస్తుంది. ఆలయాన్ని ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలియదు. ఒకానొక కాలంలో... స్వామివారి నగలూ ఆలయ సంపదలూ దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది. కొంతకాలం పూజాదికాలకూ నోచుకోలేదు. మూడువందల సంవత్సరాల క్రితం మందస ప్రాంతాన్ని పాలించిన మణిదేవమహారాజు వైష్ణవ ధర్మం మీద గౌరవంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాతి కాలంలో మళ్లీ శిథిల స్థితికి వచ్చినా... చినజీయరు స్వామి చొరవతో గత వైభవాన్ని సంతరించుకుంది.
చినజీయరు గురువైన పెద్దజీయరు స్వామి ఇక్కడే శ్రీభాష్యం చదువుకున్నారు. ప్రాచీన కళింగాంధ్ర ప్రాంతంలో వైష్ణవానికి ఈ ప్రాంతం మూల కేంద్రంగా వర్ధిల్లింది. అందులోనూ, ఇక్కడి ఆచార్యులు...మందస రామానుజులు వేదాంత విద్యలో నిష్ణాతులు. కాశీ వరకూ వెళ్లి విద్వత్‌ గోష్ఠులలో పాల్గొన్నారు, మహామహా దిగ్గజాలను ఓడించి ప్రశంసలు అందుకున్నారు. ఆ పండితుడి దగ్గర శ్రీభాష్యం నేర్చుకోవాలన్నది పెద్దజీయర్‌ స్వామి, ఆయన స్నేహితుడు గోపాలాచారి కోరిక. రాజమండ్రి నుంచి మందస దాకా కాలినడకనే వెళ్లారు. గురువులకు ప్రణమిల్లి శ్రీభాష్యం నేర్పించమని కోరారు. ఆయన సంతోషంగా అంగీకరించారు. రెండేళ్లు అభ్యసించాల్సిన శ్రీభాష్యాన్ని ఆరు నెలల్లో ఆపోశన పట్టి, రాజమహేంద్రానికి చేరుకున్నారు. తన గురువూ ఆధ్యాత్మిక మార్గదర్శీ స్వయంగా విద్య అభ్యసించిన క్షేత్రం కావడంతో పెద్దజీయర్‌ వారి శతాబ్ది ఉత్సవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగుచేయించారు చినజీయరు స్వామి. వందల ఏళ్లనాటి ప్రాచీనతకూ, శిల్పకళా చాతుర్యానికీ ఏమాత్రం భంగం కలగకుండా ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుతం, వందల ఎకరాల మాన్యం లేకపోయినా... ఏలోటూ రానీయకుండా స్వామివారికి నిత్యోత్సవాలు నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు.
శ్రీదేవీ భూదేవీ సమేత పెరుమాళ్‌ స్వామి, చిన్ని కృష్ణుడు, గోదాదేవి సన్నిధిలోని విష్వక్సేనుడు, నమ్మాళ్వార్‌, భగవత్‌ రామానుజులు, తిరుమంగై ఆళ్వార్‌, గరుడాళ్వార్‌ వంటి విగ్రహాలతోపాటూ 25 పంచలోహ మూర్తులున్నాయి. పక్కనే గోపాల సాగర జలాశయం ఉంది. ఏటా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో చక్రతీర్థ వేడుకలు ఇక్కడే జరుగుతాయి. శ్రీకాకుళం నుంచి 100 కిలో మీటర్లూ, వైజాగ్‌ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. పలాస రైల్వే స్టేషన్లో దిగీ వెళ్లవచ్చు.
ఆలయం చుట్టుపక్కల అనేక దర్శనీయ స్థలాలున్నాయి. దగ్గర్లోనే మందస కోట ఉంది. ఇది అలనాటి రాజవైభవానికి గుర్తుగా మిగిలింది. పాతిక కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి పర్వతం మీద పాండవుల ఆలయాలు ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఇక్కడ ఉండే, శివుడిని పూజించారని ప్రతీతి. శ్రీకాకుళం అనగానే గుర్తుకువచ్చే అరసవిల్లి, శ్రీకూర్మంతో పాటూ రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇచ్ఛాపురం ఇలవేల్పుగా చెప్పుకొనే పద్నాలుగో శతాబ్దం నాటి స్వేచ్ఛావతీ మాత ఆలయమూ చూడదగిందే.

Share:

సలేశ్వరం

శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ 
ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా.
సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతరజరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలిపౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలోవున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.
ఉనికి: -
ఇది మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని అమ్రాబాద్ మండలం లోని మన్నానూర్ నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్-- శ్రీశైలం --- హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.
చరిత్ర: -
అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం. నిజాంవిడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలో మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైనలింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులేఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మవిగ్రహాలున్నాయి.
జాతర: -
సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.
చారిత్రల ఆదారాలు: -
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలోమూస:చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు [[ శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులుకొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా ......చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం వున్నది. ద్వార బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం వున్నది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుదాలు వున్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో ఢమరుకం ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి వున్నది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించె విసురు రాయి వున్నది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి వుంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడ వున్నది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్దిఅనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బ్.ఎన్ శాస్త్రి నిరూపించారు. క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్ర లో శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలోకూడ ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడ ఇక్కడ అశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వలన తెలుస్తున్నది.
ప్రకృతి: -
సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమందిమెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తరువాత అబౌద్ద బిక్షవులకు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆదారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List