పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూన్న శివలింగం. ~ దైవదర్శనం

పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూన్న శివలింగం.

దక్షారామం కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు.పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని చెబుతారు. దానికి తగ్గట్లుగానే పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూ నేత్రానందం కలిగిస్తారు స్వామి వారు. దేవాలయానికి అభిముఖంగానున్న సోమకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేశంలో మరో శివాలయంలోనూ లేని విధంగా, ఆలయానికి ఎదురుగా ఎత్తైన స్తంభం మీద కూర్చున్న నందీశ్వరుడూ ఇక్కడే కనిపిస్తాడు. స్వామి వారి ఆలయంపైనే అన్నాపూర్ణాదేవి కొలువై ఉండటం మరో విశేషం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమం లో తూర్పు ముఖం గా ఉంటాడు అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకో వచ్చు .
.
1434 లోదేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు .ఒక సారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమ రామం లో శివుని అమృత లింగ శకలం పడి ఉందని ,అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అన్న పూర్ణా సమెత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు .అలాగే మాటలు వచ్చాయి రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు.
.
దక్షిణం లో సూర్య నారాయణుడు ఉత్తరం లో సుబ్రహ్మణ్య స్వామి ,ఈశాన్యం లో నవ గ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖం లో గణపతి ,ఉత్తరాన కుమార స్వామి ,సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖం గా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మ వారు కోటి కాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు .గర్భాలయం లో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తునకన్పిస్తాడు .దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్న పూర్ణ అమ్మ వారు దర్శన మిస్తారు .దక్షిణాన కళ్యాణ మండపం ఉంది .
.
రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు శాప విమోచనం తెలప మంటే చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అక్కడి శివుడిని అషె కిస్తే .విమోచనం జరుగుతుందని చెప్పాడు అలాగే చేశాడు.అందుకే అది చంద్ర పుష్కరిణి అని పేరొచ్చింది స్వామిని కి సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది .

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List