దశావతారాలు విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు. ~ దైవదర్శనం

దశావతారాలు విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు.

ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమౌతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక...మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్క్రతిలో భాగమే...


విష్ణువు పది అత్యంత ప్రసిధ్ద అవరోహణల్ని సమిష్టిగా దశావతారలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత మూడు అవతారాలు, త్రేతాయుగంలో, ఎనిమితో అవతారం ద్వారపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో, పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా ...

చాలాకాలము
నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు *నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు* పది ప్రధానావతారాలని పేర్కొనబడింది. ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.

“ దశావతారములు – మనిషి ”

ఒక బోయవాడు అయిన ఒక అతి సాధారణ మనిషి, ఒక మహామంత్ర సాధనచే మహామనిషిగా ఆవిష్కరింపబడి, మహర్షిగా పేరుపొందాడు. ఆ మహర్షి నాడు వ్రాసిన రామాయణమే నేటికీ అందరి మనస్సుల్లో సజీవంగా వుంది. కారణం, కథ, కథలోని పాత్రలు, వారు ఆ పాత్రల్లో అనుభవిస్తూ చెప్పింది సమాజంలో జనసామాన్యానికి చేరువుగా వుండి, పోలివుండటమే!!

భారతీయ పురాణాల్లో చాలా ప్రాముఖ్యం పొందినవి దశావతారాలు. విష్ణువుయొక్క ఈ దశ అవతారాలు మనిషి మనుగడతో ఎంతో లోతుగా ముడిపడివున్నాయి.

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కానీ వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం....

*యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత*

*అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్*

*పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్*

*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే*

అర్జునా! ధర్మమునకు హాని కలిగిన ప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనై నప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగము నందును అవతరించు చుందును.

భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:


*1. మత్స్యావ తారము:*
మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో, వేదాల్ని దొంగలించిన సోమకుణ్ణి వధించి, సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావనెక్కించి, సప్తర్షులతో , సకల బీజాల్ణీ , ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు... ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వత మనువు.

మత్స్యావతారం:- బ్రహ్మ దగ్గర వున్న వేదాలను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి, వాటిని సముద్రం అడుగున దాచివుంచి నప్పుడు, బ్రహ్మ కోరికపై, శ్రీమహావిష్ణువు చేప అవతారంలో సముద్రం లోపలికివెళ్ళి, అక్కడున్న రాక్షసుడుని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అందిస్తాడు. ఇది ఈ అవతార సారాంశం.

అయితే, ఈ అవతార తత్త్వ రహస్యం ఏమిటి....ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది అని పెద్దల మాట. వేదాలు మానవ జాతికి కావాల్సిన సమస్త ధర్మాలను తెలియ చెప్పాయి. దుర్మార్గుల (రాక్షసుల) చేతిలో ధర్మం నాశనమవుతున్నప్పుడు, ఆ దుర్మార్గులను, అతి వేగంగా, శీఘ్రంగా శిక్షించి, ధర్మాన్ని తిరిగి నిలబెట్టటం చాలా ముఖ్యమైన విషయం. చేప ఎలా అతివేగంగా నీటిలో ప్రయాణిస్తూ గమ్యం చేరుకుంటుందో, మనిషికూడా ధర్మ రక్షణార్ధం అదేవిధంగా స్పందించాలి అనేది దీని సారాంశం.


*2. కూర్మావతారము:*
కూర్మాతవారము,లో క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు ..
కూర్మావతారం:- దేవదానవులు, వాసుకుని ( పాము ) తాడుగా చేసుకొని, మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, అమృతాన్ని పొందటం కోసమై, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు, మహాపర్వతమైన మంధర పర్వతం సముద్రంలో మునిగిపోతూవుంటే, దేవ,దానవుల కార్యం విఫలమైపోసాగింది. అప్పుడు, వారి అభ్యర్ధన మేర, శ్రీ మహావిష్ణువు, తాబేలు రూపంలో ఆ పర్వతాన్ని తన వీపుపై మోపుకొని, దేవ,దానవులకు అమృతాన్ని సాధించటంలో సహాయపడతాడు. ఇది ఈ అవతార సారాంశం.

మరి ఈ అవతార తత్త్వ రహస్యం ఏమిటి? :- ఇటుకలతో కట్టే ఒక ఇళ్ళు నిలబడాలంటే, ఆ ఇంటికి గట్టి పునాది ఆధారంగా వుండాలికదా? అదేవిధంగా, చిన్న పనైనా, పెద్ద పనైనా సఫలీకృతం కావాలంటే, ఆ పనిని ఏ విధంగా చేస్తే ఫలితం వస్తుందో, దానికి ఎట్టి గట్టి ఆధరాలు కావాలో ముందుగా తెలుసుకొని, వాటిని సమాయత్తపరిచి, వాటి ఆధారంగా ముందడుగులు వేయాల్సి వుంటుంది. సరైన ఆధారాలు, సరైన ఆలోచనలు లేకుండా చేస్తే, సాధించాల్సిన పని సంపూర్ణంగా నెరవేరదు. ఈ విషయాన్నే గమనించాలి.

*3. వరాహావ తారము:*
వరాహావతారము సత్య యుగంలోనే కనిపించినది. ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడనే అను రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి...భూమిని పాతాళంలో పడవేసి బ్రహం నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు. వరహావతతారంలో విష్ణుమూర్తి హిరణ్య్యాక్షుడిని సంహరించి...భూమిని, వేదాలను రక్షిస్తాడు .
వరాహవతారం:- అత్యంత సుసంపన్నమైన భూమిని, స్వార్ధపరుడైన హిరణ్యాస్యుడనే రాక్షసుడు, చాపచుట్టలాగా చుట్టి, ఎత్తుకొనిపోయి, సముద్రపు అడుగున వుంచుతాడు. భూమిపై నివసించే జీవులన్నీ తమ ప్రాణాలకు ముప్పు కలిగిందని గ్రహిస్తాయి. దేవతల యొక్క కోరికమీద, శ్రీ మహావిష్ణువు వరాహవతారం ఎత్తి, రాక్షసుడిని సంహరించి, భూమిని సముద్రంపైకి తీసుకువచ్చి, యధాస్థానంలో వుంచి, అందరికీ మేలు చేస్తాడు. ఇది ఈ అవతార సారాంశం.

మరి ఈ అవతారం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పదునాలుగు లోకాల్లోకెల్లా భూలోకం చాలా ప్రశస్తమైనదని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు, కిన్నెర, కింపురుషాదులందరు కూడా భూలోకంలోనే ఎన్నో విశేషాలను గుర్తించి, అనుభవించారు. ముక్తిని సాధించటానికి భూలోకమే చాలా అనువైంది అని చాటి చెప్పారు. భూలోకంలోవున్న ప్రకృతి రమ్యత, సంపద మరేలోకాల్లోకూడా లేవని పొగిడారు. అటువంటి భూలోకాన్ని సర్వదా కాపాడుకోవాలని చెప్పటమే ఈ అవతారం ఉద్దేశ్యం.

*4. నృసింహావ తారము లేదా నరసింహావతారము:*
నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతారంలో దిగివచ్చిన శ్రీమహా విష్ణువు హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు.

నరసింహావతారం:- సకల విద్యా పారంగతుడై, తపోసంపన్నుడై, వరప్రసాదుడై, అతి బలవంతుడై వుండికూడా, హిరణ్యకశిపుడు అతిశయించిన అహంకారంతో, సత్యాన్ని గ్రహించలేక, సర్వవ్యాపకమైన దైవశక్తిని తెలుకోలేక, తన కుమారుడినే హింసించి, చివరకు, నారసింహావతారమైన శ్రీ మహావిష్ణువుచే సంహరింపబడతాడు. ప్రహాదుడులాంటి ధర్మపరులను రక్షించటం, అహంకార మనస్కులైన రాక్షస ప్రవృత్తి గలవారిని శిక్షించటం ఈ అవతార లక్ష్యం.

మరి, ఈ అవతారం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? :- ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వరాలు పొంది, శక్తిమంతులైనా, బుద్ధిని ఉపయోగించక, ‘ మనిషిచేత కానీ, జంతువులచేత కానీ, నేలపైనకానీ, ఆకాశంలోకానీ, నీటిపైకానీ, బయటకానీ, లోపలకానీ నేను చంపబడకూడదు ’ అని విపరీత బుద్ధితో వరాలు పొందిన హిరణ్యకశిపుడు ఎలాగైతే నశించాడో, మనిషికూడా తన విద్యా బుద్ధులు, తెలివితేటలను వక్ర బుద్ధితో, అహంకారంతో, ప్రజా సంక్షేమానికి హానికలిగించి, నాశనం కాకూడదనేదే ఈ అవతారం ద్వారా మనం తెలుసుకోవాలి.

*5. వామనా వతారము :*
వామనావావతారంతో బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు. రెండడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని ఆక్రమించి మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు . ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవలు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది .

వామనావతారం:- విద్యాధికుడు, బల సంపన్నుడు, బుద్ధిశాలి, మహారాజు అయినప్పటికీ, వక్రబుద్ధిగల శుక్రాచార్యుడులాంటి గురువులను చేరదీసి, వారి సలహాలను అనుసరించి, దేవతలను, మానవులను హింసించిన బలి చక్రవర్తి, తన స్వయంపరాధం వల్ల పాతాళ లోకంలోకి, వామనావతార రూపంలో, శ్రీ మహావిష్ణువుచే అణగత్రొక్కపడ్డాడు. ఇది ఈ అవతార సారాంశం.

*6. పరశురామా వతారము:*
కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు. మనషి రూపంలో ఉన్నా...అనాలోచితంగా, ఆవేశపూరితంగా ప్రవర్థించడం కనిపిస్తుంది. అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదహరణగా చెప్పుకోవచ్చు,.


*7. రామావ తారము:*
శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది. రామావాతరాం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది . మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించిన చూపిన రాముడు ఆదర్శపురుషుడయ్యాడు .


*8. బుద్దావ తారము:*
బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షససమ్మోహనం కోసం, కీకటదేశంలో (మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్దుడనే పేర ప్రకాశిస్తాడు.


*9. కృష్ణావతారము:*
బలమరామ, కృష్ణావతారలతో భూమి భారన్ని తగ్గించాడు . బలరాముడి సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఝానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజంయం సాధిసంచేందుకు ఆయన రథసారిధిగా నిలిచాడు శ్రీక్రుష్ణడు . ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.


*10 కల్కీ అవతారము :*
చివరగా కలియుగ, కృటయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు ...
సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు. దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం, ప్రతీ యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తూ ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారలన్నీ అందుకు ప్రతీకలే...
Share:

3 comments:

  1. ఈ సమాచారం చాలా ఉపయోగపడింది. దీని పోస్టు చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మంచి అవగాహన కలిగిన, కలిగించే సమాచారాన్ని అందించారు కృతజ్ఞతలు

    ReplyDelete
  3. సమాచారం ఎంతో ఉపయొగయుక్తం

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List