సృష్టిలో తొలిసారిగా రోదించినవాడు . "శివుడు'' ~ దైవదర్శనం

సృష్టిలో తొలిసారిగా రోదించినవాడు . "శివుడు''


"రుద్రుడు'' అంటే ఎవరు? ఈ శబ్దం "రోదః''అణు పదం నుంచి పుట్టింది. రోదనము అంటే ఏడుపు. సృష్టిలో తొలిసారిగా రోదించినవాడు ... "శివుడు'' అప్పుడు ఆయన నేత్రాలనుండి జారిపడ్డ అశ్రుబిందువులే "రుద్రాక్షలు'' అయినాయి. శుభములు ప్రసాదించే మంగళకరుడగు శివునకు రోదించాల్సిన అవసరం ఏమొచ్చింది?
సృష్టి ఆదిలో నారాయణుని నాభికమలం నుంచి "పంచముఖ బ్రహ్మ'' జన్మించాడు. కన్నులు తెరచి చూసాడు బ్రహ్మ. ఎటుచూసినా జలమే. "తనే తొలి స్వయంభువుడను'' అని అనుకున్నాడు బ్రహ్మ. ఈ జలానికి ఆద్యంతాలు తెలుసుకోవాలని, కమలాసనం దిగి ఆ జలంలో నడక ప్రారంభించాడు. కొంతదూరం వెళ్ళాక "ఓమ్'' అనే పదం వినబడింది. ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళాడు. అక్కడ తెల్లని దేహకాంతితో, దిగంబరంగా ఒక తేజోమూర్తి ధ్యానం చేస్తూ బ్రహ్మకు కనిపించాడు. "వీడెవడు?'' అనుకున్నాడు బ్రహ్మ. "నాకు అయిదు ముగాలున్నాయి, వీడికి ఒకటే ముఖం వుంది. వీడికన్న నేనే గొప్పవాడిని'' అనే అహంకారంతో బ్రహ్మ ఆ తెజోమూర్తికి ధ్యానం భంగం చేసాడు. ఆ తేజోమూర్తి కన్నులు తెరచి బ్రహ్మవంక చూసాడు. "నేను పంచముఖుడను, నీకన్నా గోప్పవాడను, నన్నే ధ్యానించు, నీకు వరాలు ఇస్తాను'' అని అహంకరించి పలికాడు బ్రహ్మ. ఆ తేజోమూర్తి ఎంతో శాంతంగా బ్రహ్మకు పరబ్రహ్మతత్త్వం చెప్పిచూసాడు. వినలేదు బ్రహ్మ. వెంటనే ఆ తేజోమూర్తి తన ఎడమచేతి చిటికనవ్రేలు గోరును కత్తిలా చేసి,రహ్మ అయిదవ తలను నరికేశాడు. ఈ చర్యతో అహంకారం నశించిన బ్రహ్మకు జ్ఞానోదయం అయింది. నాటినుండి ఆయన చతుర్ముఖుడు అయ్యాడు. అయితే నరకబడ్డ ఆ అయిదవ తల, ఆ తేజోమూర్తి చిటికెనవేలును అంటుకునే ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ తలను వదిలించుకోవడం ఆ తేజోమూర్తికి సాధ్యం కాలేదు. వెంటనే "నారాయణ''ధ్యానం చేసాడు. నారాయణుడు ప్రత్యక్షమై, "ఈశ్వరా! బ్రహ్మ శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం ప్రాప్తించింది'' అన్నాడు. "యింత తపస్సు చేసి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నానా!'' అని గట్టిగా రోదించాడు ఆ తేజోమూర్తి. నాటినుంచి ఆయన "రుద్రుడు'' అనే పేరుతొ ప్రసిద్ధినొందాడు. "రోదయతి సర్వమన్తకాలే ఇతి రుద్రః'' ప్రళయకాలమునందు సమస్తమును ఎడ్పించువాడు కనుక "రుద్రుడు'' అని కొందరంటారు.
"రుతౌ ద్రవతి ద్రావయతీతివా, రుద్రః'' "రుతి'' అనగా నాదము. నాదమునందు ద్రవించాడు, ద్రవింపచేయువాడు "రుద్రుడు'' అని కొందరంటారు. "రోరూయమాణో ద్రవతి ప్రవశతి మార్త్యాన్'' శబ్ధరూపముతో మనుష్యుల దేహములందు జీవముగా ప్రవేశించువాడు కనుక "రుద్రుడు'' అని మరికొందరంటారు.
"రుతిం వేదరూపశబ్దం బ్రహ్మణే కల్పాదౌ రాతి'' కల్పాదియందు వేదరూపమయిన శబ్దమును బ్రహ్మకు అనుగ్రహించినవాడు కనుక "రుద్రుడు'' అని ఇంకొందరంటారు. అందుకే రుద్రాద్యాయము "యోరుద్రో అగ్నౌ - యో అప్సుయ ఒషదీషు - యో రుద్రో విశ్వాభువనా అవివేశ - తన్మై రుద్రాయ నమో అస్తు'' అని కీర్తిస్తుంది. "తేజోస్తత్త్వముగల అగ్నియందును, రసస్తత్త్వముగల జలములందును, అన్నమునకుమూల భూతమగు ఓషధుల యందును, సమస్త భువనముల యందును, చరాచర వస్తు రూపముల యందును ఏ రుద్రుడు చైతన్యతత్త్వముతో ప్రకాశించుచున్నాడో అట్టి "రుద్రునకు'' నమస్కారములు'' అని అర్థం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List