ఆదిశంకరాచార్యులు పూజించిన దివ్యక్షేత్రం... పుష్పగిరి.. ~ దైవదర్శనం

ఆదిశంకరాచార్యులు పూజించిన దివ్యక్షేత్రం... పుష్పగిరి..

.
సాధారణంగా శివ, వైష్ణవ ఆలయాలు ఒకే చోట ఉండడం చాలా అరుదైన విషయం. అలాంటి అద్భుత క్షేత్రమే పుష్పగిరి. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు పూజించిన చం ద్రమౌళీశ్వర లింగం ఈ క్షేత్ర ప్రత్యే త. కడప జిల్లా కేంద్రానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం దక్షిణ కాశిగా అత్యంత ప్రసిద్ధి చెందిదినది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. కడప నుంచి కర్నూ లుకు వెళ్ళే మార్గంలో చె న్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుం ది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్ప గిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది.
.
శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్ర ముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ‘మధ్య కైలా సం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక్కటే శంకరా చార్య మఠం.
‘పుష్పగిరి’ పేరు వెనుక... ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండే ది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించా డు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమ యంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్క లు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగేవారికి యౌవ నం లభించేది, అమరత్వమూ సిద్ధించేది.
.
దేవ తలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివు డు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కై లాస పర్వతం నుంచి ఒక ముక్క ను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తారు. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.
.
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ది చెందిం ది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీ క్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చెయడానికి జనమే జయుడు చెసిన సర్పయాగ పాప పరిహారా ర్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చోళులు, పల్లవులు, కృష్ణ దేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చెశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
.
కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాల యం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్య లక్ష్మి, రుదప్రాద, యోగాంజనేయ, సాక్షిమల్లే శ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభ వేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వ ర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయా లున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు. వై ద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది. వరదలు వచ్చినప్పుడు పెన్నా నది దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి.
.
పాతాళ గణపతిని దర్శించు కొ ని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తు లు తరలివస్తారు. జగద్గురువు ఆదిశంకరాచా ర్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు. పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడము చ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరస లు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యం గా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిస లాడుతూ ఉంటుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List