త్రికాలజ్ఞాని మహిమాన్విత ఆదోని తిక్క లక్ష్మమ్మ. ~ దైవదర్శనం

త్రికాలజ్ఞాని మహిమాన్విత ఆదోని తిక్క లక్ష్మమ్మ.

తెలియని వారికి పిచ్చిది. తెలిసిన వారికి అవ ధూత. భక్తుకు క్పవల్లి, ఆర్తులకు వరదాయిని. జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, సిద్ధురాలు తిక్క లక్ష్మమ్మ.
.
కర్నూలు జిల్లా (ఆదవాని) ఆదోని పట్టణానికి ఏడు మైళ్ళ దూరంలోని మూసాను పల్లెకు చెందిన మాదిగ మంగమ్మ, బండెప్ప దంపతులకు జన్మిం చింది లక్ష్మమ్మ. ఆ పుణ్యదంపతు ఎవరేపని చెప్పినా ప్రతిఫం ఆశించక చేసిపెట్టే కర్మయోగు. కూలినాలితో, కువృత్తితో వచ్చే ఆదాయంతో తృప్తిగా బ్రతకడం వారికి దేవుడిచ్చిన వరం. ముగ్గురు కొడుకు తరువాత కలిగిన ముగ్గురు ఆడబిడ్డల్లో 1815లో పుట్టిన తొలిబిడ్డ లక్ష్మమ్మ.
.
బండెప్ప చేతులు కాయకష్టం చేస్తున్నా, మనస్సు, ఆత్మ అనాత్మ విచారంలో లీనమయ్యేది. నాలుక తత్వాలు పాడేది. తండ్రి పాడే తత్వాలు, కోలాట పాటు విని లక్ష్మమ్మ భ్రమర కీటకమైనది.
.
అన్నతో చెల్లెళ్ళతో ఆటపాటు, ఇరుగు పొరుగుతో స్నేహం మాని ఏకాంతంలో కూని రాగాలు తీస్తూ, తనలో తాను గొణుక్కుంటూ తిండి తీర్థా పట్టింపు లేక ఆటపాట పట్ల ఆసక్తి లేని కూతురు విచిత్రమైన వాకం తల్లిదండ్రుకు దిగులైంది.
.
పెళ్ళి చేస్తే బాగౌతుందని పెద్దంటే శిరుగుప్పి గ్రామంలో తగిన సంబంధం చూసి పెళ్ళి చేసి బండెప్ప దంపతు సంతోషించారు. లక్ష్మమ్మకు ఈ పెళ్ళి బలవంతపు మాఘస్నానమైనది. ఆమెకు పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ సమానమే అయినవి. ఆమెకు భర్త, అత్తమాము, తన సంసారం అనే సోయి లేదు సరికదా ఎవరేమి అడిగినా సమాధానం చెప్పకుండా ఒక మూన గంట తరబడి కూర్చుని తనలో తాను గొణిగేది.
.
ఇంటి కోడలి తీరు సరిగా లేక దిగులు చెందిన అత్తమాము ఇరుగుపొరుగు సహాతో రాచ వైద్యును, భూత వైద్యును సంప్రదించారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆమె వెఱ్ఱిచేతకు విసిగి అత్తమాము, భర్త తిట్టినా కొట్టినా లక్ష్మమ్మ మారు మాట్లాడేది కాదు. ఓర్పుతో భరించేది. ఎదురు తిరిగి ఏమీ అనేది కాదు. అన్నింటికీ మౌనమే మంత్రమైంది. ఆకలి దప్పు విషయంలోను అంతే. పెడితే తినేది, లేకుంటే లేదు.
.
విసిగిపోయిన భర్త ఇటువంటి భార్యతో కాపురం చేయనని లక్ష్మమ్మను విడిచిపెట్టాడు. బండెప్పకు ఈ వార్త తెలిసి పరుగెత్తుకు వచ్చి బిడ్డ సంసారం నిలుప ప్రయత్నించాడు కాని ఫలించలేదు. లక్ష్మమ్మకు భర్తతో సంబంధం పోయినది. ఆమె సాధనకు పునాది ఏర్పడినది. ఆమె మెట్టిన ఊరు, పుట్టిన ఊరు రెండూ విడచి ఆదవాని చేరింది.
.
ఆదవాని చేరేనాటికి లక్ష్మమ్మ వయసు 20 ఏండ్లు. ఆదోని పట్టణం ఆమెకు కొత్త. అక్కడ ఆమెను అడిగే వారు, ఆదరించే వారు ఎవరూ లేరు. కనుక సందు గొందుల్లో, మురికి క్వాల్లో, చెత్త కుప్పల్లో, పాడు బావుల్లో ఏదో వెతుకుతున్నట్లు కూనిరాగాలు తీస్తూ, యిష్టం వచ్చినట్లు మెసుతూ నిద్రాహారాలు, ఎండవాను గణించక, దేహాభిమానం వదిలి తిరుగుతుండేది. దయగల తలులు పిలిచి ఇంత పెడితే తినేది. చెత్త కుప్పల్లోని క్రిమికీటకాలు ఆమెను బాధిస్తున్నా ఆమె వాటిని తొగించేది కాదు.
.
ఈ విధంగా అవధూత లక్ష్మమ్మ పుణికి పుచ్చుకున్న లక్ష్మమ్మకు ఒకనాడొక సత్పురుషుడు తారసిల్లి ఆమెను చెట్టు నీడన కూర్చోబెట్టి, హస్తమస్తక యోగం చేసి, చెవిలో ఏమో చెప్పినాడట. వెంటనే ఆమెకు సమాధి స్థితి అబ్బినది. ఇన్నేళ్ళ నుండి వెదకే సద్వస్తువేదో లక్ష్మమ్మకు చిక్కింది. లక్ష్మమ్మ రోజు తరబడి, గంట తరబడి సమాధి స్థితిలో ఉండేది. సమాధి నుండి లేచి పొగాకు కాడలో ఏదో నముతూ వీధువెంట తిరుగుతుండేది.
.
కసవు తొట్ల వద్ద కూర్చుండటం, పరుండటం వ్ల ఆమెకు తొట్టి లక్ష్మమ్మ అని, తిక్కగా మాట్లాడడం వల్ల తిక్క లక్ష్మమ్మ అని ఆదోని వాసు పేరు పెట్టారు. తెలిసిన వారు ఆమెను అవధూత, సిద్ధురాలు అన్నారు. ఆమెకు అన్నమో పండ్లో ఇచ్చి కొందరు సేవించేవారు. ఆమెను అభిమానించి కొందరు భక్తి ప్రేము ప్రకటించేవారు.
.
లక్ష్మమ్మ మహాత్మురానే ఖ్యాతి ఆదోని పట్టణ పొలిమేరు దాటి చుట్టు పక్క జిల్లాకు ప్రాకడంతో, జను ఆమె దర్శనానికి తండోపతండాలుగా రాసాగారు. త్రికాలజ్ఞాని, నిగ్రహానుగ్రహ సమర్థు రాలైన క్ష్మమ్మ భవిష్యత్తు గురించి గూఢోక్తు, మర్మోక్తు పలికేది. దూరదృష్టి, దూరశ్రవణము, పరచిత్తజ్ఞానము, భవిష్యత్‌ జ్ఞానము వంటి శక్తు కలిగిన ఆమె ఆర్తు జిజ్ఞాసువు కొరకు బిగ్గరగా పలికే గూఢోక్తు, మర్మోక్తు ఇతరుకు అర్థమయ్యేవి కావు. ఆమె వాక్కుల్లో సంబంధీకుకు మాత్రము సమాధానాు దొరికేవి.
.
అనావృష్టి సంభవించినపుడు రైతు అమ్మను అంకరించి వైభవంగా ఊరేగింపు జరిపితే వర్షాలుకురిసేవి. అందరి అభిమానము, భక్తిని చూరగొన్న లక్ష్మమ్మ శ్రీముఖ వైశాఖ బహుళ సప్తమి మంగళ వారం1933, మే 16 ఉదయం 5`6 గంట మధ్య తనువు చాలించారు. అమ్మ పార్థివ శరీరాన్ని అలంకరించి మేళతాళాతో ఊరేగించి సమాధి చేసారు. తరువాతి కాలాన అక్కడ నిర్మితమైన మఠంలో ఏటేటా ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List