కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నర్రవాడ వెంగమాంబ. ~ దైవదర్శనం

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నర్రవాడ వెంగమాంబ.

భక్తుల కొంగు బంగారం - శ్రీ వెంగమాంబ పేరంటాలు...
దుస్ట శిక్షణ , శిస్ట రక్షణ కోసం భగవంతుడు మనిషి రూపం లో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తోంది . ఇందులో భాగం గానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృస్టించాడనేది వాదన . జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోకకళ్యాణం జరిపించిదని దేవీభావతం సాక్ష్యమిస్తుంది . జగన్మాత ఆవిర్భావానికి మూలకారణాలు సామాజిక అరాచకం , ద్ర్ష్టశక్తులు విలయతాండవం చేయడం గా పేర్కొనవచ్చు . నర్రవాడ ప్రాంతం లో గజదొంగల అకృత్యాలకు అంతులేకుండా వుండేది . స్త్రీల మానప్రాణాలకు రక్షణ వుండేది కాదు . పశువుల మేపుకు , వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు . ఈ పరిస్థితులలో స్త్రీలు , బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచకృత్యాలకు తలవంచక తప్పలేదు . మూఢనమ్మకాలతో , అర్ధం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడూంటిపోయిన దశలో తమను ఆదుకోడానికి చేవతామూర్తి జన్మించాలంటూ కనీటితో ఆకాశానికేసి ప్రార్ధించేవారు . ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మతల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థలపురాణము తెలియజేస్తుంది .
ఇది క్రీ.శ. 16 వ శతాబ్ధిలో జరిగిన వాస్తవకథ . నర్రవాడ గ్రామానికి సమీపానగల వడ్డిపాలెం లో పచ్చన వెంగమ నాయుడు , సాయమ్మ అనే దంపతులు వుండేవారు . వీరు ఎల్లమ్మ భక్తులు . బిడ్డలకోసము పుణ్యక్షేత్రాలు తిరిగారు , వ్రతాలు , దానధర్మాలు చేశారు . వీరి నోముల పంటగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించినది . జగన్మాత పుట్టుకకు ప్రకృతి , యోగీశ్వరులు పరవశించిపోయారు . అనిర్వచనీయమైన ఆనందము ఆ దంపతులలోను , నర్రవాడ గ్రామములోను తాండవించింది . దివ్యశకులలతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని , గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆత్మజ్ఞానం తోదినదిన ప్రవర్ధమానమవుతూ తననెచ్చెలి తుమ్మల పెదవెంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను , ఆర్యసూక్తులను చెపుతూ వాటిని ఆచరణలో చూపించేది . ఆమె బోధనలు విని ఆగ్రామ ప్రజలు భక్తి ప్రపత్తులతో నైతిక జీవనాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు . యుక్తవయస్సుకు వచ్చిన వెంగమాంబను అదే ఊరిలోని వేమూరి అంకయ్యనాయుడు రెండవ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహము జరిపించారు . సాహసవంతుడు , సౌశీల్యవంతుడు అయిన గురవయ్య సాహచర్యం లో వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్దితో ఆచరించినది వెంగమాంబ . తనకోసము కాదు ఈ బ్రతుకు ... అమాజముకోసము అన్నట్లు ఏవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయక ధైర్యముతో ముందుకు నడచి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడింది .
సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది . త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది . ప్రజలంతా సమానులని , అంటరానితనము జాతిమనుగడకు సామాజిక శపమని భోదించింది .ప్రకృతి వైపరీత్యాలవల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్ళుకూడా దొరకని పరిస్థితిలో తన పూజలతో వర్షం కురిపించి నిమ్నవర్గాలను ఆదుకొంది . తన ఐదవతనాన్ని సైతం లెక్కచేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది . గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యముగా వెనకనుండి వేసిన బళ్ళెం పోటుతో నేలకొరిగాడు . లోకపాననియైన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళి గా తనువుచాలించి పేరంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకొంది . దళితులు స్వయం గా తయారుచేసి ఇచ్చిన నేతచీరను కట్టుకొని భర్తకంటే ముందుగా దహనం కావడనికి ఊరిపెద్దల అనుమతి పొంది కొన్ని నిముషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణచేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది .
తల్లిని కోల్పోయిన బిడ్డలవలే కన్నిరు మున్నీరుగా రోదిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా " నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను . అందుకు గుర్తుగా నా మంగళ సూత్రాలు , పమిటచెంగు , మెట్టెలు , పసుపు కుంకుమలు చెక్కుచెదరకుండా వుంటాయని " చెప్పింది . ఆ తల్లి చెప్పినవిధంగా ఆ వస్తువులన్నీచూసిన ప్రజలు భక్తి పారవశ్యం తో " శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై " అంటూ జయజయధ్వానాలు చేసి గుడికట్టించి నేటికీ లవేల్పుగా కులదైవముగా పూజిస్తున్నారు . ఈ దేవతకు 1940 సంవత్సరములో ఆలయం నిర్మించారు . అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెదవెంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్టించారు . కుడివైపు అందుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకొంటుంది .
ప్రతిసంవత్సరము జ్యేష్టమాసం లో పౌర్ణము వెళ్ళేక వచ్చే మొదటి ఆదివారము నుండి గురువారము వరకూ గల ఐదురోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు . ఆదివారము " నిలుపు " , సోమ మంగళ వారములలో "గ్రామోత్సవం " , బుధవారము " పసుపు కుంకుమ ఉత్సవం " , గురువారము " పొంగళ్ళు - బండ్లు తిరుగుట , ఎడ్లచే బండ్లు లాగుట పోటీలు , వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి . ఈ తిరునాళ్ళకు వేలాది భక్తులు వస్తూఉంటారు . టన్నుకకొద్ది ఎండుకొబ్బరి అగ్నిగుండలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది . ఈ ఐదురోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంస భక్షణ చేయరు . ఈ ఆలయము నర్రవాడ గ్ర్రామము నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం లో ఉన్నది .
ఆలయానికి బస్సు మార్గం :...
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్తానం కలదు. ఈ దేవస్తానంకు నెల్లూరు నుండి దుత్తలూరు మీదుగా పామూరుకు వెళ్ళు మార్గంన, మరియు ఒంగోలు నుండి కందుకూరు, పామూరు మీదుగా దుత్తలూరుకు వెళ్ళు మార్గంన, కడప జిల్లా నుండి బద్వేలు, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు వెళ్ళు మార్గంన కలదు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List