పాతాళేశ్వర్ మహాదేవ్ శివాలయం. ~ దైవదర్శనం

పాతాళేశ్వర్ మహాదేవ్ శివాలయం.



హిమాచల్ ప్రదేశలోని సిర్ మౌర్ జిల్లా,పత్ లియో గ్రామంలో వున్న పాతాళేశ్వరస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.ఈ ఆలయంలో వున్న శివలింగం కనీసం పన్నెండు అడుగుల పొడవని చెప్తారు. ఇది భూతలం పైన అయిదు అడుగులుండగా , మిగిలింది భూస్థాపితమైంది . భూమి కోత ఏర్పడగా, అందులో నుండి ఈ లింగం స్వాభావికంగా వెలసిందట. ఇక్కడ స్వామిని భక్తులు పాతాళేశ్వరడని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం దట్టమైన అడవుల మద్య వెలసింది . పంచపాండవులు తమ ఆజ్ఞాతవాస కాలంలో తపస్సు చేసుకుంటూ, అడవుల్లో సంచరిస్తూ ఈ శివలింగానికి పూజలు చేసినట్లు ఐతిహ్యం. ఇక్కడ స్వామివారికి దీపం వెలిగించడం, కొబ్బరికాయ సమర్పిచడానికి బదులు కేవలం ఆయా కాలల్లో లభించే జొన్నలు,బెల్లం ,గోధుమలు నివేదించి , స్వామి వారికి వీటితో అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive