జంబలకిడి పంబ జాతర.(వీరోచితపోరాటం సాగించిన ఓ మహిళ విజయగాధ) ~ దైవదర్శనం

జంబలకిడి పంబ జాతర.(వీరోచితపోరాటం సాగించిన ఓ మహిళ విజయగాధ)



.
బూతులు తిట్టుకునే జాతర గురించి ఎక్కడా విని ఉండం.కొత్త వాళ్లకు ఇది చిత్రంగా ఉండొచ్చు. కానీ రాయలసీమ వాసులకు ఈ జాతర గురించి బాగా తెలుసు. ఈ జాతర పుణ్య క్షేత్రమైన తిరుపతి లో జరుగుతుంది.బూతులు తిట్టుకున్నా ఎవరి మనసూ చివుక్కుమనదు. పైగా పులకించిపోతుంది. అంతేనా.. కొత్త పాత తేడా లేకుండా చీపుర్లు, చాటలతో బాదుకుంటూ మురిసిపోతారు. ఆడాళ్లు మగాళ్లుగానూ.. పురుషులు స్త్రీలుగానూ వేషాలేసుకొని జంబలకిడి పంబ అనిపిస్తారు. ఏటా ఎండా కాలంలో వ్యవ సాయ పనులన్ని అయి పోయి పంటలన్ని ఇండ్లల్లొకి వచ్చి రైతులు, రైతు కూలీలు, రైతులపై ఆధార పడిన ఇతర కుల వృత్తుల వారు విశ్రాంతిగా వున్నప్పుడు వస్తుంది ఈ పండగ. జాతర జరిగే రోజుల్లో సాయంత్రం ఏడుగంటల తరువాత గ్రామంలో రెండు తరాలుగా బ్రతుకుతున్న కుటుంబాల వారెవరూ గ్రామ పొలిమేర దాటరు. ఏదైనా అత్యవసరమైన పనిమీద వెళ్లినా సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు. వారం రోజుల పాటు ఆ కుటుంబాలవారు ఎలాంటి శుభకార్యాలూ చేయరు. వారు చేసేదల్లా వయసుతో నిమిత్తం లేకుండా వర్ణం, కులంతో పనిలేకుండా అందరూ బండవేషాలేసుకుని బండబూతులు తిట్టుకోవడమే. ఇది వినడానికి సరదాగానే ఉన్నాదీని వెనుక ఓ కధ వుంది.
ప్రజలంటే బానిసలుగా, మహిళలంటే వాడుకునే వస్తువుగా భావించి పెట్రేగిపోతున్న ఓ పాలేగాడిపై వీరోచితపోరాటం సాగించిన ఓ మహిళ విజయగాధ దాగి ఉంది. ప్రజలకు ఆ పాలేగాడి కబంద హస్తాల నుంచి విముక్తిని ప్రసాదించిన వీరవనిత చరిత్ర దాగి ఉంది. అందుకే వందల సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. ఆ మహిళ గ్రామదేవతగా పూజలందుకుంటోంది. ఆమే తిరుపతి గంగమ్మ. వందల సంవత్సరాల క్రితం తిరుపతి పాలేగాండ్ల ఆధీనంలో ఉండేది. పాలేగాడి కన్నుపడితే మహిళయినా అతనికి దాసోహం కావాల్సిందే. అలాంటి తరుణంలో పాలేగాడిపై తిరగబడి చంపిన వీరవనిత గంగమ్మ. ఆమే పేరుతో జరిగే జాతర రాయలసీమలో ప్రసిద్ధి. జాతరంటే కొత్తబట్టలు వేసుకొని గుడికెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒంటి నిండా రంగులు పూసుకుని వేపాకు చేతబట్టి బూతులు తిట్టే సాంప్రదాయం చూస్తాం. మగవాళ్ళు ఆడవాళ్ళ వేషంలో, ఆడవారు మగవారి వేషంలో కనిపిస్తారు.
బూతులు పలకడం వెనుక ఎంతో చరిత్ర ఉంది. వైదిక సాంప్రదాయంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందట. ఒకప్పుడు గ్రామానికే పరిమితమైన ఈ జాతరకు ఇప్పుడు వేల మంది భక్తులు వస్తారు. జాతర ప్రధాన ఘట్టం రోజున లక్ష మంది వరకు హజరవుతారు.తిరుపతి నగరంలోని కైకాల కులానికి చెందిన వారు ఈ చాటింపు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఏడు రోజుల పాటు గ్రామంలోని వారు బయటకు వెళ్ళకూడదని, బయటివారు గ్రామంలోకి రాకూడదని చాటింపు చేస్తారు. గ్రామంలోని మహిళల మానప్రాణాలను కాపాడిన గంగమ్మ తల్లి గ్రామాన్ని కాపాడుతుందన్న విశ్వాసంతో వందల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. పల్లెల్లో కొంత తగ్గినా తిరుపతిలో మాత్రం మే లో జరుగుతుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List