బోధానంద్రేoద్ర సరస్వతి స్వామి.. ~ దైవదర్శనం

బోధానంద్రేoద్ర సరస్వతి స్వామి..

తెలుగులో మొదటిసారి గా గురుచరిత్ర ను అనువదించి మనకు అందించారు.
1901 సంవత్సరం లో మార్గశీర్ష బహుళ త్రయోదశి రోజు నాడు తల్లిదండ్రులు రామకృష్ణ,కృష్ణ వేణి  అమరావతి పుణ్య క్షేత్రం లో జన్మించారు.తెలుగు,సంస్కృత,ఆంగ్ల భాషలలో చిన్నప్పటి నుంచి పట్టు ఉండేది..వీరుచిన్నప్పడు 11 సంవత్సరల వయస్సు అప్పుడు అమరావతి కి శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వచ్చారు.వీరు నమస్కారం చేసుకోగానే "దత్తం యె భజతే నిత్యo ముక్తి యెతి న సంశయ:" అని వీరికి పేపర్ మీద మంత్రం రాసి ఇచ్చారు.వాసుదేవనంద సరస్వతి స్వామి ఆశీస్సులతో వీరు దత్త సంప్రదాయ దీక్షితులు అయ్యారు.అనేక మరాఠీ గ్రంధాలను తెలుగులో అనువదించారు.గురుచరిత్ర, నవనాధుల చరిత్ర, ఏకనాధ భాగవతం,గజానన విజయం,వేదాంత మననం,వృధు చరిత్ర, మొదలగు గ్రంధాలు రచించారు. ఏకనాధ భాగవతం లో 21 వ స్కంధం వివరించాలి అంటే బ్రహ్మవిద్య సంప్రదాయం మీద అవగాహన ఉండాలి.ఇది కృష్ణ,ఉద్ధవ్ సంవాదం. ఏకనాధుని తరువాత వివరించింది వేరే.అంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉండేవారు.కొద్దీ ఆహారం తీసుకునేవారు.ముచ్చర్ల అనే గ్రామంలో అనావృష్టి కారణం గా వారు గురుచరిత్ర పారాయణ చేయించి వానలు పడేట్టు చేశారు..సన్మార్గంలో జీవించండి,మానవ జన్మ దుర్లభం,ఆచరించే వాటిని చెప్పేవారు.త్వరలో అఖండ మైన పరమాత్మ లో ఐక్యం అవ్వాలి అన్న కొద్దిరోజుల కు 1997 సంవత్సరంలో ఫల్గుణ బహుళ దశమి రోజు సమాధి చెందారు.దత్త సంప్రదాయం ప్రకారం వీరిని కృష్ణా నదిలో జల సమాధి చేశారు.ఓం శ్రీ సాయిరాం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List