కాశీ ఖండం –౩ ~ దైవదర్శనం

కాశీ ఖండం –౩


                                                                       అగస్త్య ప్రస్థానం

              అగస్త్య మహర్షి కాశీ విశ్వేశ్వరుని ప్రార్ధించి ,భార్య లోపాముద్ర తో ‘’మన పై ఎంత భారాన్ని దేవతలు పెట్టారో చూశావా ?ముని వ్రుత్తి లో ఉండే మనం ఎక్కడ ?ఈ కార్యభారం ఎక్కడ ?పర్వతాల రెక్కలను చేదించిన ఇంద్రునికి ఇది అసాధ్య మైనదా ?ఈ వింధ్యాద్రి అతనినే జయిన్చిందా ?కల్ప వృక్షం ,కామ ధేనువు ,చింతా మణి కలిగి ఉన్న దేవేంద్రుడు ,ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే ఈ బ్రాహ్మణుడిని ప్రార్ధించ టానికి వచ్చాడు .అన్నిటిని దహించ గల శక్తి ఉన్న అగ్ని దేవుడికి ఈ పని అసాధ్య మైందా ?దండం ధరించి ప్రాణుల ను శాసించే యముడీ పని చేయ లేడా ?ఆదిత్యులు ,వసువులు ,రుద్రులు ,విశ్వేదేవులు ఈ స్వల్ప కార్యాన్ని చేయ లేక పోయారా ?ఇంత మందికి సాధ్యం కాని వింధ్యాద్రి గర్వాపహరణం నేను చేయగలనని వారు నమ్మారంటే ఆశ్చర్యం గా ఉంది’’.

                  ‘’ కాశీ క్షేత్రాన్ని గురించి మహాత్ములు చెప్పిన మాటలు మల్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి .కాశీ లో నివశించే వారికి అనేక విఘ్నాలు కలుగు తుంటాయి .అలాంటి విఘ్నమే మనకిప్పుడు వచ్చింది .విశ్వేశ్వరుడు విముఖం  గా ఉన్నప్పుడే వ్యతి రేకం గా ప్రవర్తించాలి .కాశీని వదలుట చేతి లోని మోక్షాన్ని వలటమే .పుణ్యం నశిస్తేనే కాశీ నుండి వెళ్ళాలని పిస్తుంది .ఉత్తమ పురుషార్ధ మైన మోక్షం కాశి లోనే లభిస్తుంది .ఇది అతి పుణ్య క్షేత్రమని శ్రుతులు చెబుతున్నాయి .జాబాలి ,అరుణి ,వరణ పింగళ నాడీ  మధ్య ఉన్న అవిముక్త క్షేత్రం కాశి .వాటి మధ్య ఉన్నసు షుమ్నా నాడియే కాశి .ఇక్కడ ప్ప్రాణం ఉత్క్రమణం జరిగితే విశ్వ నాధుడు మోక్షమిస్తాడు .ఆయనే తారక మంత్రోప దేశం చేస్తాడు దానితో బ్రహ్మత్వం సిద్ధిస్తుంది .కాశితో సమాన మైన క్షేత్రం ,విశ్వేశ్వరునికి సమానమైన దైవం లేవు .ఇలాంటి పుణ్య రాశి కాశి ని ఇప్పుడు మనం విడిచి పెట్టి వెళ్ళాల్సి వస్తోంది .మనసు స్వాధీనం లో ఉండటం లేదు ‘’అని మహర్షి దుఖాశ్రువులను ధారా పాతం గా కార్చాడు ..

                   దంపతులిద్దరూ విశ్వేశ్వరుని దర్శించారు .స్వామికి విన్న విన్చుకొంటు ముని ‘’నువ్వు కాశీ విభుడవు .కనుక నీకు విన్న విన్చుకోవటానికి వచ్చాను .నేనేమి అపరాధం చేశాను ?అన్నపూర్ణా దేవిని వదిలి పెట్టాల్సి వచ్చింది ?కాల భైరవా నువ్వైనా అభయం ఇవ్వవా ?దండ పాణీ !నువ్వైనా మేము వెళ్ళ కుండా చేయలేవా ?డుమ్ది వినాయకా !విఘ్నాలకు అది రాజువు .నీకు మా మీద ఎందుకు కోపం కలిగింది ?పంచ వినాయకులారా !చింతా మణి గణపతీ !కపర్దీ !ఆశా గజాశ్యా !సిద్ధి వినాయకా !నేనేమి కాశీ వదిలి వెళ్ళేంత తప్పు చేయలేదు .ఇతరుల తప్పు ఎంచ లేదు .పరులకు అపకారం చేయ లేదు .త్రికాలాలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శిస్తూ నా జీవితాన్ని చరితార్ధం చేసుకొంటున్నాను .ప్రతి పర్వం లోను పంచ గంగా యాత్ర చేస్తున్నాను .తల్లీ విశాలాక్షీ !భవానీ ! శివ రంజనీ !నువ్వైనా కనిక రించవా ?కాశీ పట్టణ దేవత లారా !నేనేమీ నా స్వార్ధం కోసం కాశీ ని వదిలి పెట్టి వెళ్లటం లేదు .దేవతల అభ్యర్ధన మేరకు ,పరోప కారం కోసమే వెడుతున్నాను .పూర్వం దధీచి తన ఎముకను ఇంద్రుడికి ఇవ్వ లేదా ?బలి తన సర్వస్వాన్ని పోగొట్టు కొ లేదా ?’’అని అందరికి విన్న విన్చుకొంటు మునులను, ఆబాల వ్రుద్ధులను వృక్ష జంతు కోటికి మ్రొక్కి అందరికి వీడ్కోలు చెప్పి ,ధర్మ పత్ని లోపాముద్ర వ్రేలు పట్టుకొని ‘’పుణ్య రాశి అయిన కాశి ని వదిలి పెట్టి వెళ్తున్నాను ‘’అని కన్నీరు కారుస్తూ ,చప్పట్లు చరుస్తూ’’అయ్యో కాశీ కాశీ ఆరుస్తూ శివ ,శివ అని ప్రలాపిస్తూ కింద పడి పోయాడు మహర్షి .మళ్ళీ కొంచెం స్తిమిత పడి భార్య చేయి ఊత గా తీసుకొని  ‘’నాకు వినాశం దగ్గర పడింది ‘’అని పలవరిస్తూ ముందుకు కదిలాడు .

                కొద్ది కాలానికే ,ఆకాశ మంత ఎత్తు పెరిగి ,సూర్య గమనానికి నిరోధం గా ఉన్న వింధ్యాద్రి వద్దకు చేరుకొన్నారు దంపతులు .వింధ్యాద్రి భయం తో ‘’స్వామీ ! నేను మీ సేవకుడిని .ఏమి ఆజ్న ?’’అని వినయం గా అడిగాడు .దానికి మహర్షి ‘’వింధ్య రాజా !నువ్వు చాలా ప్రాజ్ఞుడవు .నా శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడివి .నేను దక్షిణ దేశానికి వెళ్తున్నాను తిరిగి వచ్చే దాకా ఇలాగే ఉండు ‘’అని చెప్పాడు .మహర్షి కోప పడ నందుకు సుముఖం గా మాట్లాడి నందుకు,శపించ నందుకు  వింధ్య సంతోష పడిఅలాగే వినమ్రం గా కిందికి వంగి ఉండి పోయింది .మహర్షి వింధ్య ను దాటి వచ్చాడు .సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని నిరాటంకం గా కోన సాగించాడు .’’నేడోరేపో అగస్త్య మహర్షి తిరిగి వస్తాడు ‘’అని ఎదురు చూస్తూ అలానే ఉండి పోయాడు వింధ్య రాజు .అగస్తుడు మళ్ళీ తిరిగి రాడు ,వింధ్య ఇక పైకి లేవడు అనే సంతృప్తి తో సూర్యుడు మరీ ప్రచండం గా తన దిన యాత్ర సాగించాడు .దుష్టుల సంకల్పాలను ఇలానే మహాత్ములు నీరు గార్చుతారని అందరు అనుకొన్నారు .

           అగస్త్యుడు గోదా వరి తీరానికి చేరి సంచ రిస్తున్నా ఇంకా మనసులో కాశి భావం తొలగి పోలేదు .పదే  పదే తలుచుకొంటునే ఉన్నాడు ..పిచ్చి వారి వలె ఇద్దరు గాలిని చూసి ‘’కాశీ పట్నం కుశల మేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము /అని ప్రశ్నిస్తున్నారు .అంత అవినా భావ సంబంధం తో వారు కాశీ లో మెలిగారు ..కొల్హాపురం చేరి అక్కడి మహా లక్ష్మి అమ్మ వారిని దర్శించారు .ముల్లోకాలను అడవి పంది గా భయ పెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీ దేవి ఇక్కడ కొలువై ఉంది .మహా లక్ష్మి ని ఇద్దరు మనసా రా స్తోత్రం చేసి ,ప్రార్ధించారు ‘’అమ్మా లక్ష్మీ దేవీ ! నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ సమస్త మంగళాలు ఉంటాయి.నువ్వు అనుగ్రహిస్తే అన్నీ చేకూరుతాయి ‘’అని ప్రార్దిన్చారు .అమ్మవారు ప్రత్యక్షమై ‘’మిత్రా వరుణ సంభవా అగ్స్త్యమునీ ! !పతివ్రతా శిరోమణీ లోపాముద్రా  !’’అని సంబోధించి ,లోపాముద్రా దేవి ని తన సమీపం లో కోర్చో బెట్టుకొని ,ఆమె శరీరాన్ని స్పర్శించింది మహా లక్ష్మి అమ్మ వారు ..’’కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింప బద్ద నా శరీరాన్ని   నీ స్పర్శ తో స్వాస్త్యం పొందుతున్నాను ‘’అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని ,సౌభాగ్యాలను కారణాలైన ఆభరణాల తో ఆమె ను అలంకరించింది .మహర్షితో ‘’రుషి సత్తమా !నీ తాప కారణం తెలిసింది కాశీ ని వదిలి నందుకు నీ మనసు అమిత బాధ పడుతోంది ,ఏదైనా వరం ఇవ్వాలని ఉంది  ‘’అన్నది .దానికి ముని ‘’అమ్మా మహా లక్ష్మీ !వరం  ఇవ్వ దలిస్తే మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు .ఇంకేమి వద్దు ‘’అన్నాడు .లక్ష్మీ దేవి ‘’తధాస్తు ‘’అని దీవించి స్వస్తత కలిగించింది .’’మహర్షీ !రాబొయె ద్వాపర యుగం లో పందొమ్మిదవ బ్రహ్మ కాలం లో నువ్వు వ్యాసుడవు అవుతావు .మళ్ళీ వారణాసి కి వెళ్లి వేద శాస్త్రాలను పరిష్కరించి ,ధర్మ బోధ చేస్తావు ..ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో .అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరం గా చెబుతాడు .’’ అని చెప్పి ఇద్దరినీ దీవించి పంపించింది. 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List