కాశీ ఖండం –21 ~ దైవదర్శనం

కాశీ ఖండం –21

 బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ..  శివ శర్మ ను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొని వెళ్లారు ..అక్కడ విష్ణు స్మరణ చేసి ,కల్పాయువు కలిగిన వారు ఉంటారు .ఇక్కడ దేవతా ప్రముఖులు నమస్కార యోగం తొ ఎప్పుడూ తపో సమాధి లో ఉంటారు .అక్కడి నుండి జనో లోకం చేరాడు .ఇక్కడ బ్రహ్మ కుమారులు సనకస నందనాది మహర్షులు ఊర్ధ్వ రేతస్కులయి  ఉంటారు .తర్వాత తపో లోకానికి వెళ్లాడు .ఇక్కడి వారు సదా వాసు దేవుని స్మరిస్తూ ,అన్నీ ఆయనకే అర్పించి ,దాహాదులు కూడా లేకుండా ఉంటారు .రోళ్ళ దగ్గర దంచు తున్నప్పుడు యెగిరి పడిన గింజలను మాత్రమె ఏరుకొని తింటారు .రాళ్ళు తిని ,ఎండిన ఆకులను తిని జీవిస్తారు .వేసవిలో పంచాగ్ని మధ్యమ లో నిల బడి మహా తపస్సు చేస్తారు .చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తారు .రెప్ప పాటు లేకుండా జీవిస్తారు .రుతువు అవగానే జలాన్ని మాత్రమె త్రాగుతారు .ఆరు మాసాలు ఉపవాసమే .వర్ష ధారల తొ తడుస్తున్నా రాయి లాగా నిశ్చలం గా ఉంటారు .ఇక్కడికి వచ్చిన వారు మృగాల దురదను గోకి తీర్చిన వారు ,అడవిలో ఉన్న తమ జాడలలో పక్షి గూడులు కట్టిన వారు ,శరీరాలనుంచి సస్యాలు ఉద్భవించిన వారు .వీరికి బ్రహ్మాయుస్సు ఉంటుంది .

              శివ శర్మ సత్య లోకం చేరుకొన్నాడు .బ్రహ్మ అతడిని  చూసి ‘’ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు .నిత్యం నేను ఇక్కడ ప్రళయాన్ని సృష్టిస్తాను .విరాట్ పురుషుని వరకు ఉన్న సృష్టిని అంతటిని హరుడు రోజు సంహరిస్తాడు .అలాంటప్పుడు మరణ ధర్మం ఉన్న మానవుల గురించి చెప్పాల్సిన్దేముంది ?కృత ,త్రేతాది యుగాలకు మనుష్యులకు తగినది ఒక్కటే యుగం .ఆ యుగం లో భారత వర్షం లో మానవులు వికశిస్తారు .మనసు లో కూడా ఇంద్రియాలను జయించి, కామ క్రోధాదులను వదిలి ,తపస్సు చేత యశో సంపద పొంది,తమో గుణాన్ని విసర్జించి ,సంపద మీద ఆసక్తి లేకుండా ,అహంకారాన్ని వదిలి నవారు ,స్మృతులను సమగ్రం గా తెలుసుకొన్న వారు ,స్నేహం తొ ధర్మ సోపాన్ని అధిరోహించిన వారు ,భారత దేశం లో మళ్ళీ మళ్ళీ పుట్టి ,మానవులు అని పించుకొంటారు .

              ‘’ఈ బ్రహ్మాండం లో స్వర్గానికి మించినది లేదు .తపస్సు ,దానము ,వ్రతాలు చేసిన వారు స్వర్గం చేరతారు .స్వర్గం కంటే పాతాళలోకం రమ్యం గా ఉంటుందని నారదుడు చెప్పాడు .దైత్య ,దానవ కన్యల చేత పాతాళలోకం శోభిల్లు తుంది మోక్షాన్ని పొందిన వారు కూడా పాతాళ లోకం లో జన్మిస్తారు .పాతాళం లో పగటి పూట సూర్యుడు ప్రకాశిస్తే ,రాత్రిళ్ళు చంద్రుడు వెలుగు లను చిమ్ముతాడు .చంద్ర కిరణాలలో చల్లదనం ఉండదు .ఇక్కడ విద్యలు కోకిల స్వరాల్లా విని పిస్తుంటాయి .వీణా వేణు మృదంగ ధ్వనులు చెవులకు ఇంపు చేకూరుస్తాయి .ఇక్కడ హా ట కేశ్వర మహా లింగమున్నది .అన్ని కోర్కెలను తీరుస్తుంది .దానవులకు భోగ భూమి ఇది .

                ‘’ పాతాళం కంటే రమ్య మైనది ద్విజ వర్షము .ఇది ఇలా వృతం .ఇక్కడ రత్న సానువు లున్నాయి .పుణ్యాత్ములకు దివ్య భూమి .సత్యం భాషణులు ,పుత్రులున్నవారు ,ఉత్తమ క్షేత్రాలను సందర్శించిన వారు ఇక్కడకు వస్తారు .ఇందులో ద్వీపాలు చాలా ఉన్నాయి .వాటిని సముద్రం చుట్టి ఉంటుంది .

            ‘’జంబూ ద్వీపానికి మించిన ద్వీపం లేదు .ఇక్కడ నవ వర్షాలు దేవతల భోగ భూములు .దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చి ఇక్కడ ఉంటారు .ఇది తొమ్మిదివేల  యోజనాల విస్తీర్ణం కలది .దీనిలో మేరు పర్వతానికి దక్షిణం గా ఉన్న భారత వర్షం మొట్ట మొదటిది .హిమవత్ ,వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం అత్యంత పవిత్ర మైనది .ఉత్తమ పుణ్య క్షేత్రాలెన్నో ఉన్న భూమి .అందులో కురుక్షేత్రం చాలా గొప్పది .దాని కంటే నైమిశారణ్యం ,గొప్పది దీన్ని తీర్ధ రాజం అంటారు .అన్ని ఒర్కేలను తీర్చేది .నిరంతరం యజ్న యాగాదుల తొ అలరారు తు ఉంటుంది .

             ‘’ సప్త ధాతు మయ మైన మహా పాపాలు శరీరం లోని కేశాలను ఆశ్రయించుకొని గట్టిగా పట్టుకొని ,వదల కుండా ఉంటాయి .కనుక ప్రయాగ లాంటి తీర్ధాలలో ముమ్దనం అంటే గుండు కొట్టించు కొంటె ,పాపాలన్నీ వదిలి పోతాయి .త్రివేణీ సంగమ స్నానం దోషాలన్నిటిని హరించి పుణ్య లోక ప్రాప్తి కల్గిస్తుంది .ఇక్కడ పుణ్యవిధి నిర్వహించిన వారంతా సత్య లోకానికి చేరుకొంటారు .

             ‘’  కాశీ అన్ని టి కంటే గొప్ప ముక్తి క్షేత్రం .ఈ క్షేత్రం ఈశ్వరుని త్రిశూలాగ్రం లో ,భూమికి ,ఆకాశానికి మధ్య ఉన్నది .ఇక్కడ ఎప్పుడూ కృత యుగమే .నిత్యం మహా పర్వదినమే .ఎప్పుడూ ఉత్తరాయణమే .ఎల్లప్పుడు మహోదయమే .కాశిని సృష్టించిన వాడు సాక్షాత్తు మహా శివుడు .కాశీ లో పాపం చేయరాదు ఇక్కడ తులా పురుష దానం లాంటివి చేసిన వారు సత్య లోక వాసులవుతారు .జప ,తప ,ధ్యానదుల వల్ల రాని మోక్షం కాశీ నివాసం తొ ,కాశీలో మరణం తొ కలుగు తుంది .అని బ్రహ్మ దేవుడు కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించాడు శివ శర్మకు

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List