కాశీ ఖండం – 11 ~ దైవదర్శనం

కాశీ ఖండం – 11




నైరుతి ,వరుణ లోక వర్ణన శివ శర్మ నై రుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని విష్ణు దూతలను కోరగా వివరిస్తున్నారు. మొదటిది నైరుతి.పుణ్య వతి పుణ్య జనులకు ఆవాసం .వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు.దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా ఈ లోకంలభిస్తుంది అని పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు

                                                          పింగా క్షోపాఖ్యానం

             విన్ధ్యాటవి  లో ఒక పల్లె కు పింగాక్షుడు ప్రభువు .మంచి శూరుడు క్రూరకర్మాలంటే అయిష్టం .నిర్దాక్షిణ్యం గా జంతువులను, మనుష్యులను చంపే వారిని కఠినం గా శిక్షించే వాడు అడవిలో ప్రయాణించే వారిని వెంట ఉండి దాటిస్తాడు .ఒక సారి ఇతని బంధువు ప్రయాణీకులను హిమ్సిన్చాడని విన్నాడు రహస్యం గా వచ్చి వాడిని పట్టుకొన్నాడు ఇతరులకు అపకారం చేయ వద్దని హెచ్చ రించాడు .వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి గౌరవం గా సాగ నమ్పాడు .ఇంకో సారి మరో బృందం వస్తుంటే కొందర్ని వాళ్ళను చంపమని దోచుకోమనీ హెచ్చరికలు వచ్చాయి అప్పుడు వారంతా తాము పిన్గాక్షుడున్నాడనే ధైర్యం తో వచ్చామని కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని ప్రాణాలను రక్షించమని యాత్రికులు వేడుకొన్నారు .ఈ మాటలను విన్న పింగాక్షుడు వారిని భయ పడ వద్దని అనునయిస్తూ ,ఆ చోటుకు చేరుకొన్నాడు .ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి తన అనుచర గణం తో పిన్గాక్షుడిని చంపమని ఆదేశించాడు .ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి బంధించాడు .కాని అతని ధనుస్సు బాణాలు ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకు లవటం తో వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు .నైరుతి దిక్కు నుండి దేవ దూతలు వచ్చి పింగాక్షుని దేవ విమానం లో తీసుకొని వచ్చి నైరుతి దిక్కుకు ప్రభువును చేశారు

                                                                     వరుణ లోక వర్ణన

                 అక్కడి నుండి విష్ణు శర్మ ను వరుణ లోకానికి విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .ప్రజలకోసం బావులు ,చెరువులు త్రవ్వించిన వారు వరుణ లోకానికి వస్తారు ఐశ్వర్య సంపన్నం .దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించె వారు ఈ లోకం చేరుతారు .వేసవిలో విసన కర్రలను దానం చేసిన వారు ,సుగంధ పు చల్లని పానీయాలిచ్చే వారు ,చలివెంద్రాలను ఏర్పాటు చేసే వారు వరుణ లోకానికి చేరతారు .జలదారా మండపాలను నీడ నిచ్చే మండపాలను నిర్మించిన వారికిది నెలవు .పుణ్య నదులలో స్నానం చేయటానికి వీలుగా మెట్ల నిర్మాణం చేసే వారు ,వరుణ లోకం ఆవాస భూమి .అన్ని జలాశయాలకు వరుణుడు అది పతి .అన్ని సముద్రాలకు నీటిని ,ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా

                                                             వరుణుని జన్మ వృత్తాంతం

     కర్దమ ప్రజా పతికి శుచిష్మన్తుడనే కుమారుడున్నాడు .వినయ శీలి సుగుణ వంతుడు ధైర్య శాలి .ఒక రోజు ఇతడు కొందరు బాలురతో కలిసి ఒక సరస్సులో స్నానానికి వెళ్లాడు .నీటి లో దిగ గానే అతడిని ఒక మొసలి పట్టుకోంది .ఈ విషయాన్ని స్నేహితులు తండ్రికి తెలియ జేశారు .ఆయన అప్పుడు శివధ్యానం లో ఉన్నాడు .తన సర్వజ్ఞత్వం వల్ల ఒక సరస్సులో కొంత మందిముని బాలురు  జలక్రీడలాడటం కనీ పించింది .అందులో రుద్రరూపుడైన ఒక ముని బాలుడు‘’ఓయి సముద్రాదిపా !భక్తుడైన కర్దమ ప్రజా పతి కుమారుడడేక్కడ ఉన్నాడు ?శివుని సామర్ధ్యం తెలియ కుండా దుష్క్రుత్యానికి పాలు పడ్డావు ‘’అని గర్జించాడు .సముద్రుడు భయ పడి బాలుడిని రత్నాల తో అలంకరించి శిశు మారక మైన మొసలిని బంధించి తెచ్చి శివుని పాదాల చెంత పడే శాడు .శివుని పాదాలకు నమస్కరించి ‘’మహా శివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువ వల్లనే శిశువు కు మరణం సంభవించింది .’’అని విన్న విన్చుకొన్నారు .అప్పుడు శివుడు మన్నించి ఆ బాలుని తండ్రి కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి అప్పగించమని ప్రమధగణాలకు చెప్పాడు .తండ్రి కుమారుని చూచి సంతోషం తో కౌగలించుకొని యోగాక్షేమాలను విఛా రించాడు .బాలుడు జరిగిన వృత్తాంతం అంతా తండ్రికి తెలియ జేశాడు .తండ్రి అనుమతి గ్రహించి బాలుడుకాశీలో శివ లింగాన్ని ప్రతిష్టించి  అయిదు వేల సంవత్స రాలు శిల లాగా నిశ్చలం గా శివుని కోసం తపస్సు చేశాడు .మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తనకు జలాల పై ఆధి పత్యం కావాలని బాలుడు విన్న వించాడు .అప్పుడు భవానీ పతి ‘’నువ్వు వాపీ ,కూప తటాకాది ,నదీ నదాలకు సమస్త జలాలకు అది పతి వి అవుతావు .సమస్త రత్నాలకు అది పతి వి నీవే . .పశ్చిమ దిక్కునకు అధిపత్యం నీదే . .పాశ పాణి వై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు .నువ్వు స్థాపించిన లింగం ‘’వరుణేశ్వర లింగం ‘’గా ప్రసిద్ధి చెందుతుంది మణి కర్నేశ్వరుని నైరుతి దిశలో సంస్తాపిత మై ఉంటుంది .దీని నర్చించిన వారికి అకాల మరణం రాదు .నీరసాలైన అన్న పానాదులు వరుణుని అనుగ్రహం తో సరసములు గా మారుతాయి ‘’అని వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు .శుచిష్మంతుడు  అనే ఆ బ్రాహ్మణ బాలుడు నైరుతి దిశకు అధిపతి అయాడు.


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List