కాశీ ఖండం –20 ~ దైవదర్శనం

కాశీ ఖండం –20


ధ్రువుని నారాయణ స్తుతి... తన ముందు ప్రత్యక్ష మైన వాసు దేవుడిని ధ్రువుడు ఇలా స్తుతించాడు ‘’పరాత్పరా నారాయణుడా !సృష్టి కర్తవు ,హిరణ్య గర్భుడివి ,హిరణ్య రేతస్కుడివి ,హిరణ్య దాతవు ,అయిన నీకు నా ప్రణామం .మనో రణ్యానికి దావాగ్ని వంటి వాడవు .చక్ర దారివైన ,శ్రీ పతివి ,వరాహ రూపం లో భూమిని రక్షించావు.నరకాన్ని హరించే నారాయణుడవు .హరివి ,శౌరివి .అనంత శయనుడవు .రుక్మిణీ పతివి .పుండ రీకాక్షుడవు .జయ స్వరూపుడవు .బలి యజ్న హర్తావు .వర ప్రదాతవాగు నీకు నమస్సులు .వేలకొలది కన్నులు ,వేలకొలది పాదాలు ,వేలాది ఆకారాలు ధరించిన యజ్న పురుషుడవు . భూమిని ధరించి ఉద్ధరించావు .కమలా కాన్తుడవు .కమలహస్తుడవు ,కౌస్తుభ వక్షస్కుడవైన నీకు నమస్కారం .శ్రీ వత్సం ధరించిన వేద వేద వేదాంగ వేద్యుడవు .గుణ రూప వాసుదేవుడవు .పద్మ నాభవుడవు .దేవకీ నందనుడవు .పాంచజన్య ధారివి .వాసుదేవుడవు .ప్రద్యుమ్న ,అని రుద్ధడవు .దామోదర, హృషీ కేశుడవు …వేద త్రయుడవు .వైకుంఠవాసివి ,గరుడ గామినివి ,విష్టర స్రవుడ వైన నీకు వందనం .అండజ ,స్వేద ,ఉద్భిజ ,జరాయుజ రూపుడవు .గ్రహాలలో సూర్యుడవు .దేవతలకు దేవేంద్రుడవు .సముద్రాలలో పాల సముద్రానివి .గోవులలో కామ ధేనువు ,లోహాల్లో బంగారం ,రాళ్ళలో స్పటికం ,పూలలో నల్ల తామర ,వృక్షాలలో తులసి ,శిలలో సాలగ్రామం,ముక్తి క్షేత్రమైన కాశీ ,నీవే ..తీర్ధాలలో ప్రయాగ ,రంగులలో తెలుపు ,మానవులలో బ్రాహ్మణుడు ,పక్షులలో గరుత్మంతుడు ,వ్యవహారాల్లో వాక్ స్వరూపం ,వేదాలలో ఉపనిషత్తు ,మంత్రాలలో ప్రణవం ,అక్షరాలలో ఆకారం ,యజ్ఞం లో సోమరసం ,ప్రజా పతులలో అగ్ని ,నువ్వే .అని వేదాలన్నే ఘోషిస్తున్నాయి .దాతలలో మేఘానివి .ల విత్రులలో పరుడవు .సర్వ శాస్త్రాలలో ధనుస్సువి .వేగం కల వానిలో వాయువువి .ఇంద్రియాలలో మనసువు .భయ రహితులలో ఏనుగువు .వ్యాపక శక్తి కల వాటిలో ఆకాశానివి .యజ్ఞా లలో అశ్వ మేధానివి .దానాలలో అభయం నువ్వే .యుగాలలో కృత యుగానివి .తిధులలో‘’కుహు ‘’వు .నక్షత్రాలలో పుష్యమివి .పర్వాలలో సంక్రమణానివి .యోగాలలో వ్యతీ పాతి వి .గడ్డి రకాలలో దర్భవు .అన్ని యత్నాలలో నిర్వాణం నీవే .బుద్ధులలో ధర్మ బుద్ధివి .వృక్షాలలో అశ్వత్తము నువ్వే .లతలలో సోమ తీగవు .సాధనాలలో ప్రాణా యామానివి .అన్నీ ఇచ్చే వారిలో కాశీ విశ్వేశ్వరుడివి .హితులలో భార్య వంటి వాడవు .బంధువులలో ధర్మం వంటి వాడివి .నువ్వే తల్లీ తండ్రీ గురువు దైవం .నిన్ను ధ్యానిన్చటమే తపస్సు

                      నీకోసం ఖర్చు పెట్టిందే దానం .నీ సేవలో గడిపిందే కాలం .నీవు ఎంతకాలం హృదయం లో ఉంటావో అంతకాలమే జీవితం .నీ సంకీర్తనమే మాంగల్యం ,ధనార్జనం ,జీవిత ఫలం .అదోక్షతుని కంటే వేరే ధర్మం లేదు నారాయణు ని ని కంటే వేరే దానం లేదు .కేశవుని కంటే వేరే కామం లేదు .హరి కంటే మించిన అప వర్గం లేదు .వాసుదేవుని స్మరించ కుండా ఉండటం కంటే వేరే హాని ఉండదు ఆపద లేదు ,దురదృష్టమూలేదు .తెలీకుండానే హరీ అన్నా పాపాలు దహించుకు పోతాయి .నీ ప్రసాదం యజ్ఞం లోనీ పవిత్ర మైన పురోడాశం వంటిది .నీ స్మరణ యజ్ఞం చేసి అవ బృద స్నానం చేసి నంత పుణ్యం .’’అని ధ్రువుడువిష్ణు వు ను మనసారా ,ఆర్తి గా స్తుతించాడు .

                వాసు దేవుడు అత్యంత ప్రీతీ చెంది ధ్రువుని తొ ‘’ధ్రువ బాలకా !నీ స్తిర చిత్తానికి మెచ్చాను .నీ స్తోత్రం పరమాద్భుతం గా ఉంది.భక్తీ భావ బంధురం .కొన్ని విషయాలు చెబుతాను జాగ్రత్త గా విని అర్ధం చేసుకో .అన్నం వల్ల భూతాలు పుడుతున్నాయి .వర్షానికి కారణం సూర్యుడు ఆ సూర్యుడికి నువ్వు ఆధార భూతుడవవు  తావు .జ్యోతిస్చక్రం లో సర్వ గ్రహ ,నక్షత్రా లకు ,ఆకాశం లో సంచ రించే వాటి కన్నిటికి నువ్వు ఆధార భూతుడవు గా ఉంటావు ..పశువును కట్టు గొయ్య కు తాడుతో బంధించి తిప్పి నట్లు నువ్వు జ్యోతిస్చక్రాన్ని త్రిప్పు తావు .ఆ కల్పాంతం నువ్వు ఆ ధ్రువ పదం లో ఉండి పోతావు .నేను పూర్వం ఈశ్వరుని ఆరాధించి ,ఏమేమి పొందానో నువ్వు పొందుతావు .కొంత మంది ఈ పదవిలో నాలుగు యుగాలుంటారు .కొద్ది మంది మన్వంతరాలు ఆ పదివిలో ఉండగలరు .నువ్వు మాత్రం ఈ ధ్రువ పదం లో ఆకల్పాంతం ఉంటావు .ఇదే అత్యుత్తమ పదం .ఇంద్రాదులకు కూడా ఈ పదవి దక్కదు .నీ తల్లి సునీత కూడా నీతో నే ఉండు గాక ..నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారింటి వద్ద లక్ష్మీ దేవి ఎప్పుడు కొలువై ఉంటుంది .పాపాలన్నీ నశిస్తాయి . .మాత్రు వియోగం ఉండదు .నా మీద చాలా మంది స్తోత్రాలు చెప్పారు .వాటన్నిటి కంటే నీ ధ్రువ స్తోత్రం సర్వోత్తమ మైనది .సర్వ ఫలదాయక మైనది

        ‘’ ధ్రువా !నాకిప్పుడు మోక్ష కారకుడగు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించాలనే కోరిక తీవ్రం గా ఉంది .కాశి అంటే ఆనంద కాననం .నేను రోజూ వైకుంఠంనుంచి కాశీ వెళ్లి విశ్వ నాధుని దర్శించు కొంటాను .నేను మూడు లోకాలను పాలించ టానికి కావలసిన శక్తి సుదర్శన చక్రం వల్లనే కలుగు తుంది .దాన్ని పరమ శివుడు తన పాదం బొటన వ్రేలిని నేలకు రాసి ఆ చక్రాన్ని సృష్టించి నాకు అనుగ్రహించాడు .ఇది ఈ హరికి ఆ హరుడు ప్రసాదించిన దివ్యా యుధం .ఆ చక్రాన్నే నిన్ను భయ పెట్టె భూతాలను పారద్రోలింది .’’అని చెప్పి ధ్రువుని గరుడ వాహనం పై ఎక్కించుకొని శ్రీ మహా విష్ణువు కాశీ క్షేత్రానికి తీసుకొని వెళ్లాడు .మణి కర్ణిక లో ఇద్దరు స్నానం చేశారు విశ్వ నాద దర్శనం చేశారు .ఆ తర్వాత వాసు దేవుడు ధ్రువుడిని కాశీ లో ఒక లింగాన్ని ప్రతిష్టించి నిష్టగా శివార్చన చేయ మని చెప్పి అదృస్య మయాడు ధ్రువుడు అలానే చేసి శివానుగ్రహాన్ని సాధించుకొన్నాడు .ధ్రువ కుండం లో స్నానం చేసి ద్రువేశ్వర లింగాన్ని అర్చించిన వారికి ధ్రువ లోకం లభిస్తుందని పరమ శివుడు వరమిచ్చాడు .పొందిన వరాలతో, సంతృప్తి చెందిన మనసు తొ ధ్రువ బాలుడు ఇంటికి తిరిగి వెళ్లాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List