శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ~ దైవదర్శనం

శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం




కనువిందు చేసే ఆలయ శిఖరంపై కలశం.. జనమేజయ చక్రవర్తి ప్రతిష్టించిన.. శివలింగం వెరసి మహిమాన్వితమైన ప్రకాశం జిల్లాలోని సత్యవోలు రామలింగేశ్వరస్వామి ఆలయం. ఇది చాలా పురాతన ఆలయం.


స్థల పురాణం..


రామాయణం లో రాముడు రావణుడిని సంహరించి బ్రహ్మహత్యా పాతకం కలిగినందుకు దేశంలో చాలా చోట్ల శివలింగాలని ప్రతిష్టించాడని తెలుసు, అదే విధంగా మహాభారతంలో పాండవులు కూడా అదేవిధంగా కొన్ని చోట్లా శివలింగాలను ప్రతిష్టించారని పురాణాలూ చెబుతున్నాయి. 


అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ ఆలయంలో మాత్రం శివలింగాన్ని పాండవుల మనుమడు శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది.


ఈ ఆలయంలో పాండవుల మనుమడు జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ తరువాత కాలంలో చాళుక్యుల రాజులచే ఆలయ నిర్మాణం జరిగింది. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శైవులైన చాళుక్యులు ఆంధ్రదేశంలో అనేక శివాలయాలను నిర్మించారు.


అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతిఫలిస్తుంది. ఇది ప్రాచీనతతో బాటు విశిష్టత చాటుకుంటూ ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది. ఈ గుడి గిద్దలూరు పట్టణానికి చాలా దగ్గర్లో ఉంది.


గర్భగుడి గోడలకు ఉన్న గూళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్భవ మూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి.

గర్భగుడి మధ్యభాగంలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. శిఖరంపై కలశం కనువిందు చేస్తుంది. 

గుడి చాలా ఎత్తుగా ఉంటుంది.


దేవాలయంలో పెద్ద మండపం, గర్భగుడి, అంతరాళం ఉన్నాయి. గుడికి దక్షిణాన నాలుగు చేతులున్న దేవతామూర్తి ఉంది. అంతరాళం శిఖరంపై రాతి కలశం ఉంది. ప్రాచీనతను చాటే మండపంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి. వాటిపై అలరించే శిల్పాలున్నాయి. దేవాలయ మధ్యభాగంలో నటరాజ విగ్రహం ఉంది.


సత్యవోలు రామలింగేశ్వస్వామి ఆలయం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. అన్ని శైవ ఆలయాలే కావడం విశేషం. ఈ దేవాలయాలు అన్నిటిలో పెద్దది భీమలింగేశ్వర స్వామి ఆలయం. దీని ముఖద్వారం తూర్పు దిక్కుకు ఉంటుంది. మహా మండపానికి మూడు దిక్కులా అంటే తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది.


రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని చుట్టు పక్కలవారే కాకుండా, ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం మరీ కిటకిటలాడుతుంది.


సత్యవోలు రామలింగేశ్వరస్వామి దేవాలయ వాస్తు శిల్ప కళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది. 

మహానంది దేవాలయాన్ని కూడా చాళుక్యులే నిర్మించారు.


దేవాలయం తెరచు వేళలు:  

ఉదయం 9:00 గంటలనుండి మద్యహాన్నం:12.30 వరకు, 

తరువాత 1:30 నుండి రాత్రి 5:00 వరకు గుడిని తెరచి వుంచెదరు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణానికి 8 కీ.మీ. దూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో శ్రీ రామలింగేశ్వరాలయం ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List