నేడు నాగ పంచమి ~ దైవదర్శనం

నేడు నాగ పంచమి






ఈ సంవత్సరం నవంబర్ 28వ తేదీన అంటే సోమవారం నాడు మార్గశిర శుద్ధ నాగ పంచమి వచ్చింది. ఇంతకు పూర్వం నాగుల చవితి రోజున ఎవరైతే పూజలు చేయలేకపోయారో అలాంటి వారంతా ఈ పవిత్రమైన రోజున నాగ దేవతలకు పూజలు చేస్తే కాలసర్ప దోషం నుంచి కచ్చితంగా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం, నాగ పంచమి రోజున ఆది శేషుడిని బ్రహ్మదేవుడు ఆశీర్వదించిన రోజుగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ మాసం నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ కాలం ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా మార్గశుద్ధ పంచమి రోజున నాగ దేవతలకు పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో మీరూ చూసెయ్యండి.


హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర శుక్ల పంచమి తిథి నవంబర్ 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు అంటే నవంబర్ 28వ తేదీన మధ్యాహ్నం 1:35 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం సోమవారం నాడు మార్గశిర నాగ పంచమిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.


ఈ పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల కాల సర్పదోషాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయని భక్తులంతా విశ్వసిస్తారు. మరోవైపు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి వారికి అభిషేకాలు, అలంకారాలు చేయించిన వారికి డబ్బుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు.


* మార్గశిర శుద్ధ నాగ పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి.

* స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజా గదిలో లేదా ఏదైనా దేవాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి.

* ఈ పవిత్రమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి.

* అనంతరం నాగ దేవతలను పూజించాలి. నాగ దేవుళ్ల(సర్పాల)కు పాలు సమర్పించాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.


నాగ పంచమి రోజున పగలంతా ఉపవాసం ఉండాలి. నాగ దేవతలకు ఇంట్లో గోధుమలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేసిన వారికి సకల బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సంతాన సమస్యలతో బాధపడే వారు నాగ పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు రావడంతో పాటు నాగ దోషాలన్నీ తొలగిపోతాయి. రాహు, కేతు ప్రభావం కూడా తగ్గుతుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List