వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరతాయి ~ దైవదర్శనం

వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరతాయి





లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న 'అయినవిల్లి'కి ఒక కిలోమీటరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామి 'ముక్తేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు.


ఈ ముక్తేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ విభాగంలో అయినవిల్లి మండలం, కోనసీమ డెల్టాలో ఉంది. ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి-గొదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంటకాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు గోదావరి నది ఒడ్డు, ఇలా ఎన్నో అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ముక్తేశ్వర ఆలయం కాకినాడకు దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..


పురాణ కథ:


ముక్తేశ్వర ఆలయం ఒక పురాతన ఆలయం. పురాణాల ప్రకారం ఈ గ్రామాన్ని ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఒక దానికెదురుగా ఒకటిగా రెండు శివాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.మొదట ఎదురుగా ఉండే దేవాలయంలో ఉన్న దేవున్ని క్షణ ముక్తేశ్వరుడు అని పిలుస్తారు.


శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది..


ఈ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది. ప్రసిద్ది చెందిన శివుని ఆలయాల్లో శ్రీముక్తికంఠ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. రామాయణం ప్రకారం, స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుండి పుష్పకవిమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే శివలింగం ఒకటి చూశాడు.


వెంటనే ఆ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని అక్కడే కొలువై ఉండాలని కోరగా, శ్రీరాముడి భక్తికి ఆ పరమశివుడు ఇక్కడే కొలువైనాడనికి చెబుతారు. అయితే ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని అంటారు. శ్రీరాముడు ప్రార్ధించిన వెంటనే స్వామి క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట. అందువలన ఇక్కడి స్వామివారిని 'క్షణముక్తేశ్వరుడు' అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటారు.


దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.


ఈ ముక్తేశ్వరం  గ్రామానికి సుమారు 2కిలో మీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో జగత్ప్రసిద్దమైన మహాగణపతి ఆలయం కూడా ఉంది. 


ఓం నమః శివాయ🙏


 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List