కుమారస్వామి లీల ~ దైవదర్శనం

కుమారస్వామి లీల

తిరుచెందూర్ లో నివసించే ఒక సాధువు వద్ద సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిమ ఒకటి వున్నది. ఆ సాధువు నిత్యమూ సముద్ర స్నానం చేసి అడవిలో పూచే రక రకాల పుష్పాలు  కోసుకుని వచ్చి  పూజలు చేస్తూండేవాడు.


ఆ సాధువు  దీర్ఘదర్శి.తనకు అంత్యకాలం ముందే  తెలుసు.  అందువలన తాను మరణించడానికి ముందే  తన దగ్గరున్న మురుగన్ ప్రతిమను  వేరెవరైనా భక్తుడి ఇవ్వాలని కుమారస్వామి  అనుగ్రహించాలని మనసారా ప్రార్ధించాడు.


ఆనాటి రాత్రి కుమారస్వామి ఆ సాధువు కలలో ఒక వృధ్ధునిగా అగుపించి ఆ సాధువుని కొండల్లో గుట్టల్లో ,అడవుల్లో  త్రిప్పాడు . ఒక ఉద్యనవనంలో  ధ్యానంలోవున్న ఒక వ్యక్తిని  చూపి, అతనికి ఆ  దేవుని విగ్రహాన్ని అప్పగించమని చెప్పి అదృశ్యమైపోయాడు.


స్వప్నం లో మురుగన్ తీసుకువెళ్ళిన దిశలో పయనించిన సాధువు కలలో కనిపించిన వ్యక్తిని కలుసుకున్నాడు. తను పూజిస్తున్న పంచలోహ విగ్రహాన్ని అతనికి యిచ్చి  భక్తితో పూజించమని చెప్పాడు.


ఆ వ్యక్థి ఓ పూతోటలో కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి  పూజించసాగాడు. ఆరంభంలో ఆ తోటలోని చిన్న కుటీరంలో ప్రారంభమైన ఆ ఆలయం కాలక్రమేణా అభివృద్ధి చెంది పెద్ద ఆలయంగా రూపొందింది.


ఈ విధంగా మురుగనే భక్తులకు స్వయంగా స్వప్నంలో ఆనతి యిచ్చి నిర్మించబడిన ఆలయమే  తంజావూరు 

పూక్కారతెరు అనే వీధిలో నిర్మించబడిన సుప్రసిధ్ధ మురుగన్ ఆలయం.


ఈ ఆలయంలోని మురుగన్ కి విశాఖ నక్షత్రం రోజున అభిషేకం చేసి పూజించిన కార్యసిద్ధి లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List