‘అమాత్రశ్చతుర్థో2 వ్యవహార్యః ప్రపంచోపశమః
శివో ద్వైత, ఏవమోంకార ఆత్మైవ
‘అ’, ‘ఉ’, ‘మ’ అనేవి మూడు మాత్రలు, అనగా, అంశాలు. ఈ మూడు కలిస్తే ‘ఓం’ అవుతుంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలు ఓంకారంలోని ‘అ’, ‘ఉ’, ‘మ’ అనే మూడు అంశాలు. ఈ మూడు అంశాలు లేనిదే ఈ నాల్గవ అవస్థ అయిన తురీయావస్థ. ఇది జీవుని నాల్గవ పాదం. ఈ అవస్థలో వ్యవహారం గాని, జగత్తుతో సంబంధం గాని ఉండవు. ఈ స్థితిలో కేవలం పరమానందంతో పరమాత్మలో ఐక్యం అవడం అని అద్వైతులు, పరమాత్మ సన్నిధిలో వైకుంఠంలో ఉండటం అని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు.
No comments:
Post a Comment