గ్రహాలు - మన మీద వాటి ప్రభావాలు. ~ దైవదర్శనం

గ్రహాలు - మన మీద వాటి ప్రభావాలు.


తృటి - సెకనులో 362వ భాగం
30 తృటులు ఒక లవం
30 లవములు - ఒక యవం
30 యవములు - ఒక సూక్షం
30 సూక్షములు - కాష్ఠం
15 కాష్ఠములు - ఒక నిమేషం
15 నిమేషములు - ఒక విఘడియ
60 విఘడియలు - ఒక ఘడియ
రెండున్నర ఘడియలు - ఒక గంట
పన్నెండు గంటలు - ఒక పూట
రెండు పూటలు - ఒక రోజు
ఏడు రోజులు - ఒక సప్తాహం
రెండు సప్తాహములు -ఒక పక్షం
రెండు పక్షాలు - ఒక మాసం
రెండు మాసములు - ఒక ఋతువు
మూడు ఋతువులు - ఒక అయనం
రెండు అయనాలు - ఒక సంవత్సరం
తృటి నుంచి సంవత్సరం వరకూ 60 భాగాలు

అరిషడ్వర్గాన్ని జయించాలంటే ఐదింటిని జయించాలి - అవి పంచభూతాలు
ఆ ఐదిటినీ జయించాలంటే పన్నెండుని ఆశ్రయించాలి - పంచ జ్ఞ్యానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు బుధ్ధి
ఈ పన్నెండుతో ఐదిటిని గెలిస్తే 12x5 = 60
ఆరు ఋతువులు - ఒక్కొక్క ఋతువుకీ రెండు మాసాలు అలాగే మనకి ఉండేవి ప్రవృత్తి  నివృత్తి. అలాంటివి మూడు ఋతువులు ఒక ఆయనంలో. సత్వ రజ తమో గుణాలు.
3 గుణాలతో ప్రవృత్తి నివృత్తులని అనుసరిస్తే ఆరు అవుతాయి. ఆరు పదులు (పది ఇంద్రియాలతో హెచ్చవేస్తే )   అరవై.
ఈ విధానంలో రాశులు పన్నెండు, మాసాలు పన్నెండు. సౌర చాంద్ర మానాల్లో 12 మాసాలు. సూర్యుడు బుధ్ధి స్థానం (గాయత్రీ మంత్రంలో అందుకే బుధ్ధిని ప్రచోదనం చేయమని అడుగుతాము) చంద్రుడు మన: కారకుడు. ఈ రెండే ప్రధాన గ్రహాలు. పంది ఇంద్రియాలు మనసుతో నియమించి బుధ్ధితో ప్రవర్తింపచేస్తే సంవత్స్రం హాయిగా గడుస్తుంది. కాని బుధ్ధినే మనసుతో నియమించి ఆ మనసుని ఇంద్రియాలతో వశం చేసుకుంటే సంవత్సరంలో అన్నీ కష్టాలే.
ఇలా వచ్చే కష్ట సుఖాలకు ప్రతీక గ్రహములు. గ్రహం అంటే పట్టుకు పీడించేది గ్రహం.
ఒక్కో గ్రహం ఒక్కో స్థానాన్ని చెబుతుంది
సూర్యుడు - బుద్ధి,
చంద్రుడు -మనసు
కుజుడు - నేత్రాలు
బుధుడు - కర్ణములను
బృహస్పతి - మేధస్సును
శుక్రుడు - అంత:కరణమును
శని -  శరీరాన్ని
మిగతా గ్రహాలు చాయా గ్రహాలు.

శంకరుడు కాలుడు తపస్సు చేస్తే ఆయన మహాకాలుడు అవుతాడని స్కాంధం చెబుతుంది. పన్నెండు రాశులు పన్నెండు మాసాలు మనలో ఉన్న పన్నెండుని చెప్పేవే - జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుధ్ధి.
అందులో
చైత్రం - బుధ్ధికి
వైశాఖం - మనసు
జ్యేష్టం - వాక్కు
ఆషాడ  - హస్తము (పాణి)
శ్రావణ మాసం - శ్రవణ ఇంద్రియం
భాద్రపదములు - పాదములు
ఆశ్వయుజం - అశ్వనీ దేవతలు - ఘ్రానేంద్రియము
కార్తీకం - కృత్రిక (అగ్ని) - చక్షు ఇంద్రియం
మార్గ శిరం - మృగేన శీర్షతి- మృగానికుండెది రసనేంద్రియం
పుష్యం - త్వగ్ ఇంద్రియం (పోషించేది)
మాఘం - అఘం చేయకుండా ఉండెది. ఉపస్థ
ఫాల్గుణం - పాయు
ఉపస్థకు రెండు పేర్లు ఉన్నాయి 1. ఆనందం అని 2. అఘం అని.

సంతానం కోసం మాత్రమే ప్రవర్తిస్తే అది పుణ్యం. లేకపోతే పాపం.
ఇలా పన్నెండు ఇంద్రియాలకు పన్నెండు మాసాలు.
కేశవాది ద్వాదశ నామాలు పన్నెండు మాసాలు అని అంటారు. చైత్రే కేశవం అర్చయేత్.
60 సంవత్సరాలని 5 భాగాలు చేసి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇంద్రుడు యముడిగా విభజించి ఒక్కరికీ పన్నెండు సంవత్సరాలు. ఒక్కో సంవత్సరంలో ఒక్కో స్వామిని స్మరించాలి.
ప్రతీ కర్తవ్యాన్ని 33 మంది దేవతలకూ నవ గ్రహాలకు పంచాడు.
సంవత్సరాది నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సారనికి అధిపతి
మేష సంక్రమణం నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సరాని మంత్రి
కర్కాటక సంక్రమణం నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సరాని సేనాధిపతి
ఉత్తరాయణ కాలంలో  ఉత్తరాయణ ప్రవేశం ఏ వారంలో అవుతుందో ఆ అధిపతి వర్షాధిపతి
దక్షినాయన ప్రవేశంలో అధిపతి అర్ఘాధిపతి (ధరలు)
బుద్దిస్థానీయుడు సూర్యుడు. మనకి బుద్ధి వల్ల కలిగే వికారం, చిత్తం అంటాం. అది పాద స్థానీయం. శని పాదాలకి అధిపతి. శూర్యపుత్రుడు శని. శని పంగువు (కుంటివాడు). మనం కూడా చిత్తం సరిగా లేనప్పుడు కాలికి సంబంధించిన సమస్య వస్తుంది.
శుక్రుడు స్తెరెలోలుడు. శుక్రబలం బాగున్నా బాగాలేకున్నా స్త్రీలౌల్యం కలుగుతుంది స్త్రీల వలన అపవాదు కలుగుతుంది. బుధుడు కోమటివాడని శాస్త్రం. లాభనష్టాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. శాస్త్రాము జ్ఞ్యానము విద్యా బృహస్పతి అధీనం.


ఈ గ్రహాలను ఈ రకంగా గుర్తించి, ఇవన్నీ పరమాత్మ వశంలొ ఉన్నాయి అని గుర్తించాలి.
ఈ తొమ్మిదినీ 12 మాసాలు కాబట్టి 12x9 = 108. ఈ పన్నెండు రాశులను 27 గా విభజించాడు. మాసాన్ని 27గా చెప్పారు. 2+7 = 9. ఒక్కొక్కటీ నాలుగు భాగాలు అన్నారు 27x4 = 108. 12x9 = 108.
మనకు పన్నెండు రాశులంటే మనం పుట్టిన సమయంలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో సూర్యుడు ఉన్నాడొ చంద్రుడు ఉన్నాడో అది కలుపుకుంటే మన రాశి మన లగ్నం వచ్చెస్తుంది. సూర్యుడు ఉన్నది లగ్నం చంద్రుడు ఉన్నది రాశి.

మన నక్ష్త్రం రాశిని చెబుతుంది. అది ఏ నక్షత్రంలో ఏ భాగమో అనుకుంటే 9 కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం - ఈ తొమ్మిది కలిపి మేష రాశి.

ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా విభజించుకుంటే 12x9 =108. మొత్తం కాలమానం తొమ్మిదితో ముడిపడి ఉన్నది.

అందుకే మనం వసంతం లోనూ శరదృతువులోనూ నవ రాత్రం చేస్తాం. ఈ నవ ఎమిటి మన శరీరం జాగ్రత్

త గా ఉండటానికి కవల్సినవి తొమ్మిదే. ఆత్మ పరమాత్మ దగ్గరకి చేరడానికి కావలసినవి తొమ్మిదే. శరీరం బాగుండాలంటే నవరంధ్రాలు బాగుండాలి. ఆత్మ బాగుండాలంటే నవవిధ భక్తులు బాగుండాలి. వీటిలో ఎది పొయిన ఆత్మ/శరీరం పతనమవుతుంది. అందుకే ఆ తొమ్మిదీ పన్నెండు ఈ తొమ్మిదీ పన్నెండు ఆ పన్నెండూ తొమ్మిదీ అంతా కలిపి 108. అందుకే మనకి తెలియకపోయినా అష్టోత్తరశతనామం అందుకు చేస్తాం - మా శరీరం బాగుండాలి మనసు బాగుడాలి బుధ్ధి బాగుండాలి ఇంద్రియాలు బాగుండాలి భక్తి బాగుండాలి. ఇందుకు అష్టోత్తరం. దీనికి చిత్తం అంత: కరణం కలిపి ఆ పది పది ఇరవై కాబట్టి నూటా ఇర్వై ఎనిమిది చేస్తారు.

అష్టావింశతి ఉత్తర శతం.
15 తిథులు - పంచ భూతములు పంచ తన్మాత్రలు పంచ ఇంద్రియములు. మొత్తం కాలంలో ప్రతీ అవయవం మన శరీరంలో అవయముల యొక్క ఇంద్రియముల యొక్క ప్రవృత్తితో సంబంధించబడి ఉంది. ఈ శరీరంలో నే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి.

సూక్ష్మత పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. ఒక పర్వతాన్ని చేదిస్తే వచ్చే శక్తి కన్నా ఒక అణువుని విచ్చేదిస్తే వచ్చే శక్తి ఎక్కువ. గ్రహాలు దూరంగా పెరుగుతున్న కొద్దీ, సూక్షమత పెరుగుతున్న కొద్దీ ఆకరం తగ్గుతున్న కొద్దీ వాటి ప్రభావం మన మీద పెరుగుతూ ఉంటుంది (గోడ గడియారం కన్నా చేతి గడియారం ఖరీదు ఎక్కువ అయినట్లు ). మనలో ప్రతీ చిన్న కదలిక వాటితోటే జరిగి తీరుతుంది. శని బాగాలేకపోతే కుంటుట గురువు బాలేకపోతే చేయి

మెలకపడుతుంది అంగారకుడు బాలేకపోతే రక్తం కళ్ళ జూస్తాడు ఎందుకంటే కుజుడు రక్తానికి బుదుడు లెక్కలకి గురువు శాస్త్రానికి సూర్యుడు శిరస్సుకు చంద్రుడు మనసుకు అధిపతి. ఆ సమయము ఆ గ్రహమూ అస్తిథి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీరందరికీ అధిత్పతో వారిని పట్టుకోవాలి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List