మన భారతదేశంలో దాగున్న 12 దేవాలయాల మిస్టరీ. ~ దైవదర్శనం

మన భారతదేశంలో దాగున్న 12 దేవాలయాల మిస్టరీ.


ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది.

ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి *మిస్టరీలు* కొన్ని మీ కోసం... చదవండి..

*తెప్పేరుమనల్లూర్*

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010 లో ఒక రోజు ఉదయం ఆలయపూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై వుండటం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడ్నుంచి బిల్వాపత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటిద్వారా ఆ బిల్వపత్రాలతో శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించివుంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం. కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకూ వీడనేలేదు.

*శని శింగనాపూర్*

మహారాష్ట్రలో ఇది ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది..

*గురుద్వార్*

గురుద్వార్ పంజాబ్ లోని మొహాలీలో వుంది. ఈ గురుద్వార్ లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి వుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు వుంది. సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి. కాని ఇక్కడున్న మామిడిచెట్టుకి కాలాలతో సంబంధం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాస్తూనే వుంటాయి. ఆ మామిడిచెట్టుకి ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్ధం గాని ప్రశ్న..

*యాగంటి*

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం యాగంటి ఆలయం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..

*లేపాక్షి*

లేపాక్షీ మన ఆంధ్రాలో.. అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..

*దార్వేష్ దర్గా*

ఇది పూణేలో వుంది. 90 కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ కరెక్ట్ గా 11 మంది కలిసి ఒక రాయిని కేవలం ఒక్క వేలితో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే *"హజరత్ కమార్ అలీదర్వేష్"* అని పలుకుతూ రాయిని పైకెత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 5 నుంచి 10 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే వుంటుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్క లేదు..

*తంజావూరులో మిస్టరీ*

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం *నీడ*. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా వుంది.

అదే...
*పూరీజగన్నాథ్ ఆలయం*

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు..

*షోలాపూర్*

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంత వరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ..

*కబీస్ బాబా ఆలయం*

ఓ దేవుడు లేని ఆలయం. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం. ఈ ఆలయంలో విగ్రహం వుండదు. పూజారి కూడా వుండడు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని అక్కడివారు చెపుతున్నారు. అయితే అక్కడ ఓ శివభక్తుడు *కబీస్ బాబా* వుంటారు. ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యంసేవించి, భక్తుల అనారోగ్యసమస్యలను నయంచేస్తాడని ఇక్కడివారు నమ్ముతూ వుంటారు..

*అమ్రోహా*

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? *తేళ్ళు!!* అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా..

*మిస్టరీమమ్మీ*

మరో విచిత్రం.. అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది. అదే ఓ మిస్టరీమమ్మీ. మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్. కాని హిమాచలప్రదేశ్ లో *గ్యూ* అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికి షాక్ ఇస్తోంది. సంగాతెన్జింగ్ అనే టిబెట్ కు చెందిన ఒక బౌద్ధసన్యాసి మమ్మీ అక్కడ కూర్చొనివుంది. ఆ మమ్మీ 500 ఏళ్ల నాటిది. అయితే అది చెక్కుచెదరని చర్మం, జుట్టుతో అలాగే వుంది. అయితే ఇదేమిచిత్రమో.. అనేది ఎవరికీతెలీదు.

https://www.facebook.com/rb.venkatareddy


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List