ఓంకారంపై మమకారం. ~ దైవదర్శనం

ఓంకారంపై మమకారం.



న్యూయార్క్‌, క్యాలిఫోర్నియా, బోస్టన్‌లో ధెరపిస్ట్స్‌ ఓంకార నాదంపై ల్యాబరేటరీలలో పరిశోధనలు చేశారు. కడుపునొప్పి, మెదడు, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు ఓంకారాన్ని చేసి రోగ విముక్తురైనారట. ప్రొ.జె. మోర్గాన్‌ తన ఓంకార పరిశోధనలో మృత జీవకణాలకు మళ్లిd పునరుజ్జీవనం కల్గిందట. ప్రణవ నాదం వల్ల ఉదరం, ఛాతి మెదడులో కదలికలు కల్గి నూతనోత్తేజం కల్గిస్తాయి. నాస్తికులు కూడా ఓంకార్‌ ధెరపీ వల్ల లబ్ది పొందుతున్నారు. నాభి స్థానం నుండి ఉద్భవించే ఓంకార జపం కంప్యూటర్లకు కూడా అందనిది. న్యూయార్క్‌లోని కొలంబియా ప్రెస్బిస్టీరియన్‌ హాల్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ధెరపిస్టులు రోగులను సర్జరీకి ముందు ఓంకార జపం చేయిస్త్తున్నారు. అంతేకాక, సర్జన్లు, నర్సులలో ఓంకార జపం చేసినందువల్ల 'ఆపరేషన్‌ సస్కెస్‌' ధృడ నమ్మకం కలుగుతుందని డా|| నరేష్‌ ట్రెహాన్‌ తెలియ జేశారు.
ప్రణవం-అభయం
శరీరంలో ఒత్తిడి పెరిగితే, స్టెరాయిడ్స్‌ శాతం పెరుగుతాయి. ఆపరేషన్‌కు ముందు, తర్వాత ధ్యానం, ఓంకారం చేస్తే, స్టెరాయిడ్స్‌ శాతం గణనీయంగా తగ్గుతాయి. డా||హెర్బర్ట్‌ గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. వారు మైండ్‌, బాడీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారు. వారు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్ర, యోగ, ధ్యానం ఆవశ్యకతను వారి సంస్థ గురించింది. పూజ్యశ్రీ ఆస్రామ్‌ బాపూజీ రోజూ వారి శిష్యులచేవిధిగా ఓంకారాన్ని జపింప చేస్తారు. వారి కీర్తనలలో ఓం కారం తప్పనిసరి వుంటుంది. ఓంకార నినాదం ఫలితం పరిసర ప్రాంతాలలో తప్పనిసరి కానవస్తుంది.
ఆస్రాం బాపూజీ ప్రేరణ
ఆస్రాంబాపూజీ సత్సంగ సమావేశాలలో ఓంకార సాధనను భక్తులతో తప్పనిసరి చేయిస్తారు. ఓం ఓం ప్రభూజీ, మధుర కీర్తన, హరినామ సంకీర్తనలో ఓంకారం వుంటుంది. శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్‌
భగవద్గీతలో 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ శ్లోకంలో ఎవరైతే అంతిమ ఘడియలలో ఓంకారాన్ని జపిస్తారో వారు మోక్షాన్ని పొందుతారన్నారు.
సామవేదంలోని సన్యాస ఉపనిషత్తులో 'ఎవరైతే ఓంకార జపాన్ని 12 నెలలు చేస్తారో వారు భగవంతుని సాక్షాత్కారం పొందుతారన్నది. మహర్షివేద వ్యాసుడు 'మంత్రాణాం ప్రణవసేతు: అంటూ అత్యంత ప్రాధాన్యాన్ని ఓం కారానికి కల్పించారు. గురునానక్‌ 'ఓంకారమే సిసలైన సత్యం అని వక్కాణించారు. యజుర్వేదం ఓంకారంలో బ్రహ్మయిమిడి ఉన్నాడన్నది. మహర్షి పుష్కరుడు 'ఎవరైతే ఓం కారాన్ని నాభివరకూ నీటిలో వుండి జపిస్తారో వారి సర్వపాపాలు హరిస్తాయన్నారు.
ప్రశాంత మంత్రం
మానసిక అశాంతిని తొలగించటానికి ప్రణవ నాదం బాగా పనిచేస్తుందనేది సాధకుల ద్వారా విశ దమైనది. నాభినుండి వచ్చే తరంగాలు మొత్తం దేహంపై ప్రభావాన్ని కలుగ జేస్తాయి. నిర్మలమైన ప్రదేశంలో కూర్చొని ఓంకారాన్ని నినదిస్తే, చక్కటి ఫలితాలు లభిస్తాయనేది పరిశోధకులు తేల్చి చెప్పారు. ముఖ్యంగా బ్రహ్మముహూర్తాన, గోధూళివేళ అనగా సాయం సమయాన, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఓంకారాన్ని జపించాలి. చెన్నైలోని దివ్యజ్ఞాన సమాజం ప్రణవనాదానికి అత్యంత విలువను ఆపాదించింది. వారి గ్రంథా లయంలో 22, 000 ప్రణవనాద శ్లోకాలను భద్రంగా పొందుపరిచింది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List