అష్ట సిద్దులు. ~ దైవదర్శనం

అష్ట సిద్దులు.


అసలు సిద్ధులు అంటే ఏమిటో ???
వీటి వలన ఉపయోగం ...
తెలుసుకుందాం..
#అష్టసిద్ధులు
భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఈ ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు అంటారు.

అవి
1. అణిమ : సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.

2. మహిమ : భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు

3. గరిమ : ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు.

4. లఘిమ : ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు.

5. ప్రాప్తి : ఈ సిద్ధి ద్వారా  కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు.

6. ప్రాకామ్యము : అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.

7. ఈశత్వం : ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది.

8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి

ఐతే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.

#అష్టసిద్ధులు

అనే మాట వినిపిస్తూంటుంది .అయితే వాటిలో కొన్నిటి పేర్లే వినవస్తుం టాయి . ఆ అష్ట సిద్ధుల పేర్లు
#అణిమ – అతి చిన్న వాడిగా మారిపోవడం

#మహిమ – పెద్ద రూపం పొందడం

#గరిమ – బరువుగా మారడం

#లఘిమ – తేలికగా మారిపోవడం

#ప్రాప్తి – ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖెనా ఎక్కడైనా పొందగలగడం

#ప్రాకామ్య – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం

#ఈశిత్వ – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి

#వశిత్వ – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ

#కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం
సిద్ధులు చాలా ఉన్నాయి . అందు వల్ల అష్ట సిద్ధుల్లో కొందరు గరిమను చేర్చి కామావసాయతను పేర్కొనరు .మరికొందరు కామావసాయతను చేర్చి గరిమను పేర్కొనరు . ఏది ఏమైనా అష్ట సిద్ధులు ఇవే .ఈ అష్ట సిద్ధులని పురాణ పురుషులు ప్రదర్శించారు .

అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు .

మహిమా సిద్ధిని హనుమంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు .
ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శించాడు . ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది .

ఇక వామనావతారంలో విష్ణువు మూడడుగులతో భూమ్యా కాశాలను ఆవరించినపుడు కూడా ఇదేవిధంగా పెరిగాడు .

గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు . వాడిని కృష్ణుడు చంపివేశాడు .

భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు .

లఘిమా అంటే తేలికగా అయిపోవడం . ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు .

ఈసిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది .
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు . దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది .

 ఆదిశంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు . తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు . అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు . 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు .
ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు .  ఏసత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు . సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితంలో అంతకాలం వృధా చేయకుండా భగవన్నామస్మరణవల్ల ఉత్తమగతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం .

యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు .  తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు . భగవద్గీతలో  అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది . పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి .   పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక  గనుక మన శరీరమే ఒక  ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి .

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి . అష్టమాయల్ని  జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట . అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు .

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు .  తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు .

“విభూతిర్భూతి  హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్”  – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు .
ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు ?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు .

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు .

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి . అహంకారం ఆవహిస్తుంది . విచక్షణ నశిస్తుంది . నిగ్రహం నీరుకారిపోతుంది .ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు . లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు .  వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు . ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు .
ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి . జీవానందుడు  తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు . సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు .

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు . ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు . అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా  ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు .
ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు . ఇంకేముంది ?
గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది .  జీవానందుడి ఆశ్రమం మూతపడింది . శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు . అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు . అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది . గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి . జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు .

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను . నా తపస్సు కొనసాగించాను , ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు . నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు .

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు . మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు .

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List