ఆలయాల్లోని దేవతా విగ్రహాలను తాకరాదు.. ఎందుకంటే..? ~ దైవదర్శనం

ఆలయాల్లోని దేవతా విగ్రహాలను తాకరాదు.. ఎందుకంటే..?

ఆలయాల్లో ఉన్న దేవతల విగ్రహాలను అర్చకులు తప్ప ఎవరూ తాకరాదు.. ఆలయాల్లో విగ్రహాలను కొన్ని రోజుల పాటు రకరకాల మంత్రాలతో, ఉపాసనతో, హోమాలతో, జపాలతో, తర్పణాలతో ప్రాణప్రతిష్ఠ చేసి, శక్తిని ఆవాహన చేసి ప్రతిష్ఠిస్తారు.

కాబట్టి ఆలయాల్లో విగ్రహాలను తాకకూడదు. విగ్రహాన్ని తాకితేనే దేవుడు అనుగ్రహిస్తాడనుకోవడం పొరపాటు. విగ్రహానికి నమస్కరించి, పూజించి, పూలతో అర్పించి, రకరకాలుగా సేవించినా స్వామి అనుగ్రహిస్తాడు.

స్వామివారిని తాకాలనే కోరిక ఉంటుంది. గనుకనే ఆ కోరిక తీర్చుకోవడం కోసమే ఇళ్లల్లో పూజామందిరాలు వెలిశాయి. ఇంట్లోని పూజమందిరంలో ఉన్న విగ్రహాలను తాకవచ్చు. స్నానం చేయించవచ్చు.

కొత్త వస్త్రాలు ధరింపజేయవచ్చు. దేవాలయాల్లో ఉన్న విగ్రహమూర్తులు ఏ ఒక్కరి కోసమో కాదు. అందరి కోసం.. అందరిని అనుగ్రహించగలిగే శక్తి విగ్రహాలకు ఉంటుంది. కనుక గుడిలో ఉన్న విగ్రహాలను తాకడం మంచిది కాదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List