గీతా మాహాత్మ్యము -3 ~ దైవదర్శనం

గీతా మాహాత్మ్యము -3

గీతాయాః పఠనం కృత్వా
మహాత్మ్యం నైవ యః పఠేత్‌‌,
వృథా పాఠో భవేత్తస్య
శ్రమ ఏవ హ్యుదాహృతః.

గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యము నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫల మునివ్వక) వ్యర్థమే యగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమమాత్రమే యని చెప్పబడినది.


ఏతన్మాహాత్మ్యసంయుక్తం
గీతాభ్యాసం కరోతి యః,
స తత్ఫల మవాప్నోతి
దుర్లభాం గతిమాప్నుయాత్‌.

ఈ మాహాత్మ్యముతో బాటు గీతాపారాయణము చేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.


మాహాత్మ్య మేతద్గీతాయా
మయా ప్రోక్తం సనాతనం,
గీతాంతే చ పఠేద్యస్తు
యదుక్తం తత్ఫలం లభేతే

సూతుడు చెప్పెను. ఓ శౌనకాదిమహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును నేను మీకు తెలిపితిని. ఇద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెల్పిన ఫలమును బొందును.
ఇతి శ్రీవరాహపురాణే శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్‌.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List