కొలనుపాక శ్రీ భులింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం. ~ దైవదర్శనం

కొలనుపాక శ్రీ భులింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం.




* కొలనుపాక శ్రీ భులింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం..


దక్షిణ భారతదేశంలో సుదీర్ఘ సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం కలిగిన దేవాలయాలకు నెలవుగా నల్లగొండ జిల్లా  కొలనుపాక గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. జైన, శైవ, వైష్ణవ మతాలకు నిలయంగా చరిత్ర పుటలకెక్కిన కొలనుపాకలో వెలకట్టలేని చారిత్రక సంపద దాగి ఉంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీ శ్వేతాంబర జైన ఆలయంతో పాటు అతి ప్రాచీన స్వయంభూ లింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం, కాకతీయ ప్రతాపరుద్రుని అతి ప్రాచీన శివాలయం, ప్రాచీన శాసనాలు, శిలలు, విగ్రహాలతో ఏర్పాటైన మ్యూజియంలు కొలనుపాకలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంతో చారిత్రక ఉన్నతి గల కొలనుపాక దేవాలయాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం శోచనీయం. 


ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు. దక్షిణ కాశీగా పిలవబడే కొలనుపాకలో సోమేశ్వర స్వయంభూ ఆలయం  ఉంది. 

ఈ శివలింగాన్ని పూజిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. చాళుక్య, కాకతీయ రాజుల పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు శిలాశాసనం వెల్లడిస్తుంది. ఇక్కడి శివలింగంపై వెయ్యి లింగాలు చెక్కబడి ఉండటం ఓ ప్రత్యేకత. 

ఈ లింగాన్ని కోటి ఒక్క లింగంగా భక్తులు పూజిస్తుంటారు. అయితే దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు


ఈ స్వయంభూ  సోమేశ్వర లింగం పంచపీఠాలలో మొదటిది, రొండవది ఉజ్జయినిలో శ్రీ సిథ్దేశ్వర స్వామి, మూడవది కెధారినాథ్ లో శ్రీ భీమనాథ్ స్వామి, నాలుగవది శ్రీ శైలంలో మల్లికార్జున స్వామి, ఐదవది కాశీలో విశ్వేశ్వరాలయం. ఈ గర్భగుడిలో శ్రీ సోమేశ్వరుడు స్థావర లింగాకారంలో వెలసి ఉన్నాడు. ఈ లింగం నుంచే జగద్గురువు రేణుకాచార్యులు అవతరించి వీరశైవ ధర్మాన్ని నలు దిశలా వ్యాప్తిచేసినట్లు పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఇక్కడి ప్రధానాలయం చుట్టూ ఎన్నో ప్రాచీన శివలింగాలు, కాకతీయ ప్రతాపరుద్రుడు నిర్మించిన అతిప్రాచీన శివాలయం ఉంది.


ఈ ఆలయంలో మాఘమాసంలో.. కార్తీక మాసంలో.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ. ఏటా ఛైత్ర మాసంలో.. బహుళ తధియ మొదలకుని.. పంచమి వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 


🔆 కొలనుపాక జైన మందిరాలు..


జన మందిరాలు శాంతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. నిర్మాణంలో సునిశితత్వంతోపాటు ప్రశాంతమైన వాతావరణం వీటి ప్రత్యేకత. కొలనుపాకలో ఉన్న జైన మందిరం లేత గులాబీరంగు అద్దిన మైనపు బొమ్మలాగ ఉంటుంది. రెండు వేల ఏళ్ల నాటి నిర్మాణం ఇది. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ జైనం విలసిల్లింది. ప్రపంచ కాలమానం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి ప్రయాణించిన సంధికాలంలో ఇక్కడ జైనం వికసించింది. ఆ వికసిత జైనానకి ప్రతీకలుగా జైన మందిరాల్లో పై కప్పులకు రెక్కలు విచ్చిన పద్మం ఉంటుంది. కొలనుపాక జైన మందిరం శ్వేతాంబర జైనసాధకుల ఆలయం.


ఈ మందిరంలో గోడల మీద మహావీరుడు బోధించిన నీతిసూత్రాలు కూడా ఉంటాయి. వాటిలో సమాజంలో మనుషులంతా సమానమే అని ఉంటుంది. కానీ పర్యాటకులను ప్రధాన ఆలయంలోకి అనుమతించరు. అందులోకి ప్రవేశం శ్వేతాంబర జైనులకు మాత్రమే. ఈ ఆలయంలో ఉన్న ప్రధానమైన మహావీరుని విగ్రహం విలువ కోట్లలోనే ఉంటుందని ప్రచారం. జైన్లు తమ చివరి తీర్థంకరుడైన ఈ మహావీరుని విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తరువాత ఆలయంలో చెప్పుకోదగిన విగ్రహం శ్రీ ఆదేశ్వర విగ్రహం, దీనిని కనుటి రాతితో తయారుచేశారు. అలాగే దగదగ మెరిసే వెండి కిరీటంతో ఆలయంలో ఏర్పాటుచేసిన ఆదినాధ్ విగ్రహం కూడా చూపరులను ఆకర్షిస్తుంది. 


ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి ఆత్మజ్ఞానం, నిర్భయం, మనఃశ్శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికశక్తి చేకూరుతాయన్నది భక్తుల నమ్మకం. భరతదేశంలోని జైనాలయాల్లో కొలనుపాక ఏడవది. పదెకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. దేశ, విదేశాలలోని జైన మత గురువులు, జైనమతస్థులు కొలనుపాకను సంవత్సరం పొడవునా సందర్శించి తీర్థంకరుల విగ్రహాలను భక్తిప్రపత్తులతో పూజిస్తారు. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమినాడు రథోత్సవం నిర్వహిస్తారు. 


ఆలేరు నుంచి సిద్ధిపేట వైపు వెళ్ళే మార్గంలో 6 కి.మీ. దూరంలో కొలనుపాక ఉంది. 



 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List