* కోనేశ్వర ఆలయం..
అత్యంత అరుదైన దర్శనం శ్రీలంక లోని సముద్రగర్భంలో ఉన్న ఈ మహాదేవుని మనం ఈ జన్మలో దర్శించుకోగలమో లేమో కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఈ అపూర్వమైన దర్శనం. 700 సంవత్సరాల క్రితం శ్రీలంక లోని ట్రిన్కోమలీ సమీపంలోని కోనేశ్వర ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేసి, ఆలయ సంపదను దోచుకున్నారు.
ఆ సమయంలో వారు ఆలయం లోని విగ్రహాలను ధ్వంసం చేసి, ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో విగ్రహాలను సముద్ర గర్భంలో పడవేశారు. అయితే 1950 లో ఆలయ ప్రాంగణం ఉండే చోట తవ్వకాలు జరుగుతుండగా, దేవతా మూర్తుల ఆభరణాలు, శిధిలమైన ఆలయం ప్రాకారాలూ దర్శనమిచ్చాయి.
చరిత్ర కారులు ఈ స్థలంలో శివాలయం ఉండేది అని వ్రాసి ఉండడం వలన, ఇంకాస్త లోతుగా తవ్వి చూడగా, మరిన్ని ఆధారాలు లభించాయి. సముద్ర తీరాన కూడా కొన్ని ఆధారాలు కనిపించాయి.. సముద్రంలో కూడా పరిశీలించగా అక్కడ దేవతలా విగ్రహాలు కనిపించాయి. ఇప్పుడు మనం చూస్తున్నది శివుని విగ్రహం.
సుమారు 700 సంవత్సరాలుగా నీటిలో ఉన్నపటికీ శివుని నుదుటిన విభూతి రేఖలు, కుంకుమ బొట్టు ఇపిప్పటికే చెక్కు చెదరకుండా అలానే ఉండడం విశేషం. బహుశా సముద్రుడే శివుడిని తన గర్భంలో ప్రతిష్టించుకుని పుజిస్తున్నాడేమో అనిపిస్తోంది కదూ, సముద్రం లోకి వెళ్ళి దర్శించుకునే యోగం మనకు ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇలా అయినా దర్శించుకోవడం మన గత జన్మల పుణ్యఫలమే. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ..
హర హర మహాదేవ శంభో శంకర...
No comments:
Post a Comment