శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం. ~ దైవదర్శనం

శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం.


 * శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం..


నింగి నుంచి నేలపైకి వేగంగా దూసుకొస్తున్న గంగను కొప్పులో ఒడిసిపట్టి, మెల్లంగ నేలపైకి జారవిడుస్తాడు శివుడు. లోకాలను రక్షించడం కోసం పరమభయంకరమైన విషాన్ని పాయసంలా తాగుతాడు. అసురుడైన రావణుడి కోరికమేరకు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. లోకకల్యాణం కోసం త్రిపురాసురులను సంహరించినవాడే ఆ పరమాత్ముడు. 


మహాశివుడు కొలువైన ప్రతి క్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సందోహంతో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా వాడపల్లి కృష్ణానదీ తీరంలో ఆవిర్భవించి అగస్త్యేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అయితే, ఇక్కడ శివలింగం శిరోభాగం నుంచి అదేపనిగా నీరు వస్తూ ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి. వీటిలో మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్న శంభు లింగేశ్వర స్వామి ఆలయం ప్రశస్తమైనది.


పూర్వమున ఈ ప్రాంతమంతయు మేడి చెట్లమయముగా,  మేడి చెరువుగా పిలువబడి యుండును. మేడికి బహువచనము మేళ్లు కావున  కాలక్రమంగా మేళ్లచెరువుగా ప్రసిద్దమైంది. కాకతీయులు నిర్మించిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శివలింగం తెల్లగా  ఉంటుంది. ఆలయంలోని లింగం పెరుగుతూ వుంటుందని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు.


ఆలయ ప్రత్యేకత :

ఇచ్చట వెలసిన  శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరుడు అపో లింగము. (గంగ శిరమున కలిగిన లింగము) 

పంచ భూత గుణములతో వెలసిన లింగములను పంచభూతేశ్వర లింగములందురు. తమిళనాడు లోని జంబుకేశ్వరుని ఆపోలింగం గా కీర్తిస్తారు. పంచభూతములనగా భూమి,నీరు ,అగ్ని,నీరు ఆకాశము.

శంభులింగేశ్వర లింగము అపోలింగములు. అనగా స్వామి వారి శిరసుపై గంగధార కలదు. ఈ లింగము స్వయంభువు . అనగా తనకు తానుగ భూమినుండి వెలుపలకు వచ్చి ప్రకటితమైన లింగము.


స్థల పురాణం..


అక్కడ చెప్పుకునే కథను బట్టి స్వామి మొదట వరంగల్లు దగ్గర వెలిసారుట. ఒక కోయవాడు చూసి ఆవు కొవ్వుతో దీపం వెలిగించి ఆవుతోలుతో తోరణాలు కట్టి పూజ చేసేవాడు. ఆది నచ్చక స్వామి భూమిలోంచి ఈ మేళ్ళ చెరువు వరకూ ఆకారం పెంచి ఇక్కడ వెలిసారు అంటారు.  ఒక ఆవు నిత్యం ఈ లింగం మీద పాలు ధారగా వదిలేదిట. అది చూసిన పశువుల కాపరి లింగాన్ని తెగ్గొట్టి పారేస్తే మళ్ళీ మొలిచిందని, ఇలా 11 సార్లు జరిగాక, ఒకసారి లింగన్న అనేవాని కలలో స్వామి కనబడి తనజోలికి రాకుండా చూడమని చెప్పారుట. తను వచ్చి లింగం చుట్టూ బాగుచేసి, చిన్న గుడిలా కట్టి పూజ చేసేవాడు. ఈ గుడికట్టేముందు ఈ లింగాన్ని తీసి వేరే చోట ప్రతిష్ట చేదామని ప్రయత్నించారు. 75 అడుగుల లోతున తవ్వినా లింగం మొదలు కనపడక, చివరికి వున్నచోటే గుడిని కట్టించారట. 

ఈ లింగం వరంగల్ నుంచి ఇక్కడవరకూ భూమిలో ఉందని కొందరు అంటారు. ఆతర్వాత గత 72 సంవత్సరాలుగా 12 ఏళ్ళకొక అంగుళం చొప్పున లింగం పెరుగుతూ ఉందని, స్థల పురాణం. ఈ లింగానికి నెత్తిమీద ఒక రంధ్రం ఉంది. అందులోంచి నిరంతరం పాతాళ గంగ ఊరుతూంటుంది. విశేషం ఏమిటంటే రంధ్రందాటి నీరు పొంగదట. 

శ్రీ చిన జియ్యరు స్వామి పరిక్షించి అది సత్యం అని ధృవీకరించారని చెబుతారు. దిన్ని అర్ధ నారీశ్వర లింగంగా భక్తులు కొలుస్తారు. ఎందుకంటే లింగం రెండు భాగాలుగా ఉంటుంది, స్వామి వారికి వెనుక వైపు మూడుపాయలు గా జడ ఉంటుంది. గంగ ఉన్న వెనుక భాగం లోనే ఉంటుంది. అందుకే అభిషేకానంతరం చేసే విభూతిచర్చ, చందన చర్చలను వెనుక భాగానికి తగలకుండా జాగ్రత్త పడటం అభి షేక సమయం లో మనం  గమనించవచ్చు. 

 

ప్రతి రోజు అభిషేకానంతంరం  విశేషాలంకరణ ఛేస్తారు.  లింగం పై అడుగు అడుగు కి కుంకుమ బొట్టును అందం గా దిద్దుతారు. లింగం క్రింది భాగాన చిన్నబొట్టు తో ప్రారంభించి.   పైకి వెళ్లే కొద్ది సైజు పెరుగుతూ. చివరి బొట్టు పెద్దది గా  పెడతారు. అంటే స్వామి వారు పెరుగుతున్నారని చెప్పడానికి  అది సంకేంతం కావచ్చు. ఐదు కుంకుమ చుక్కలు  స్వామి వారిపై మనకు కన్పిస్తాయి. అలంకారం చాల నిష్ట తో, ఓర్పు తో చేస్తారు.  స్వామి వారి కి ఎడమవైపు ఉపాలయం లో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి కొలువు తీరి ఉంటుంది.


ప్రత్యేక ఉత్సవాలు :.. 

మహా శివరాత్రి ఈ ఆలయం లో గొప్ప ఉత్సవం.  ఆ  రోజు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువు గా జరుగుతుంది. చుట్టుప్రక్కల  జిల్లాలనుంచి కూడ వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి  రావడం ఒక ప్రత్యేకత.కార్తీకమాసంలో దీపోత్సవం కూడ చాల   వైభవంగా నిర్వహిస్తారు. కాణిపాకం వినాయకుడి ఆకారం జరిగినట్లు.. ఇక్కడ లింగం పెరుగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం పాణవట్టంతో కలిసి ఉంటుంది. శివలింగం భూమిని ఆనుకొని పాణవట్టంతో ఉంటుంది. శివలింగం ప్రతీ ఆరవై ఏళ్లకోసారి ఒక అంగుళం పెరుగుతుందని భక్తులు చెబుతుంటారు.

 

ఈ క్షేత్రము నల్గొండ జిల్లా కోదాడ నుండి 24 కి.మీ దూరం లోను. హుజూరునగర్ నుండి 10 కి. మీ దూరం లోను, ఖమ్మం నుండి  68 కిమీ దూరంలోను ,నల్గొండ నుండి 91 కి.మీ.దూరంలో ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List