పంచ బదరీ క్షేత్రాలు. ~ దైవదర్శనం

పంచ బదరీ క్షేత్రాలు.


 * పంచ బదరీ క్షేత్రాలు..


విశాల బద్రి (బదరీనాథ్),

యోగధ్యాన్ బద్రి,

భవిష్య బద్రి,

వృద్ధ బద్రి మరియు

ఆది బద్రి (యోగి బద్రి)


శ్రీమహావిష్ణు స్థానములైన 'పంచబదరీ క్షేత్రముల' గురించి తెలుసుకుందాం...

'విష్ణు భగవానుడు' అయిదు విభిన్న పవిత్ర క్షేత్రములలో 'విశాల బద్రి (బదరీనాథ్), యోగధ్యాన్ బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి మరియు ఆది బద్రి' పేరులతో 'పంచబద్రి క్షేత్రములుగా' భారతదేశము నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షించుచూ.. హిమాలయములలో  'బదరీనాథ్' మరియు జోషీమత్' పరిసర ప్రాంతములలో వెలుగొందుచున్నాడు. ఈ అయిదు క్షేత్రములు 'బదరీనాధ్ పుణ్య క్షేత్రముతో' ప్రారంభమై బదరీనాధ్ నకు ఉత్తరముగా 24 కి.మీ. దూరములో కల 'సతోపంత్ హిమానీనదము' దక్షిణమునందు కల 'నందప్రయాగ' 'బదరీ నారాయణుడు' ఈ అయిదు పుణ్య క్షేత్రములలో అయిదు విభిన్న రూపములతో కొలువబడుచున్నాడు. వేసవి వర్షాకాలములు అనగా జూన్ నెల నుండి అక్టోబరు నెల మాసములు ఈ ఆలయములు సందర్శించుటకు వీలుగా ఉండును.


🌷(1) విశాల్ బద్రి (బద్రీనాథ్)...


బద్రీనాథ్ హిమాలయ పర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు 'చామోలి' జిల్లానందు 'చార్ ధామ్' పేరుతో ప్రసిద్ధమైన 'కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మరియు బధ్రీనాథ్' లలో ఒకటిగా నున్న నగర పంచాయితీ. 'బద్రి' నీలకంఠ తదితర పర్వతా రోహణమూలకు ముఖద్వారము వంటిది. 'బద్రి' అనునది ఈ ప్రాంతమునందు పెరుగు ఒక చిన్న, తినుటకు ఉపయోగపడు రుచికరమైన పండు మరియు 'నాథ్' అనగా భగవంతుడు. పూర్వపు రోజులలో బదరీనాథ్ నడచి వెళ్లవలసి వచ్చేది.


అద్వైత తత్వ ప్రతిపాదకులగు వేదాంతాచార్యులు 'జగద్గురు ఆదిశంకరా భగవత్పాదాచార్యులవారు', 7వ శతాబ్దమునందు బదరీనాథ్ ఆలయమును పునః నిర్మించినారు. అటుపిమ్మట అనేకమార్లు విదేశీ దండయాత్రలవలననూ ఈప్రాంతములో తరచూ సంభవించు భూకంపముల వలన ఈ ఆలయము దెబ్బతినుట పిమ్మట అనేకమార్లు తిరిగి నిర్మించుట జరిగియున్నది.


వైశిష్టాద్వైత తత్వవేత్త భగవద్రామానుజాచార్యుల వారు సైతం ఈ క్షేత్రసందర్శనం గావించిరి. శ్రీవైష్ణవ దివ్యధామములలో 'బద్రినారాయణ' ముఖ్యమైనది. బదరీనాధ్ పుణ్యక్షేత్రము సముద్రమట్టమునకు సుమారు 12 వేల అడుగుల ఎత్తున ఉన్నది. ఇచటగల తప్తకుండం మరియు సూర్యకుండం అను రెండు ఉష్ణకుండములవలన ఇచ్చట సమఉష్ణోగ్రత సంవత్సర మంతయు ఉండును.


'స్థలపురాణం' ప్రకారం విష్ణుభగవానుడు నరనారాయణఅవతారము నందు బదరీనాథ్ నందు బహిరంగ ప్రదేశమునందు తపస్సు చేసినాడు. లక్ష్మీ దేవి ఆయనకు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకొనుటకుగాను బదరివృక్షము రూపములో  ఆశ్రయము కల్పించినది. నారద మహర్షి “ఓం నమో నారాయణాయ” అనబడు 'అష్టాక్షరీ మంత్రము'  జపించి తపస్సు చేసినాడు. 'మహా విష్ణువు' జీవరాశులన్నిటి క్షేమమును కోరి ఇక్కడ తపస్సు చేయ నారంభించినాడని ప్రతీతి.


🌷(2) యోగధ్యాన్ బద్రి..


'యోగధ్యాన్ బద్రి, కర్ణ ప్రయాగకు 22 కి.మీ. దూరంలోనూ హనుమాన్ చత్తి మరియు గోవింధ్ ఘాట్ నకు దగ్గరలో 'పండుకేశ్వర్' గ్రామమునందు కలదు.


విష్ణు భగవానుడు ధ్యానము నిమిత్తము ఇచట నుండి దీనికి 'యోగధ్యాన్ పండుకేశ్వర్' అని పేరు పెట్టినాడు. ఈ ఆలయము 'గుప్తుల కాలము' నాటిది మరియు సముద్ర మట్టమునకు 6000 అడుగుల ఎత్తున ఉన్నది.


స్థల పురాణము ప్రకారము వేదవ్యాస మహర్షి 'శ్రీమధ్ భాగవతమును' ఇచ్చటనే రచించినాడు. 'జగద్గురు ఆది శంకరాచార్య' ఈ ఆలయములను ప్రపంచవ్యాప్తముగా హిందూమత అభివృద్ధికి అనువైనవిగా ఆమోదించి యున్నారు.


శీతాకాలములో ఆలయము మూసివేయు సందర్భమునందు 'బదరీనాధ్ ఉత్సవమూర్తిని' ఈ ఆలయము నందు ఉంచేదరు. ఈ ప్రదేశమునందు ప్రార్ధనలు చేయనిదే యాత్ర సంపూర్ణము అవదని ప్రజలు నమ్ముతారు.


స్థల పురాణము ప్రకారము పాండురాజు తాను రెండు సంగమములో నున్న లేళ్ళను చంపినందువలన కలిగిన పాపమునుండి విముక్తి పొందుటకు విష్ణుమూర్తిని ప్రార్ధించుటకు తపస్సు చేసినాడు.


'పాండవులు' జన్మించిన పిమ్మట 'పాండురాజు మరణానంతరము' విష్ణుమూర్తి ఇత్తడి విగ్రహము ఇచట ప్రతిష్టించినారు. మరియు కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులను ఓడించిన పిమ్మట ప్రత్యాత్తాపాన్ని ప్రకటించుటకు ఈచటికి వచ్చినారు.


🌷(3) భవిష్య బద్రి..


జషీమఠ్ నకు 17 కి.మీ. దూరములో తపోవన్ నకు దగ్గరగాకల 'సుభైన్' గ్రామమున దట్టమైన ఆటవీప్రాంతములో ఈభవిష్యబద్రి ఉన్నది.


భవిష్యత్తులో చెడు ప్రబలి నరనారాయణ పర్వతములు మూసుకు పోయి 'బదరీనాధ్ మార్గము' నిరోధించబడినప్పుడు ఈ 'భవిష్యబద్రి' బద్రినాధ్ గా పరిగణింప బడునని తెలుపబడినది.


భవిష్య బద్రి అందమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యములు వీక్షించకలిగిన లోయ మరియు ఆటవీప్రాంతముతో ముఖ్యమైన పర్యాటకప్రదేశము.


సాల్హధార్ వరకు రోడ్డు ప్రయాణము చేసి ఆచటినుండి 6 కి.మీ. పర్వతారోహణముతో 'నరసింహుని విగ్రహము' కుడిగా యున్న బదరీ నారాయణుడు కల ఈ ఆలయము చేరవచ్చును.


🌷(4) వృద్ధబద్రి..


'వృద్ధబద్రి (లేదా) బృధబద్రి' జోషీమఠ్ నకు 7 కి.మీ దూరములో సముద్ర మట్టమునకు 13500 అడుగుల ఎత్తులో అనీమత్ వద్దనున్న  పురాతన దేవాలయము.


స్థలపురాణము ప్రకారము విష్ణు భగవానుడు రూపము వృద్ధ మానవుని రూపములో వెలసినాడు.  అందువలన వృద్ధమానవరూపములో నున్న భగవానుని భక్తులు సంవత్సరామంతయూ కొలిచేదరు.


'బద్రీనాథ్' చార్ ధామ్ నందు ఒక పుణ్య క్షేత్రముగా పరిగణింపబదేవరకు విశ్వకర్మచే సృస్థించబడిన ఈ విగ్రహము అర్చించ బడినది. సంవత్సర కాలమంతయు తెరువబడి యుండేడి ఈ ఆలయము తీర్ధ యాత్ర చేయుటకు వీలుగా యుండును.  


🌷(5) ఆదిబద్రి..


కార్ణప్రయాగకు 17కి.మీ దూరములో పంచబద్రి ఆలయములలో మొదటిదయిన ఈ ఆదిబద్రి ఆలయము ఉన్నది.


శీతాకాలమునందు బద్రినాధ్ ఆలయము మూసివేసినప్పుడు విష్ణుభక్తులు ఇచ్చటనే ప్రార్ధన చేసేదరు. 'ఆదిశంకరాచార్య' ఏడు ఆలయములతో కూడిన ఆలయ సముదాయము ఇచట ప్రారంభించినాడని గుప్తరాజుల కాలములో ఈ ఆలయములు నిర్మించబడినట్లు నమ్మకము.


ఈ ఆలయ సముదాయములో పిరమిడ్ ఆకారములోని వేదికపై  విష్ణు భగవానునికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయము నిర్మించిన బడినది.


నల్లరాతితో చెక్క బడిన విష్ణు భగవానుని విగ్రహము చేతులలో కమలము, చక్రము మరియు గద ధరించియుంటుంది.


భవిష్యత్తులో బదరీనాధ్ నకు సమాజములో కల ఉన్నత స్థాయి భవిష్య బద్రినకు కలిగినప్పుడు ఈ ఆలయమును 'యోగిబద్రి' అని పిలిచెదరు...

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List