అమితంగా అనుగ్రహించే శ్రీ రంగనాయకి తాయారు సన్నిధి.. ~ దైవదర్శనం

అమితంగా అనుగ్రహించే శ్రీ రంగనాయకి తాయారు సన్నిధి..



 * అమితంగా అనుగ్రహించే శ్రీ రంగనాయకి తాయారు సన్నిధిని..


శ్రీరంగంలోని ఉత్తర వీధిలో ఉత్తర భాగాన నివసిస్తున్న ఒకాయన కూరగాయలు కొనడానికి దక్షిణ భాగం ఉత్తర వీధికి వెళ్ళవలసి వచ్చింది. కాని వీధులన్నీ చుట్టుకుని దక్షిణ భాగం ఉత్తర వీధికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడిన పని కనుక రంగనాథుని గుడిలోని ఉత్తర ద్వారం గుండా లోపలికి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి దక్షిణ భాగం ఉత్తర వీధిలో సరుకులు తీసుకుందామని తలిచారంట. అలాగే అనుకున్న విధంగా ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చి కావలసిన సరుకులు తీసుకుని మళ్లీ దక్షిణ ద్వారం గుండా కోవెల లోపలికి వచ్చారు.


ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్ళే ముందు ఎడమ వైపు ఉన్న శ్రీ రంగనాయకి తాయారు సన్నిధిని చూసారు. ఆయన అయ్యవారిని కాని అమ్మవారిని కాని సేవించుకోవడానికి రాలేదు. వీధులన్నీ చుట్టుకుని వెళ్తే శ్రమతో కూడిన పని అనే ఒకే కారణంతో గుడిలోకి ప్రవేశించారు. అయినా అమ్మవారికి మర్యాద పూర్వకంగా రెండు చేతులను దగ్గరకు చేర్చి ఒకే ఒక్క సారి రంగనాయకి తాయారుకు నమస్కరించారు. లోపల ఉండే తాయారు చాలా పొంగిపోయింది. వెంటనే తన భర్త రంగనాథుని "ఈ బిడ్డ నన్ను చేతులు ఎత్తి నమస్కరించాడు. ఇతనికి ఏమి ఇద్దాం?" అని అడిగింది. అందుకు రంగనాథుడు " అన్ని సంపదలు నీ వశమే కదా!సకల సంపదలు అనుగ్రహించు" అన్నారు. వెంటనే సకల సంపదలు అనుగ్రహించిందంట ఆ తల్లి. మళ్ళీ ఆలోచనలో పడింది." స్వామి! అతను అంజలి ముద్రతో నన్ను నమస్కరించాడు. దానికి నేను ఇచ్చిన సకల సంపదలు సరితూగదు.


అంతకంటే పెద్దది ఏదైనా ఇవ్వాలని ఉంది." అనగా దానికి స్వామి"అవును! ఈ సంపద సరిపోదు. తరగని సంపదైన ఆత్మ అనుభవం అతనికి ఇచ్చేద్దాం!" అన్నారు. అలాగే అమ్మ అతనికి ఆత్మానుభవం అనే కైవల్య స్థితిని ప్రసాదించింది. కొద్ది సేపటికి తృప్తి చెందక ఆ తల్లి "అతను అంజలి ముద్ర కదా చూపించాడు.


మనం ఒసగిన సంపద ఆత్మానుభవం దానికి సమం కాదు కదా! మీరు ఆ బిడ్డకు ముక్తి ని ప్రసాదించండి" అని ప్రార్థించింది. తన ప్రియ నాయకి కోరిక పై ఆ వ్యక్తి కి వైకుంఠ లోక నివాసం కల్పించారు స్వామి. "ఇప్పుడు తృప్తియేనా" అని అడిగారు స్వామి. "లేదు స్వామి! మన బిడ్డ చూపిన అంజలి ముద్రకు ఏమి ఇచ్చినా సరిపోదు. కాని ఇవ్వడానికి ముక్తి కంటే గొప్పది ఏది మన దగ్గర ఏమి లేదు కదా స్వామి. అందువల్ల సిగ్గుతో తలదించుకుంటున్నాను" అని ఆ తల్లి చాలా బాధ పడిందంట.


పరాశర భట్టర్ అనుగ్రహించిన శ్రీ గుణరత్నకోశం అనే గ్రంథం లోని క్రింది శ్లోకం ఈ కథను వివరిస్తుంది. 


ఐశ్వర్యమ్ అక్షరగతిమ్ పరమమ్ పదమ్ |

వాగస్మైచిత్ అంజలిపరమ్ వహతే విధీర్య ||

అస్మై న కించిత్ ఉచితం కృతం ఇత్యదామ్పత్వం |

లజ్జసే కతయ కోయం ఉదారభావః ||


ఏదో వెళ్తున్న దారిలో అమ్మవారిని చూచి అంజలి ముద్రతో నమస్కరించిన దానికే సకల సంపదలు, ఆత్మానుభవం మరియు వైకుంఠ ప్రాప్తి ఇచ్చి కూడా.. ఇంకా ఇవ్వడానికి ఏమి లేదే అని లజ్జతో తలదించుకునే ఉంది ఆ తల్లి అని ఈ శ్లోకంలో సాధిస్తున్నారు పరాశర భట్టర్. "అలం" అంటే చాలు అని అర్ధం. "అనలః" అంటే చాలు అని తృప్తి చెందనివారు. "అలం" అనుకోకుండా తన్ను ఆశ్రయించినవారికి ఇంకా ఇంకా అనుగ్రహిస్తూ ఉండాలని అనుకోవడం వల్ల శ్రీవారు "అనలః" అని పిలువబడుతున్నారు..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List