అత్యంత సంపన్నమైన మహాలక్ష్మీ దేవి ఆలయం. ~ దైవదర్శనం

అత్యంత సంపన్నమైన మహాలక్ష్మీ దేవి ఆలయం.

* భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహిమాన్వితమైన ఆలయం ..
* ఆలయంలో బంగారు, వెండి, డబ్బుల కట్టలతో తోరణాలు...
.
.
భక్తులారా..!! గుడిలో ప్రసాదంగా మీకు ఏమి ఇస్తారు..?? మహఅంటే లడ్డు, కేసరి, శనగలు, పులిహోర, దద్దోజనం … లడ్డు (తిరుపతి) అవునులెండి ఇండియాలో ఎక్కడ పోయినా ఇలాంటివి నైవేద్యంగా ఇవేయిస్తుంటారు కదా..!! కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర ప్రసాదాలను సైతం ఇవ్వటం ఇప్పటివరకు చూశాము. భారతదేశంలోని హిందూ దేవాలయాలలో విచిత్ర ప్రసాదాలు ఇచ్చే ఒక ఆలయం ఉంది అక్కడ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులకు నైవేద్యంగా బంగారం, వెండి ఇస్తుంటారు..
.
నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే. అదే మహాలక్ష్మీ దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ అనే ప్రాంతంలో కలదు. రత్లామ్ ప్రాంతం బంగారానికి, రత్లమి సేవ్ కు, రత్లమి చీరలకు ప్రసిద్ధి చెందినది. మండు వేసవి విహార యాత్రకు చక్కటి ప్రదేశం ! రత్లామ్ లోని మహాలక్ష్మి గుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతకు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబుచేస్తారు. ప్రతిఏడాది ఈ గుడికి విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో బంగారం, వెండి కీలకం.
.
ప్రత్యేకంగా ప్రతిఏడాది దీపావళి రోజున మహాలక్ష్మీ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని మూడు రోజులపాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగేటప్పుడు అమ్మవారిని నోట్ల దండలతో, బంగారు, వెండి వస్తువులతో అలంకరిస్తారు. వీటి విలువ 100 కోట్ల పైమాటే. బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో … !! బాంధవ్ ఘర్ – పాండవులు వేటాడిన ప్రాంతం ! అంత భారీగా విరాళాలుగా వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకు ప్రసాదంలా తిరిగి ఇస్తుంటారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుండి రత్లామ్ చేరుకోవడం సులభం.
.
ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం (బంగారం, వెండి) వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదు. అయినా భక్తులు దేవుని ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఆలస్యం చేయకుండా మీరూ వెంటనే ప్రసాదం తెచ్చేసుకోండి ..! రత్లామ్ గురించి రత్లామ్ సముద్రమట్టానికి 480 మీటర్ల ఎత్తున (1575 అడుగులు) మాళ్వా ప్రాంతంలో కలదు. మధ్యప్రదేశ్లోని రత్లమ్ జిల్లాకు హెడ్క్వాటర్స్ ఇది. రత్లమ్ అందమైన ఆలయాలకు నెలవు.
.
రత్లామ్ ఎలా చేరుకోవాలి:..
రత్లామ్ చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చేరువలో ఉన్నాయి. వాయు మార్గం : సమీపాన 104 కి. మీ ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కి. మీ ల దూరంలో ఉదైపూర్ ఏర్ పోర్ట్ లు కలవు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి రత్లామ్ చేరుకోవచ్చు. రైలు మార్గం : రత్లామ్ లో రేల్‌వే జంక్షన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదైపూర్, కోల్‌కతా ప్రాంతాల నుండి రెగ్యులర్ గా రైళ్ళు స్టేషన్ మీదుగా వెళుతుంటాయి. బస్సు మార్గం/ రోడ్డు మార్గం : రత్లామ్ కు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సదుపాయం కలదు. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్ రాష్ట్ర బస్సులు, ట్యాక్సీ లు, క్యాబ్ లలో ప్రయాణించి చేరుకోవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List