సతీసహగమనం చేసేందకు పూనుకున్న ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర. ~ దైవదర్శనం

సతీసహగమనం చేసేందకు పూనుకున్న ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర.


వీరమ్మ తల్లి కి 520 చరిత్ర వుంది .ఆ కాలమ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెద కడియం అనే గ్రామం లో యాదవ కులానికి చెందిన ”బొడ్డు ”వారి ఆడ పడుచు గా ఆమె జన్మించింది .తండ్రి పరశురామయ్య ,తల్లి పార్వతమ్మ .పరమేశ్వర వర ప్రసాదం గా జన్మించి నందున ”వీర శివమ్మ ”అని పేరు పెట్టారు .చిన్న తనం నుంచి భక్తీ శ్రద్ధ లతో ,దైవ చింతన తో పెరిగింది .ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య ,చెల్లమ్మ ల పెద్ద కుమారుడు చింతయ్య తో ,ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ట శుద్ధ దశమి నాడు ,పెదకడియం లో ఆమెకు వివాహం చేశారు .కొంత కాలమ్ పుట్టింట్లో నే వుంది ,యుక్త వయసు రాగానే ఉయ్యూరు లోని మెట్టి నింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించ టానికి పుట్టి నింటి వారు పంపారు .అత్త వారింట్లో అందరి అభిమానాన్ని ,ఆదరాన్ని పొందింది వీరమ్మ .తన సేవా తత్పరత తో అత్త గారైన మేనత్తను ,మామయ్యను మెప్పించింది .మరది భోగయ్య ను బిడ్డ లాగ చూసింది .చుట్టు పక్కల వారికే కాక బంధు గణానికీ అంతటికీ ఆమె ”ఉత్తమా ఇల్లాలు ”అయింది .భర్త సేవలో జీవితం ధన్యం చేసుకోంది .కాలమ్ ప్రశాంతం గా గడిచి పోతోంది .ఇంతలో కుటుంబం లో ఒక అలజడి రేగింది .మరది భోగయ్యకు అచ్చమ్మ తో వివాహ మైంది .ఆమె గర్విష్టి ,విద్యా హీన .ఆమెకు వీరమ్మ మీద అసూయా పెరిగింది .ఊరందరూ తోడి కోడలు వీరమ్మను మెచ్చు కోవటం ఆమె కు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది .అయితె సాధ్వి వీరమ్మ ,అత్త మామలకు ,మరిదికి నచ్చ చెప్పి ,తోడి కోడల్ని ,మళ్ళీ అత్త వారిల్లు చేరేట్లు చేసింది .ఆమె మనసు లోని అసూయా తొలగి పోయి ,తోడికోడళ్ళు అన్యోన్యం గా వుంటూ ,వూరి వారికి ఆదర్శ మైనారు .
ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ .అతని కళ్ళు సాధ్వీ మణి వీరమ్మ పై పడ్డాయి .లోబరుచు కోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు .దగ్గర లో వున్న” గురజాడ ”గ్రామం లోని తన బావ మరిది ”సీతయ్య ”ను తనకు సాయం చేయమని బ్రతిమి లాడాడు .అతడు రావణాసురుడికి మారీచుడు చేసి నట్లు హిత బోధ చేశాడు .చెవి కెక్క లేదు .ఎంతైనా బావ గారు కదా తన సోదరి కాపురం ఏమవుతుందో ననే భయం సీతయ్య కు పట్టు కొంది .మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్త బడి చివరికి సాయం చేయ టానికి ఒప్పు కున్నాడు .మేకల ,గొర్రెల మేత కోసం చింతయ్య ,భోగయ్య సోదరులు వాటిని తోలు కోని ఉత్త రాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్ళారు .ఇదే అదునైన సమయం అని బావమరిది సీతయ్య ను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య .సీతయ్య ప్లాన్ వేశాడు .తన నౌకరుకు విషం పూసిన సొర ముల్లు ఇచ్చి ,చింతయ్య పై రహశ్యం గా ప్రయోగించమని చెప్పి పంపాడు .ముస్తాబాద్ లో గొర్రెల మందల దగ్గర నిద్ర పోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం వున్న ఆ సొర ముల్లు తో పొడిచి హత్య చేశాడు . .చింతయ్య బాధ భరించ లేక చని పోయాడు .తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు . ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది .తాను గాడం గా ప్రేమించిన భర్త తో సహ గమనం చేయాలని నిస్చ యించుకొంది .తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసు కోని ,అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బల వంత పెట్టారు .ఆమె కు కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది.
సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు ,గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు .వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయట పడుతూ ,ఆమె అంటే అందరి లో భక్తీ ఏర్పడింది . చింతయ్య కు చితి ఏర్పాటు చేయించారు .వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది .గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే ,మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది .ముత్తైదువులు పసుపు దంచుతుంటే ,రోలు పగిలింది .వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోతూ వేసింది .ముత్తైదువులకు పసుపు ,కుంకుమ లు పంచి పెట్టింది .ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది .చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు .వేలాది ప్రజలు భోరున విల పిస్తుండగా ,అత్తా మామలు ,బంధు గణం శోక సముద్రం లో మునిగి ఉండ గా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలి తో ,”పారెళ్ళు ”పెట్టించుకొని ,పెళ్లి కూతురు లా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించు కోని ,సాధ్వీమ తల్లి ,పతివ్రతా శిరోమణి ,వీరమ్మ తల్లి ,భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి ,భగ భగ మండే ఆ మంటలో తానూ ,భర్త చితి పై చేరి అగ్ని గుండం లో సహ గమనం చేసింది .ఆదర్శ మహిళ గా ,మహిమ గల తల్లి గా ఆ నాటి నుంచి ,ఈ నాటి వరకు ప్రజల నీరాజనాలు అందు కొంటోంది.
రాజ ప్రతినిధి ”జిన్నా సాహెబ్’ వీరమ్మ నమస్కారం చేసి ,ఇంటికి వెళ్లి నిద్ర పోయాడు .ఆ రాత్రి నిద్ర లో వీరమ్మ భర్త చింతయ్య తో సహా మహా తేజో వంతం గా ,సర్వాలంకార శోభ తో ,కన్పించింది .స్త్రీలు పూజలు చేస్తున్నట్లు ,వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు ,గండ దీపాల కాంతి లో అమ్మ తల్లి ,ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగు తున్నట్లు గుడి పక్కనే పెద్ద తటాకం వున్నట్లు ,అందులో వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కల లో కన్పించిందట .ఉదయం లేచి జమీందారు ను పిలి పించారు .జమీందార్ కు కూడా అలాంటి స్వప్నమే వచ్చి నట్లు చెప్పారట చింతయ్య మరణానికి కారకు లెవరో తెలుసు కోవ టానికి వేగుల్ని పంపారు .సుబ్బయ్యే కారణం అని అమ్మ వారి సహ గమనం రోజే తీవ్ర మైన బాధ తో అతడు మరణిం చాడని తెలుసు కున్నారు .సుబ్బయ్య వంశం సర్వ నాశనమై చివరికి వారసులెవరు లేకుండా నిర్వంశం అయింది .
అందరూ ఆలోచించి ,వీరమ్మ అత్త మామ ల తో సంప్రదించి ,గ్రామస్తులతో సమా వేశం జరిపి ,సహగమనం జరిగిన చోటు లో ఆలయాన్ని నిర్మించారు .చెరువు తవ్వించారు .వీరమ్మ ,చింతయ్య లవిగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు .జిన్నా గారు ,జమీందారు గార్ల సమక్షం లో భక్త జన సందోహం మధ్య వైభవం గా ప్రతిష్ట జరిగింది .ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నా గారే పెట్టు కొన్నారు .చెరువును తవ్వించిన ఖర్చు ,ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజులు పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు.
ఆ నాటి నుంచి ముందుగా మెట్టి నింటి వారు తర్వాత జిన్నా గారు రాజు గారు తర్వాత గ్రామస్తులు అమ్మ వారి ఉత్స వాలను ప్రారంభించి కొన సాగించారు .పారు పూడి వంశం వారినీ ,జమీందారు గారినీ ,ప్రభుత్వాధి కారులని ధర్మ కర్తలు గా జిన్నా గారు నియమించారు .అంటే వీరమ్మ తల్లి తిరుణాలను ప్రభుత్వ పరం గా నిర్వ హించే ఏర్పాటు చేశారన్న మాట .అందుకే నేటికీ పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరే సారే లతో సంబరాలు ప్రారంభ మవటం ఆన వాయితీ గా వస్తోంది .
అమ్మ వారు ఉయ్యాల ఊగే ప్రదేశం లో ఏ కట్టడమూ వుండదు .తన భర్తనూ హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్య ను కాలితో తన్ని,చిరు నవ్వు చిన్దిస్తున్నట్లు ఉయ్యాల ఊగటం లో అంత రార్ధం .ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్స వాలు ప్రారంబించటం జరుగు తోంది . చరిత్ర కాల గర్భం లో కలిసినా ,వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం .నమ్మిన వారికి నమ్మి నంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ .తిరునాళ్ళు పదిహేను రోజుల్లో ను ,ఉయ్యూరు లో ఏ ఇంట్లోను పసుపు దంచరు ,కుంకుమ తయారు చేయరు .ముందే సిద్ధం చేసు కొంటారు .కారం కూడా కొట్టరు .ఇవి స్వచ్చందం గా అందరు పాటించే నియమాలే .తిరునాళ్ళ లో అమ్మ వారికి సాధారణం గా అందరు చీరే పసుపు కుంకుమ పెట్టటం అలా వాటు .అంతే కాక ఆ తర్వాత ఎవరింట్లో నైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చి నప్పుడు కూడా చీరా సారే పెడుతుంటారు మెట్టి నింట్లో వున్న అమ్మ వారికి ”.అమ్మ వారి చీరలు” అని ప్రత్యేకం గా అందరికి అందు బాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణం లో ను లభిస్తాయి .ఆమె పవిత్రత ను ఇలా తర తరాలుగా పాటిస్తూ ,నేటికీ నిల బెట్టు కొంటు న్నారు ఉయ్యూరు ,పరిసర గ్రామాల వారు .అమ్మ వారి ఊరేగింపులో జనరేటర్ తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టు కొంటుంది .యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు .పెళ్లి అయిన వాళ్ళు కూడా ,ఆ పవిత్ర దినాలలో బ్రహ్మ చర్యం పాటించి ,వంశ ప్రతిష్ట ను నిల బెట్టు కొంటారు .బంధువులను పిల్చుకొని విందు భోజ నాలు ఏర్పాటు చేసు కొంటారు .అంతా పెళ్లి శోభ లాగా వుంటుంది .ఇప్పటికీ పారు పొడి వంశాస్తులే ఆలయ పూజార్లు .ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి .అవన్నీ పూజారులే అనుభవిస్తారు . . .ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర .ఇప్పుడు అమ్మ వారి చరిత్ర పై మంచి పాటల కేసెట్లు సి.డి లు వచ్చి అందరికి అందు బాటు లో వున్నాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List