33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కనబడే పాతాళ భూమి శివాలయం గుహ. ~ దైవదర్శనం

33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కనబడే పాతాళ భూమి శివాలయం గుహ.




కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ముందు 3కిలోమీటర్ల దూరంలో ఎడ‌మ ప‌క్క కొండ‌ల్లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి దెవ‌స్థానంకు మరియు పాతాల్ భువనేశ్వర్ గుహకు దగ్గరి పోలికలు కలవా...? https://www.facebook.com/rb.venkatareddy/posts/10204416195797780 ని చూడండి.....
ఉత్తరాంచల్ పిత్తోడఘడ్ జిల్లా లో ఉంది. ఉత్తరాంచల్ పర్వత ప్రాంతాన్ని "ఘరేవాల్" మరియు" కుమావు"గ విభజించారు . "ఘరేవాల్" మండలంలో కేదార్నాథ్, బదరీ నాథ్ ,గంగోత్రి, యమునోత్రి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి "కుమావు "మండలంలో నైనిటాల్, అల్మోడ, పిత్తోరాఘడ్ మొదలైనవి ఉన్నాయి .ఢిల్లీ నుంచి "అల్మోడ "కి 370కిమి,అక్కడ నుంచి "పాతాల్ భువనేశ్వర్ "కి దగ్గర దగ్గర 110కిమి.
పాతాళ భువనేశ్వర్ చాల చిన్న గ్రామం . ఈ గుహా మందిరం ఊరి నుంచి 2,3 కిమీ సన్నని కాలి బాటన ప్రయాణించాలి గుహ చేరడానికి నడక తప్ప మరో మార్గం లేదు. గుహ ముందర చిన్న శివాలయం ఉంటుంది . గుహ ద్వారం చాలా చిన్నది. ఒక మనిషి కూర్చొని ప్రక్కల వేలాడుతున్న గొలుసులు పట్టుకొని జాగ్రత్తగా జారుతూ లోనికి వెళ్ళాలి. అలా ఓ వంద అడుగులు లోపలికి వెళ్ళిన తరవాత 90 అడుగుల లోతు 180 మీటర్ల పొడువు ఉన్న గుహల సముదాయం. ఈ గుహలు సున్నపు రాతి గుహలు. ఇవి ప్రకృతి సిద్దంగా నిర్మించబడ్డాయి. సంవత్సరాలు ఒకేచోట నిరంతరం నీళ్ళు ప్రవహించడం వల్ల ఏర్పడ్డ రూపాలు మనకి మన ఆరాధ్య దేవతా మూర్తులుగా కనబడతాయి. అందులో శివుని జటాఝూటం , వేయి పడగల శేషుడు, ఐరావతం, కల్పవృక్షం , కామధేనువు ,బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తో పాటు 33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కననడతాయి. ఇవి కొన్ని గుహల సముదాయం .
అది కూడా ప్రకృతిసిద్దం గా ఏర్పడింది అని చెప్తారు ఆ పక్కనే కొంత దూరంలో ఒక చిన్నపిల్లవాని మొండెము ఆకారం కనబడుతుంది దీనిపైన నిరంతరమూ నీటి బిందివులు పై కప్పు నుండి పడుతూ ఉంటాయి . వినాయకుని తల నరికిన పరమశివుడు ఏనుగు తల తెచ్చి అతికించి నంతవరకు ఇక్కడ వినాయకుని మొండెము ఉంచారని దానికి గుర్తుగా ఇక్కడ శిలా రూపాన్ని వదిలి పెట్టారని చెప్తారు.
ఈ గుహలో నాలుగు ద్వారాలు కనిపిస్తాయి ఇవి 1)పాప ద్వారము 2) రణ ద్వారము 3) మోక్ష ద్వారము 4)ధర్మ ద్వారము పాప ద్వారము రావణుని మరణానంతరము మూసుకు పోయిందట. రణ ద్వారము మహాభారత యుద్దానంతరము మూసుకు పోయిందిట. మిగిలిన రెండు ద్వారాలు తెరిచి ఉన్నాయి.ఇక్కడ నుండి కైలాస్ పర్వతానికి గుప్తమార్గం ఉన్నదని అంటారు.
స్కంద పురాణంలో మానస ఖండం లో 800 శ్లోకాలు ఈ గుహల గురించి వర్ణించడం జరిగింది. ఈ గుహలని మొట్ట మొదటగా కనుగొన్నది త్రేతాయుగం లో సూర్య వంశానికి చెందిన ఋతుపర్ణ మహారాజు.అది ఎలా అంటే నల మహారాజు తన భార్య అయిన దమయంతి చే ఒకానొక పందెములో ఓటమి పొందుతాడు. శిక్ష నుండి తప్పించు కొనడానికై రుతుపర్ణుని సహాయం కోరుతాడు నలుడు. అప్పుడు ఋతుపర్ణుడు నలుని ఈ అరణ్యమున విడిచిపెట్టి తిరిగి తన రాజ్యమునకు -పోవు మార్గములో కొంత సమయము విశ్రాంతి కొరకై చెట్టు నీడన విశ్రమిస్తాడు. అప్పుడు ఒక అందమయిన జింక "నన్ను వేటాడకు రాజా "అంటూ పరుగెత్తుకొని పోవడం కనిపిస్తుంది. "నేను జింకను వెంటాడనేలేదు .మరి జింక అలా అన్నది అంటే వెంబడించమనా?"అని
తలపోసి ఆ జింకని వెంబడించెనట .కొంత దూరం పరుగెత్తిన జింక ఒక ప్రదేశంలో అంతర్దానమైనదట. ఆ ప్రదేశమును ఋతుపర్ణుడు పరిశీలించగా అక్కడ రామగంగా ,గుప్తగంగా మరియు సరయు నదుల సంగమమని తెలుసుకొని "ఇంత పవిత్రమైన ప్రదేశమునకు మాయ జింక ఏదో కార్యార్దమై దారి చూపెనని "తలచి పొదలు తొలగించి చూడగా పాతాళభువనేశ్వర్ గుహలు బయల్ప్దడినవని ఇక్కడ స్తల పురాణం వివరిస్తోంది. త్రేతాయుగములో పాండవులు మహాభారత యుద్దానంతరము ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహలలో తపస్సు చేసుకొని ఇక్కడ గల గుప్త మార్గము గుండా కైలామునకు వెళ్లేరని చెప్తారు.
ఆది శంకరాచార్యుల వారు పూజించిన శివలింగం కలియుగములో ఆది శంకరులు కుడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని ఇక్కడ నుండే కైలాసానికి వెళ్లినారని చెప్తారు. ఈ గుహలో గల శివలింగమునకు వెండి, పాదరసము పూసి అప్పటి వరకు జ్వలిస్తున్న లింగాన్ని ఆది శంకరులు చల్లపరిచేరని అంటారు.ఈ పాతాళభువనేశ్వరుని దర్శించుకుంటే చార్ ధామ్ యాత్ర చేసినంత పుణ్యం వస్తుందని స్తానికుల నమ్మకం. మరో విషయం ఈ గుహలలో రాతికి చెవి ఆనిస్తే నీటి ప్రవాహ "గల గలలు" వినిపిస్తాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List