ఇంద్రకీలాద్రి పర్వతం పై తనకు తానుగా వెలసిన దుర్గామాత. ~ దైవదర్శనం

ఇంద్రకీలాద్రి పర్వతం పై తనకు తానుగా వెలసిన దుర్గామాత.

* విజయేశ్వర స్వామి ప్రతిష్టించిన హిందూ ఆలయం ...
* ఇంద్రాది దేవతలు కీలాద్రికొండ‌కు తరచూ దుర్గామాత దర్శనం ...
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం విజ‌య‌వాడ‌లోని కృష్ణానది ఒడ్డున‌ ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పై ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి తనకు తానుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. కృతయుగానికి ముందు రాక్షసుల బాధ భరించ లేక కీలుడనే మహర్షి గోర‌ తపస్సు చేసి దుర్గాదేవిని ప్ర‌త్య‌క్ష్యం చేసుకొని అమ్మవారిని తన పైనే నివాసం ఉండి ఆ రాక్షసులను సంహరించమని కోరాడు, అప్ప‌డు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన త‌ర్వాత‌ తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. అప్పుడు కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ వున్నాడు. ఆ అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు కీలాద్రికొండ‌కు తరచూ రావడం వలన ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ మహిషాసురమర్ధిని వెలసిన కారణంగా ఆమె కనకవర్ణంతో వెలుగుతుండ‌డం వ‌ల్ల‌ కనక దుర్గ అయింది.
.
ఈ ప్రాంతంలోనే అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడ‌ని పుర‌ణాలు చేబుతున్నాయి. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా అర్జునుడు ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ స్వామి పేరు మీదుగా ఈ ప్రాంతానికి విజయవాడ అయింది. పూర్యం ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. ఈ గుడులు కాలక్రమంలో కొన్ని శిధిలమైపోయాయి. ఇక్క‌డ‌ క్వారీలలో రాళ్ళ కోసం తవ్వకాలు జరుపుతుండ‌గా అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List