పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చింతమాను మఠం. ~ దైవదర్శనం

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చింతమాను మఠం.

* గరిమిరెడ్డి అచ్చమాంబ నివాసం - కాలజ్ఞాన తత్వ ప్రభోదం..

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. సత్యం, త్యాగం, ధర్మము, భక్తీ ప్రపత్తులు భోధించి, ఆత్మజ్ఞానము కలిగించి మానవులకు ఎన్నో జన్మల పుణ్యఫలము వాళ్ళ ప్రాప్తించిన వారి మానవ శరీరాలతోనే రాజయోగము ద్వారా ముక్తిని సులభముగా పొందే మార్గమును సర్వ మతాల వారికి అందించుటకు, నిరాకార నిర్గుణ స్వరూపుడైన శ్రీ విరాట్ విశ్వబ్రహ్మ సాకారరూపుడై, సర్వతేజోశక్తుల యుక్తముగా, భూమిపై సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అంశతో సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించినారు.
.
ప్రకృతి ధర్మాన్ని అనుసరించి 12 సంవత్సరముల వయస్సు వచ్చువరకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు యోగాలు సమస్త విద్యలు అభ్యసించి దేశాటనకు బయలుదేరునప్పుడు తల్లి వీరపాపమాంబకు తారకమును, సృష్టి క్రమమును భోధించి, శ్రీ కృష్ణుడు అర్జునకు చూపించినట్లు విశ్వరూప దర్శనము తల్లికి చూపించి, జ్ఞానోదయము కలిగించినారు. శ్రీ కృష్ణునిలాగానే గోపాలకుడై గారిమి రెడ్డి అచ్చమాంబ ఇంటియందు గోవులు కాయుటకు గోవుల కాపరిగాయుండి బనగాను పల్లెలోని రవ్వలకొండ గుహలయందు తాళపత్రాలపై నవగ్రహాల నడక వల్ల, పంచభూతాల ప్రతిక్రియ వల్ల ప్రకృతి వైపరీత్యాలను భూత - భవిష్యత్ వర్తమాన విషయాలతో కాలజ్ఞాన - ఆత్మజ్ఞాన, భక్తిమార్గము - ముక్తిమార్గము వ్రాసినారు, శ్రీ స్వాములవారు గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటియందు ఉన్నంతకాలము గరిమిరెడ్డి అచ్చమ్మగారి సేవలకు మెచ్చి గరిమిరెడ్డి అచ్చమాంబను ఆశీర్వదించారు.
.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయబడిన 14,0000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టిన దానిపై ఒక చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు..? ఇలా ఎందుకు చేశారు..? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. అచ్చమ్మ ఇంట్లో యధాప్రకారం కాలజ్ఞానాన్ని వ్రాసి, ఒక చోట పాతిపెడుతూ ఉండేవారు పోతులూరి. బ్రహ్మం గారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఇంటిని మ్యూజియంగా మార్చారు. బ్రహ్మం గారి జీవితానికి సంబందించిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మం గారు ఇక్కడ నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి, అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆచెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంలా ఉంటుంది. వ్యాధులు మరియు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి.
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List