శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది.
ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో (నవంబరు నుండి డిసెంబరు ) 10 రోజులపాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది!!...
పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు, అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది, (తమిళ టి.వి. ఛానల్స్ లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.)
ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్రలో వేయి కిలోల స్వఛ్ఛమైన నేతిని పోసి, 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు.
ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి, ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది,
అరుణాచల ఆలయ ప్రస్తావనలో చెప్పుకోదగిన విశిష్టత కలిగినది, ఈ కార్తీక దీపాన్ని పది రోజుల పండుగగా జరుపుకుంటారు మరియు దీనిని కార్తిగై బ్రహ్మోత్సవం అని పిలుస్తారు.
తిరువణ్ణామలైలో కార్తిగై దీపం పండుగ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన వేడుక. అరుణాచలేశ్వరుడు కొండపైన అగ్ని రూపంలో కనిపిస్తాడని చెబుతారు. ఈ మహిమాన్వితమైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని చూసేందుకు ఆ రోజున అరుణాచలేశ్వర ఆలయంలో చాలా కనులు పండుగలగా కోనసాగుతుంది..
No comments:
Post a Comment