ఊడుగ చెట్టు. ~ దైవదర్శనం

ఊడుగ చెట్టు.

మహాత్తరమైన చెట్టు ఊడుగ చెట్టు ఈ చెట్టు కన్నా శక్తివంతమైనది వేరొకటి లేదని చెప్పుకోవాలి,
ఈ చెట్టుకు విచిత్రమైన స్వభావం వుంది. ఊడుగు కాయలు భాగా పండి క్రింద పడిపొవును, ఇలా క్రింద పడినవి ఆరుద్రనక్చత్రం రోజున వచ్చు ఉరుములు మెరుపులకి ఈ క్రింద పడిన గింజలు మరళ చెట్టుకెళ్లి అతుక్కుపొతాయి, కొన్ని సమయాల్లో ఈ ఉరుముల మెరుపులకి ఈ గింజలు ఎక్కడివక్కడ పారిపొతాయి ఒకదానికొకవెనుక చీమలు బారినట్టు పారుకుంటా పొవును, కొందరు మంత్రగాళ్ళు తాంత్రిక విద్యలు అనగా మాయలు మంత్రాలు చేయడానికి ఇలాంటి సమయంలో ఈ ఎగిరే గింజలను ఒక బట్ట కింద పరచి కొన్ని రకాల పూజల ద్వారా ఆ గింజలని బట్ట మీద పడేలా చేసి ఈ గింజలతో నూనె తిసి ఈ నూనె బహు రకాల మాయలు మంత్రాలకు ఉపయేగించేవారు. మనుస్యులు మాయమయ్యే యేగాలు కూడా ఈ గింజలతో ఎన్నో రకాలుగా ఉన్నాయి.

అంత గొప్ప సాదనలు మనం చేయలేకపొయినా ఈ క్రింది విధంగా వీటియెక్క సామర్ద్యాన్ని మనం ఉపయేగించుకొవచ్చును.

1) ఊడుగ గింజల నుంచి నూనె ని తీయడం  7 రోజులు నువ్వులనూనె లో ఊడుగ గింజల చూర్నం  వేసి అనగా 7 రోజులు భావన చేసి ఆ తర్వాత స్వచ్చమైన కంచుపాత్రలో వేసి తీవ్రమైన ఎండలో ఈ పళ్ళెమునుంచితే ఈ గింజలలోనుంచి నూనె చుక్క చుక్కకారుతుంది, ఈ నూనెని వేరొక కంచుపాత్రలో సేకరించి ఈ నూణెని సాదనాలకి వాడుకొవచ్చును.
2) ఊడుగతైలం, పాలు, నెయ్యి కలిపి అందులో ఏ చెట్టుగింజలైనా నానవేసి తీసి నాటి చేపమాంసపునీటితో తడుపుతూ వుంటే వెంటనే మెక్కలు పుట్టుకొస్తాయి.

3) ఆముదపుగింజగాని, కాకరగింజగానీ దానిమ్మగింజగానీ ఊడుగతైలంతో కలిపి నాటి ఈ తైలంతోనే తడుపుతూవుంటే క్చణంలో మెక్కమెలిచి పండ్లను కూడా కాస్తుంది.

4)  తామర గింజలను ఊడుగతైలములో భావనచేసి దానిని నీళ్ళలో వేస్తే అది పూలతోకూడ పుట్టి ఆశ్చ్యర్యాన్ని కలిగిస్తుంది.

5)  నీటిలోపుట్టేవి గాని, మెట్టపాంత్రాల్లొ పుట్టెవి గాని ఏ గింజలనైనా ఊడుగనూనెలో భావనచేసి నాటితే అవి వెంటనే మెలుస్తాయి.

6)   పాతబడిన ఊడుగ విత్తనాలు 3 కేజీలు సేకరించి మెత్తగా దంచాలి, సరిపొయేంత కుండను తీసుకొని దానికి అడుగున ఒక చిల్లువేసి ఈ చిల్లుకు సరిపడు లావుగలది ఆరుఅంగుళముల పొడవు గల ఇనుపకడ్డీను చొనిపి, ఆ కుండలో దంచిన ఊడుగుగింజలు పొయాలి. కుండకన్నా పెద్దదిగా ఒక గొయ్యిత్రవ్వి అందులో ముందుగా ఒక వెడల్పుమూతిగల సీసపు పాత్రనుంచి దానిపైన ఊడుగుగింజలున్న కుండను పెట్టాలి. కుండ అడుగునున్న చిల్లునుండి ఇనుపకడ్డీ ద్వారా క్రిందకి జారిపడే తైలం ఈ పాత్రలో పడేటట్ట్లుగా అమర్చాలి. కుండా కంటం వరకూ గోతిలో ఉండాలి. కుండకు చుట్టూ గుర్రపు లద్దెతో పూడ్చి 6 నెలలు వుంచి, జాగ్రత్తగా కుండ క్రింద సీసపుపాత్రలోని అంకోలతైలాన్ని సేకరించి భద్రపరుచుకొవాలి.
ఈ అంకోల తైలాన్ని రాచిన రాయిగాని, మట్టిగాని, భావినీటిలో వేసిన యడల అది రాత్రంతా మండుతూ వెలుగుతూంటుంది. ఈ తైలంలో నానవేసిన గింజలు నీటిలో వేసిన వెంటనే మెలకెత్తుతాయి. 

7)  అంకోలా తైలాన్ని రెండు రాల్లకి పూసి దగ్గర వుంచితే ఈ రెండు రాల్లు ఒకటినొక్కటి కొట్టుకొనును.

8)  అంకోలా తైలం స్వచ్చంగా తిసి సేకరించి , ఈ తైలాన్ని తెల్లబొల్లి మీద పూస్తే తెల్లబొల్లి నశిస్తుంది.

9)  ఈ అంకోలా తైలం చాలా శక్తి వంతమైనది శరీరానికి రాచుకొంటే శరీరం నేయి రాచినట్లుగా మ్రుదువుగా కోమలంగా ఉంటుంది. ఈ తైలం దేహమును వజ్రంలా ద్రుడంగా మెరిసేలాగా చేయును.

10)  ఊడుగ తైలం తీసే మరొక విధానం : ఊడుగ గింజలని దంచి ఒక కుండలో వేసి, వేడినీరు పొసి ఉంచి మరునాడు, తీసుకొని, వేరే పాత్రలోవేసి కొద్దిగా క్చార ద్రవ్యం వేసి ఉంచి తీసుకొవాలి. తరువాత తిలపర్నీ అనగా నీటిచెంచలి, వావిలి, రక్తచందనం, చందనం వేరు చూర్నాన్ని సమభాగంగా కలిపి మద్యమాగ్నిపై రెండు రాత్రులు 36 గంటలు వండుతూ ఆ పాత్రలో మరొ చిన్న పాత్రనుంచాలి. నీరంతా ఇగిరిపొయిన తర్వాత దానిలో తైలం పడుతుంది. దానిని సీసపు పాత్రలో భద్రపరచి యేగాలలో వాడుకొవాలి.

11)  ఒక కుండలో ఊడుగగింజల  మరియు చేదుపుచ్చ వేర్లు ఈ రెండునూ దంచి కుండలో వేసి అందులో తగినంత కాంజికాన్ని పొసి , మ్రుద్వగ్నిపై వండితే కల్కం పైన అంకోలా తైలం నేయివలే తేలుతుంది. దీనిని జాగ్రత్తపెట్టుకొవలెను.

12)  శవమును కొంచెము సేపు బ్రతికించుట : మరణించిన మనుస్యుని నోటియందు ఒక చుక్క ఊడుగ తైలమును వేసినచో, ఆ శవము మరికొద్ది సేపు నిముసములు ప్రాణంపోసుకొని శరీరాన్ని కదలాడి వీలుఅయితే కొన్ని మాటలు మాట్లాడును, ఇది మూగవాల్లమీద మాటలు రాని పసివాళ్ళ మీద ప్రయేగించరాదు,అప్పుడే మాట్లాడుతూ చనిపొయిన శవానికి మాములుగా మాట్లాడుతూ వుండి చనిపొయిన శావానికి ఈ ప్రయేగం చేయాలి.

13)  ఒంటె చర్మంతో చేసిన చెప్పులకి. ఊడుగ తైలంతో మర్దించిన తెల్ల ఆవాలపిండిని ఆ చెప్పులకి వత్తుగా పూసి అవి తొడుక్కొని ప్రయాణం చేస్తే 100 మైళ్ళ దూరాన్ని సునాయాసంగా ప్రయాణించవచ్చును.

14)  ఊడుగ విత్తులు తెల్ల ఆవాలు సమాన భాగాలు కలిపి గానుగలో నైపుణ్యంతో తైలం తీయాలి. ఈ తైలాన్ని ముక్కులోకి వేసుకొంటూ నస్యం చేస్తున్న యడల, వంద సంవత్సరాల వ్రుద్దుడైననూ అందంగా 20 ఏళ్ల యువకునివలే చర్మం తయారవుతుందని రాజమార్తాండ రసాయనం అనే శాస్త్రంలో తెలుపబడింది.

15)   ఈ చెట్టుకున్న అత్యద్బుతగుణం వెంటనే పుట్టించడం, ఇదే నియమంతో ఈ అత్యద్బత తైలం అత్యంత త్వరగా వెంట్రకల రావడానికి అశ్వనీ దేవతలతే చెప్పబడిన గప్ప యేగం ఇది. చేసుకన మేలు పొందండి.

3 comments:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive