శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన. ~ దైవదర్శనం

శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన.


కాశినాయనమండల పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న జ్యోతిక్షేత్రం. నిస్వార్ధ సాధువు గా, శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాల పునరుద్ధ్దరణకర్తగా, పలు జిల్లాల ప్రజలకు కాశిరెడ్డినాయన స్థిరపరిచితుడే. వివిధ ప్రాంతాలకు చెందిన కాశినాయన భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం చేరవేస్తూ, ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లలో సేవ చేస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయకతతో కనిపించే జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఆరాధన ఉత్సవాలకు దాదా పు రెండు లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఎంతమంది వచ్చినా అందరికీ రుచికరమైన రకరకాల వంటలు వండిపెట్టడం విశేషం. చిన్ననాటనే గొప్పయోగి కాగల చిన్నెలు వెల్లడికాగా ప్రాయమున గురూపదేశమయింది. యోగసాధనలో అత్యున్నత స్థాయిని అరదుకున్న అవధూత కాశిరెడ్డి నాయనగా ప్రసిద్ధుడైన మున్నెల్లి కాశిరెడ్డి.
.
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామానికి చెరదిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతుల కడుపు పంట కాశీవిశ్వేశ్వరుని ప్రసాదమే కాశిరెడ్డి. 1895లో సంక్రాంతి కనుమ పండుగ అయిన జనవరి 15 ఆదివారం నాడు జన్మించిన కాశిరెడ్డిని పుట్టుకతోనే దైవీగుణములు వెన్నంటినవి.
.
తల్లి కాశమ్మ ఒకనాడు తమ పొలంలో పని చేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాశిరెడ్డిని చంకన వేసుకుని పోయినది. ఆ బాలుడిని ఒక చెట్టు క్రింద పడుకోబెట్టి కూలీలకు అన్నం పెడుతున్నది. పట్టపగటి ఎండ శిశువు ముఖం మీద పడకుండా ఒక నాగుపాము పడగ విప్పి నీడపట్టినది. కాశిరెడ్డికి ఏ కీడు జరగనందుకు సంతోషంరచిన కాశమ్మ ఊరిపెద్దలకీ వింత చెప్పినది. వారు ఈ పసివాడు గొప్ప సిరిగల వాడవుతాడు లేదా గొప్పయోగి అవుతాడని అన్నారు. కాశిరెడ్డి ముద్దు ముచ్చటలు చూడకురడానే తండ్రి సుబ్బారెడ్డి కన్నుమూసాడు.
.
కాశమ్మ పిల్లలతో పుట్టిల్లు కొత్తపల్లెకు చేరుకున్నది. ఆమె తండ్రి అంబవరం బాలి రెడ్డి బిడ్డను ఆదు కున్నాడు. ఐదేళ్ళ కాశిరెడ్డి వేమూరి రామయ్య వీధి బడిలో గుణంతాలు, శతకాలు, అమరం, రామాయణ భాగవతాలు చదువుకున్నాడు. అక్క కాశమ్మకు మేనమామతో పెండ్లయినది. కాశిరెడ్డి స్వగ్రామం బెడుసుపల్లి భూములు పాలివారడ్లకు అమ్మి కొత్తపల్లిలో భూమి కొని, ఇల్లుకట్టుకుని వ్యవసాయం చేసాడు. కాలగతిలో అమ్మతాతలు, తరువాత కన్నతల్లి చనిపోయారు. వచ్చిన సంబంధాలు వివిధ కారణాల వల్ల నచ్చక కాశిరెడ్డికి పెళ్ళి కాలేదు.
.
యవ్వనంలోనే జిజ్ఞాసువైన కాశిరెడ్డి, కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొరడా రాఘవరెడ్డి సాంగత్యరతో వేదాంత గ్రంథాలు జీర్ణించుకోవడంతో, ఆయనలో వైరాగ్య బీజాలు పొటమరించాయి. కృష్ణాపురంలో అత్తిరాసు గురవయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయిరచాడు. గురవయ్య కొన్ని దినాలు కాశిరెడ్డిని పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారంనాడు పంచాక్షరీ, షడక్షరీ మంత్రాలుపదేశించి, హస్తమస్తక యోగం చేసి, తారకయోగము, షణ్ముఖీ ముద్ర సాధించే విధానము చెప్పి అనుదినం తన సాధనానుభవాలు చెప్పమ న్నాడు. కాశిరెడ్డి ఒక్కొక్క మెట్టు యోగం సాధించి గురువుకు తెలియజేశాడు. ఆయన శీఘ్రగతిని గ్రహించిన గురవయ్య నీవు అవధూతవవుతావని దీవించాడు.
.
కాశిరెడ్డి తన పొలం అక్క కాశమ్మకిచ్చి 1965 డిసెంబరులో ఇల్లు విడిచాడు. గ్రామాల్లో పురాణ కాలక్షేపాలు చేస్తూ వరికుంట్లలో శివాలయం జీర్ణోద్ధరణ చేసి, పెద్ద చిన్న అహోబిల క్షేత్రాలలో నరసింహదేవుని అర్చించి, గరుడాద్రి చేరాడు. అక్కడ ఒక పర్ణశాల ఏర్పరచుకుని తపస్సు చేసాడు. అయా చితంగా ఏది లభిస్తే అది తిని, గురువు చెప్పిన సాధనలు చేసి అష్టసిద్ధులను కైవశం చేసుకున్నాడు. తీవ్రసాధనతో ఆయనకు ఒకనాడు నిశ్చల సమాధి ఏర్పడి భగవత్సాక్షాత్కారం లభించినది. దేహం చాలించాలని అనుకున్న కాశిరెడ్డికి తాను చేయవలసిన పనులు జీర్ణదేవాలయోద్ధరణలు, నూతన దేవాలయాల నిర్మాణం, భక్తి జ్ఞాన వైరాగ్యముల ప్రచారం, నిత్యాన్నదాన కార్యమ్రాలు ఉన్నట్లు భగవదాదేశమైనది.
.
భగవదాదేశం నెరవేర్చడానికి కాశిరెడ్డి దేశ సంచారం ప్రారంభిరచాడు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కాశిరెడ్డి పలు జీర్ణమైన దేవాలయాలను, సమాధులను, కోనేరులను పునరుద్ధరించి, నూతన దేవాలయాలు నిర్మించి, అన్నసత్రాలు నిల్పి నిర్వహించాడు. ఆయన ధనికులకు, దరిద్రులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు చేసిన మేలు ఫలితమది. అది ఆయన దయాంతఃకరణం చేత, తపోబలం వల్ల సాధ్యమైనది.
.
గంగనపల్లె వీరారెడ్డి కాశినాయన శిష్యుడు. అతడు గురువుపై అలిగి కాశీకి బయల్దేరాడు. ఆ విషయం నాయనకు తెలిసి ”వాడెక్కడ పోతాడు? మధ్యనుండే తిరిగి వస్తాడు” అన్నారు. ఈ చర్చ మామిళ్ళపల్లిలో జరుగుతుండగా వీరారెడ్డి తిరిగి వచ్చాడు. చుట్టూ మూగిన జనం అడిగితే తాను రైలులో పోతురడగా నాయన వచ్చి తనమూట క్రిందికి దించి, తన రెక్కపట్టి రైలుబండి నుండి క్రిందికి లాగినాడన్నాడు. వీరారెడ్డి కాశినాయనను క్షమార్పణ కోరితే ”నీవు కాశీకి పోతే నిన్నెవరు సమాధిచేస్తారు? నీకు ఐదు దినాలలో మరణమున్నది” అన్నారు. అన్నట్లే వీరారెడ్డి ఐదవనాడు చనిపోతే 1986ఫిబ్రవరి 19న నాయన అతనికి సమాధి కట్టించాడు. గురువుల సమాధి కట్టించవలసిన శిష్యునికి గురువే సమాధి కట్టిరచాల్సి వచ్చింది. అదే దైవలీల!
.
గ్రామంలో కాశినాయన భానుమండలం లక్ష్మీనారాయణ ఆలయాన్ని బాగుచేయిస్తురడగా మొదటిసారి వచ్చిన కోట్ల విజయభాస్కర రెడ్డి గొప్ప భక్తుడయ్యాడు. అప్పుడే నీవు ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రివి అవుతావని నాయన దీవించాడు. కాలాంతరంలో ఆ దీవెన ఫలిరచిరది. కాశిరెడ్డి మహిమలు చూసిన వారు, మేలు పొందినవారు కొందరు ఆయనను నాయన అంటే మరికొందరు తాత అనేవారు.
.
పలు ప్రారతాల్లో పర్యటనలు, ఆనేక ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన నిర్మాణాలు 1995 సంవత్స రారతానికి పూర్తయ్యాయి. అన్నపూర్ణ, వినాయక ప్రతిష్ఠల కోసం కాశినాయన 1995 డిసెంబరులో లిరగాల కోన నురడి వచ్చారు. విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం తెల్లవారుఝామున కారులో వెళ్ళి కూచున్న ఆయన అక్కడే పరమాత్మలో ఐక్యమయ్యారు. తర్జన భర్జనల అనంతరం భక్తులు ఆయన పార్థివ దేహాన్ని యోగానందాశ్రమంలో విధివిధానోక్తరగా సమాధి చేసారు. సమాధి చెరత నిత్యార్చన, కార్తీక సోమ వారాలు, నాయన ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List