నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన మహా పుణ్యక్షేత్రం యాగంటి. ~ దైవదర్శనం

నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన మహా పుణ్యక్షేత్రం యాగంటి.

* కలియుగాంతం కాలు దువ్వి రంకె వేసే నంది, యాగంటి రహస్యం..!
* జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం యాగంటి..
* మృత్యుదోషాలన్నీ తొలగించే అగస్త్య పుష్కరిణి...
* నాడు “నేకంటి” నేడు యాగంటి..
.
https://www.facebook.com/media/set/…
.
మానవ జీవితానికి ఊతం కోసం భక్తి ఉల్లాసం కోసం ప్రకృతి ఈ రెంటి అనుసంధానంగా భారతదేశమంతటా ఆలయాలు ఏర్పడ్డాయి. పార్వతితో కలిసి మహేశ్వరుడు కొలువైన యాగంటి తెలుగువారికి సొంతమైన ఆధ్యాత్మిక సంపద. నల్లమల, ఎర్రమల సౌందర్యానికి ప్రతీక. తెలుగువారి శైవక్షేత్రాల్లో యాగంటి నాగరిక ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని అధిరోహించిన ఉమా మహేశ్వరులు వెలసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. అందుకే భృగు, అగస్త్య వంటి మహా రుషులు అక్కడ సంచరించారని అంటారు. చుట్టూ అడవి... ఎర్రటి కొండలు... పచ్చటి పరిసరాలు... రణగొణులు లేని ఏకాంతం... స్వచ్ఛమెన కొండధార ఉన్న ఈ క్షేత్రం చూసినంతనే ఆహ్లాదం కలిగించే క్షేత్రం. దీని ఉనికి పురాణ కాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడని దాని ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘నేకంటి నేకంటి’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు.
.
కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు వున్నాయి. ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలుప్రవహించటం చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం వుంది. అద్భుతమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామి వారు పరమశివుడు విగ్రహరూపంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె వుంటుందని పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది.
.
శ్రీ వెంకటేశ్వరస్వామి ఒక గుహలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి యొక్క విగ్రహం వుంటుంది. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు. రెండవ గుహలో శివలింగాన్ని ప్రతిష్టించి అగస్త్యమహర్షి తపస్సు చేసాడంట. మరి మూడవగుహను శంకరగుహ అంటారు దీన్ని. శ్రీ పోతులూరివీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడని తన శిష్యులకు కాలజ్ఞానం భోదించటం జరిగిందనిచెప్పుకుంటారు. అయితే అడవి మధ్యలో ప్రకృతిఒడిలో మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆహ్లాదకరమైన భావనను కల్గిస్తుంది. ఇక్కడ వున్న కోనేరులోని నీరు అనేది నిరంతరం వస్తూనే వుంటుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే ఆయుష్ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఎవరికైతే జాతకంలో మృత్యుగండాలు వుంటాయోవారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారి మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయంట. అగస్త్యమహర్షి స్నానమాచరించటంతో దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు. ఈ ఆలయం యొక్క పరిసరప్రాంతాలలో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథనం వుంది.
.
యాగంటి బసవయ్య:..
యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్ఠించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు.
.
అగస్త్య పుష్కరిణి:...
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.
.
సహజసిద్ధమైన గుహలు:..
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహలో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.
.
శనిగ్రహ బాధలు:..
అప్పుడు అక్కడ కాకులు ఋషి యొక్క తపస్సుకి భంగం కల్గించటంతో కోపోద్రిక్తుడైన అగస్త్యమహర్షి ఆ ప్రాంతంలో ఇకపై కాకులు ఉండరాదని శపించాడట. అందుకే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శనిగ్రహ బాధలతో బాధపడే వారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలిగిపోతాయని గట్టి నమ్మకం.
.
దర్శన వేళలు:..
ప్రతిరోజు ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది.
.
వసతి సౌకర్యాలు:..
ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర సేవాసదన్, బ్రహ్మణి రెసిడెన్సీ తదితర వసతి గృహాలు ఉన్నాయి. వారు గదుల సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. ఇంకా అన్నదాన సత్రాల్లో కూడా వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన, ఉమామహేశ్వర రెడ్ల, వేదగాయత్రి బ్రాహ్మణ, వాసవి ఆర్యవైశ్య సత్రాల ద్వారా నిత్యాన్నదాన భోజన సౌకర్యాలు ఉన్నాయి.
.
రవాణా సౌకర్యం:..
యాగంటి క్షేత్రం బనగానపల్లె నుంచి 13 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఆర్టీసి బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి బనగానపల్లె-76 కి.మీలు, అనంతపురం నుంచి బనగానపల్లె - 120 కి.మీ. నంద్యాల నుంచి బనగానపల్లె - 45 కి.మీ, హైదరాబాద్ నుంచి బనగానపల్లె - 228 కి.మీ, శ్రీశైలం నుంచి బనగానపల్లె - 223 కి. మీ. మహానంది నుంచి బనగానపల్లె - 60 కి.మీ
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List