‘నేను’ అని అనగానే - అనుకోగానే మనదృష్ఠి పధంలో ఉండేది - ఈ దేహమే. అదే *అధ్యాస - లేదా భ్రమ – భ్రాంతి*. ఈ భ్రమ లేదా భ్రాంతి - లేదా అధ్యాస తొలగాలి
'నేను' - అని అనగానే - అనుకోగానే మనదృష్ఠి పధంలో ఉండాల్సింది నిరాకార నిర్గుణ - సర్వవ్యాపక చైతన్యమే. అట్టి దృష్ఠి నిరంతరము ఉండాలి. అప్పుడే అధ్యాస తొలగినట్లు - ఆత్మానుభూతి పొందినట్లు.
అధ్యాసను తొలగించుకోవాలంటే గొప్పసాధన ఏదో ఈ శ్లోకంలో ప్రారంభంలోనే తెలియజేస్తున్నారు. - (277 శ్లో చూడండి)
*ఏకధారగా ఆత్మను గుర్తిస్తూ ఉండాలి - ధ్యానిస్తూ ఉండాలి*. ఈ ఆత్మధ్యానం వల్లనే యోగులు మనస్సును నశింపజేసుకుంటున్నారు. మనస్సు నశిస్తే సమస్త వాసనలు నశించినట్లే. ఈ ప్రకారంగా అధ్యాసను అంతం చేసుకో అని సలహా.
నేను శరీరాన్ని - నేను మనస్సును - నేను బుద్ధిని అనే *తాదాత్మ్యం భావనను విడిచి* అనంతము - దివ్యము అయిన *ఆత్మనే నేను అని సదా భావన* చేస్తూ ఉండాలి. ఈ *భావన చేస్తూనే యోగులు మనోనాశనాన్ని* సాధిస్తున్నారు. అయితే మనస్సు ఎప్పుడు అంతం అవుతుంది? అన్ని రకాల వాసనలు అంతమైనప్పుడే. అంటే అన్నిరకాల ఆలోచనలు, సంకల్పాలు అంతం అయితేనే.
ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి?
ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి?
ఈ ప్రపంచం మీద, ఈ దేహం మీద, భార్యాబిడ్డల మీద, ఆస్తిపాస్తుల మీద మమకారం - వ్యామోహం ఉన్నంతకాలం; ఈ జగత్తు నిత్యమని భావన ఉన్నంతకాలం ఆలోచనలు, సంకల్పాలు వస్తూనే ఉంటాయి. అలా
*వస్తున్నంతకాలం మనస్సు ఏకధారగా ఆత్మమీద నిలవదు. ఆత్మనిష్ఠ కుదరాలంటే ఆలోచనలు అంతం కావాలి. మనస్సులోని కోరికల వల్ల అలజడులు - ఆ అలజడులు వల్ల ఆత్మనిష్ఠ కుదరదు. అలజడి తగ్గాలంటే "ప్రపంచం మిధ్య" ఇక్కడి సుఖం నిజం కాదు" అని విశ్వసించాలి*.
లోపలి నుండి వచ్చే కోరికల వల్ల మనస్సు అలజడి చెందుతూ ఉంటుంది. అలాంటి అలజడి వల్ల ప్రశాంతత ఉండదు. నిష్ఠ కుదరదు. కనుక అలజడి తగ్గాలి. దేహ సంబంధమైన కోరికలు అణగాలి. ఈ ప్రపంచం మిధ్య అని - ఇక్కడ లభించే సుఖం శాశ్వత సుఖం కాదని తెలియాలి; *నిత్యసుఖం ఆత్మవల్లనే లభిస్తుందని దృఢంగా విశ్వాసం కలగాలి. అప్పుడు మాత్రమే మనస్సు ఆత్మయందు నిలుస్తుంది*. ఇలా ప్రశాంతమైన మనస్సుతో - శ్రద్ధగా, పట్టుదలగా, ఏకాగ్రతతో ధ్యానాభ్యాసం చేస్తుంటే - *ఆత్మను గుర్తిస్తూ ఉంటే - ఆత్మగా తనను తాను భావిస్తూ ఉంటే తపిస్తూ ఉంటే - అదే తపన అదే తపస్సు*. ఈ తపస్సు వల్ల అప్పటిదాకా మిగిలి ఉన్న వాసనాబీజాలన్నీ దగ్ధమైపోతాయి. ఈ తపస్సు వల్ల అగ్ని జనించి ఆ తపోగ్నిలో వాసనలన్నీ భస్మీపాటలమై పోతాయి. ఆత్మనిష్ఠ వల్ల అన్ని వాసనలు అంతమైపోతాయి. వాసనాక్షయం జరుగుతుంది. కానీ ఆత్మనిష్ఠలో నిలవకుండా చేసేది కూడా వాసనలే. కనుక వాసనల స్వరూప స్వభావాలను తెలుసుకుంటూ - వాటిని వేరువేరు మార్గాల ద్వారా క్షయం చేసుకుంటూ ఆత్మనిష్ఠలో నిలవాలి.
'నేను' - అని అనగానే - అనుకోగానే మనదృష్ఠి పధంలో ఉండాల్సింది నిరాకార నిర్గుణ - సర్వవ్యాపక చైతన్యమే. అట్టి దృష్ఠి నిరంతరము ఉండాలి. అప్పుడే అధ్యాస తొలగినట్లు - ఆత్మానుభూతి పొందినట్లు.
అధ్యాసను తొలగించుకోవాలంటే గొప్పసాధన ఏదో ఈ శ్లోకంలో ప్రారంభంలోనే తెలియజేస్తున్నారు. - (277 శ్లో చూడండి)
*ఏకధారగా ఆత్మను గుర్తిస్తూ ఉండాలి - ధ్యానిస్తూ ఉండాలి*. ఈ ఆత్మధ్యానం వల్లనే యోగులు మనస్సును నశింపజేసుకుంటున్నారు. మనస్సు నశిస్తే సమస్త వాసనలు నశించినట్లే. ఈ ప్రకారంగా అధ్యాసను అంతం చేసుకో అని సలహా.
నేను శరీరాన్ని - నేను మనస్సును - నేను బుద్ధిని అనే *తాదాత్మ్యం భావనను విడిచి* అనంతము - దివ్యము అయిన *ఆత్మనే నేను అని సదా భావన* చేస్తూ ఉండాలి. ఈ *భావన చేస్తూనే యోగులు మనోనాశనాన్ని* సాధిస్తున్నారు. అయితే మనస్సు ఎప్పుడు అంతం అవుతుంది? అన్ని రకాల వాసనలు అంతమైనప్పుడే. అంటే అన్నిరకాల ఆలోచనలు, సంకల్పాలు అంతం అయితేనే.
ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి?
ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి?
ఈ ప్రపంచం మీద, ఈ దేహం మీద, భార్యాబిడ్డల మీద, ఆస్తిపాస్తుల మీద మమకారం - వ్యామోహం ఉన్నంతకాలం; ఈ జగత్తు నిత్యమని భావన ఉన్నంతకాలం ఆలోచనలు, సంకల్పాలు వస్తూనే ఉంటాయి. అలా
*వస్తున్నంతకాలం మనస్సు ఏకధారగా ఆత్మమీద నిలవదు. ఆత్మనిష్ఠ కుదరాలంటే ఆలోచనలు అంతం కావాలి. మనస్సులోని కోరికల వల్ల అలజడులు - ఆ అలజడులు వల్ల ఆత్మనిష్ఠ కుదరదు. అలజడి తగ్గాలంటే "ప్రపంచం మిధ్య" ఇక్కడి సుఖం నిజం కాదు" అని విశ్వసించాలి*.
లోపలి నుండి వచ్చే కోరికల వల్ల మనస్సు అలజడి చెందుతూ ఉంటుంది. అలాంటి అలజడి వల్ల ప్రశాంతత ఉండదు. నిష్ఠ కుదరదు. కనుక అలజడి తగ్గాలి. దేహ సంబంధమైన కోరికలు అణగాలి. ఈ ప్రపంచం మిధ్య అని - ఇక్కడ లభించే సుఖం శాశ్వత సుఖం కాదని తెలియాలి; *నిత్యసుఖం ఆత్మవల్లనే లభిస్తుందని దృఢంగా విశ్వాసం కలగాలి. అప్పుడు మాత్రమే మనస్సు ఆత్మయందు నిలుస్తుంది*. ఇలా ప్రశాంతమైన మనస్సుతో - శ్రద్ధగా, పట్టుదలగా, ఏకాగ్రతతో ధ్యానాభ్యాసం చేస్తుంటే - *ఆత్మను గుర్తిస్తూ ఉంటే - ఆత్మగా తనను తాను భావిస్తూ ఉంటే తపిస్తూ ఉంటే - అదే తపన అదే తపస్సు*. ఈ తపస్సు వల్ల అప్పటిదాకా మిగిలి ఉన్న వాసనాబీజాలన్నీ దగ్ధమైపోతాయి. ఈ తపస్సు వల్ల అగ్ని జనించి ఆ తపోగ్నిలో వాసనలన్నీ భస్మీపాటలమై పోతాయి. ఆత్మనిష్ఠ వల్ల అన్ని వాసనలు అంతమైపోతాయి. వాసనాక్షయం జరుగుతుంది. కానీ ఆత్మనిష్ఠలో నిలవకుండా చేసేది కూడా వాసనలే. కనుక వాసనల స్వరూప స్వభావాలను తెలుసుకుంటూ - వాటిని వేరువేరు మార్గాల ద్వారా క్షయం చేసుకుంటూ ఆత్మనిష్ఠలో నిలవాలి.
No comments:
Post a Comment