శివభక్తుడు నుదుటన మరియు శరీరానికి విభూతి రాసుకోవాలి. అతడు రుద్రాక్షమాల ధరించాలి. అతడు బిల్వవృక్షం యొక్క ఆకులతో శివలింగాన్ని పూజించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని అతడు జపం మరియు ధ్యానం చేయాలి. వీటిలో చెప్పిన ప్రతి కర్మ చేత శివుడు ప్రసన్నుడవుతాడు. విభూతి లేదా భస్మం అనేది అత్యంత పవిత్రమైనది. అది సాక్షాత్తు శివుడు ధరిస్తాడు. రుద్రాక్షమాలలో ఉండే రుద్రాక్ష శివుని నుదుటన ఉన్న మూడవకన్నును సూచిస్తుంది. సంపదలకు అధిష్టాత్రీ అయిన లక్ష్మీదేవి నివసించే పంచస్థానాల్లో బిల్వ పత్రాలు ఒకటి.
జీవులకు బంధాన్ని, ముక్తిని కలిగించేది శివుడే. జీవుల తత్త్వమైన దైవత్వాన్ని అనుభూతిలో తెలియపరిచేవాడు శివుడే. మాయను శరీరం, ఇంద్రియాలు మరియు జగత్తుగా చేసి, జీవులను అందులోకి త్రోసినవాడు శివుడు. అహం (నేను) భావాన్ని కలిగించింది ఆయనే. వారిని కర్మలో బంధించి, వారి పాప, పుణ్య కర్మానుసారం ఆనందం మరియు దుఃఖాన్ని అనుభవించేలా చేస్తున్నది ఆయనే. ఇది జీవులు బంధంలో ఉండే స్థితి.
క్రమంగా వారిని అహంకారం, కర్మ మరియు మాయా పాశాల నుంచి విడిపించి, శివునిగా వారిని ప్రకాశిమపజేయువాడు శివుడే. ఇది స్వేచ్ఛ లేదా మోక్షం అనే స్థితి. శివుని అనుగ్రహం చేత మాత్రమే, వాళ్ళు అంతిమ స్థితి అయిన ముక్తిని చేరుకుంటారు.
అనవ, కర్మ, మాయ అనే మూడు మాలిన్యాల ప్రభావంలో ఉన్నప్పుడు జీవులకు స్వాతంత్రం ఉండదు. వారి అల్పజ్ఞానం మాత్రమే ఉంటుంది.
జీవులకు బంధాన్ని, ముక్తిని కలిగించేది శివుడే. జీవుల తత్త్వమైన దైవత్వాన్ని అనుభూతిలో తెలియపరిచేవాడు శివుడే. మాయను శరీరం, ఇంద్రియాలు మరియు జగత్తుగా చేసి, జీవులను అందులోకి త్రోసినవాడు శివుడు. అహం (నేను) భావాన్ని కలిగించింది ఆయనే. వారిని కర్మలో బంధించి, వారి పాప, పుణ్య కర్మానుసారం ఆనందం మరియు దుఃఖాన్ని అనుభవించేలా చేస్తున్నది ఆయనే. ఇది జీవులు బంధంలో ఉండే స్థితి.
క్రమంగా వారిని అహంకారం, కర్మ మరియు మాయా పాశాల నుంచి విడిపించి, శివునిగా వారిని ప్రకాశిమపజేయువాడు శివుడే. ఇది స్వేచ్ఛ లేదా మోక్షం అనే స్థితి. శివుని అనుగ్రహం చేత మాత్రమే, వాళ్ళు అంతిమ స్థితి అయిన ముక్తిని చేరుకుంటారు.
అనవ, కర్మ, మాయ అనే మూడు మాలిన్యాల ప్రభావంలో ఉన్నప్పుడు జీవులకు స్వాతంత్రం ఉండదు. వారి అల్పజ్ఞానం మాత్రమే ఉంటుంది.
No comments:
Post a Comment