దసరా చివరిరోజు విజయదశమి.. ఈ రోజుకు ఎంతో విష్టత ఉంది. ఆరోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు చాలా మంది. ఇలా ఎందుకు చేస్తారు..? అసలు విజయదశమికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏంటి..?
శమీవృక్షం పాపాన్ని పరిహరిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కాపాడింది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. పరమ శివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధి ప్రదాత వినాయకుడికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. అంతేకాదు, జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే పూర్వం యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారట. ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని దాగి ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది.
విజయదశమి రోజే రోజే రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణానికి వెళ్లిన అర్జునుడు విజయంతో తిరిగొస్తాడు. అందుకే విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.
పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించినపుడు తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టుమీద దాచి విరాటరాజు కొలువుకు చేరతారు. అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీ వృక్షాన్ని చేరి పూజించి, తాము దాచి ఉంచిన ధనస్సు, బాణాలనూ ధరించి శత్రువులతో యుద్ధం చేస్తాడు. విజయం సాధిస్తాడు. ఈ కారణంగానే శమీ వృక్షపూజ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు విజయదశమి రోజున ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెబుతారు.
దుర్గాదేవి_ఆరాధన_దుర్గుణాల_నిర్మూలన
మొదటి మూడు రోజులు : దుర్గాదేవి ఆరాధన
దుర్గాపూజ సాధనలో దృఢ సంకల్పం, నిశ్చయాత్మకమైన ప్రయత్నం, కఠినమైన శ్రమ అంతర్లీనమై ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే బలం, అనంతమైన శక్తి అతి ప్రధానమైన ఆవశ్యకతలు. బ్రహ్మం పరమ శక్తి అయిన దివ్యమాత ఆ సాధకుడిద్వారా పనిచేయాలి. మొదటి మూడు రోజులు ఈ 'అమ్మ'ను శక్తి, బలానికి ప్రతిరూపమైన దుర్గాదేవిగా పూజిస్తారు. తమలోని మాలిన్యాలు, దుష్టగుణాలు, లోపాలను నిర్మూలించమని దుర్గామాతను ప్రార్థిస్తారు. సాధకుడిలోని హీనగుణాలతో, అసురగుణాలతో మాత పోరాడవలసి వస్తుంది. నీ సాధనను ప్రమాదాలనుంచి, అవరోధాలనుంచి మాత రక్షిస్తుంది. మొదటి మూడు రోజులు నీలోని మాలిన్యాన్ని నాశనం చేయడానికి, నీ మనస్సులోని చెడువాసనలను నిర్మూలించడానికి శక్తి స్వరూపిణి అయిన #దుర్గా మాత ఆరాధన జరుగుతుంది.
శమీవృక్షం పాపాన్ని పరిహరిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కాపాడింది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. పరమ శివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధి ప్రదాత వినాయకుడికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. అంతేకాదు, జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే పూర్వం యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారట. ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని దాగి ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది.
విజయదశమి రోజే రోజే రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణానికి వెళ్లిన అర్జునుడు విజయంతో తిరిగొస్తాడు. అందుకే విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.
పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించినపుడు తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టుమీద దాచి విరాటరాజు కొలువుకు చేరతారు. అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీ వృక్షాన్ని చేరి పూజించి, తాము దాచి ఉంచిన ధనస్సు, బాణాలనూ ధరించి శత్రువులతో యుద్ధం చేస్తాడు. విజయం సాధిస్తాడు. ఈ కారణంగానే శమీ వృక్షపూజ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు విజయదశమి రోజున ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెబుతారు.
దుర్గాదేవి_ఆరాధన_దుర్గుణాల_నిర్మూలన
మొదటి మూడు రోజులు : దుర్గాదేవి ఆరాధన
దుర్గాపూజ సాధనలో దృఢ సంకల్పం, నిశ్చయాత్మకమైన ప్రయత్నం, కఠినమైన శ్రమ అంతర్లీనమై ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే బలం, అనంతమైన శక్తి అతి ప్రధానమైన ఆవశ్యకతలు. బ్రహ్మం పరమ శక్తి అయిన దివ్యమాత ఆ సాధకుడిద్వారా పనిచేయాలి. మొదటి మూడు రోజులు ఈ 'అమ్మ'ను శక్తి, బలానికి ప్రతిరూపమైన దుర్గాదేవిగా పూజిస్తారు. తమలోని మాలిన్యాలు, దుష్టగుణాలు, లోపాలను నిర్మూలించమని దుర్గామాతను ప్రార్థిస్తారు. సాధకుడిలోని హీనగుణాలతో, అసురగుణాలతో మాత పోరాడవలసి వస్తుంది. నీ సాధనను ప్రమాదాలనుంచి, అవరోధాలనుంచి మాత రక్షిస్తుంది. మొదటి మూడు రోజులు నీలోని మాలిన్యాన్ని నాశనం చేయడానికి, నీ మనస్సులోని చెడువాసనలను నిర్మూలించడానికి శక్తి స్వరూపిణి అయిన #దుర్గా మాత ఆరాధన జరుగుతుంది.







No comments:
Post a Comment