ఇప్పటి కాలంలో ఇప్పటి సామాజిక పరిస్థితులని చూస్తూ ఉంటే మన సనాతన ధర్మానికి మనుగడ ఉందా? అనేటువంటి ఆశంక కలుగుతోంది. ఎందుకంటే పరిస్థితులు అంత భీకరంగా ఉన్నాయి. ధర్మ విరోధులైన వారు ప్రబలుతూ ఉన్నారు. ధర్మాన్ని ఆచరించే వారికి రక్షణ కొరవడుతోంది. మరి ఈ పరిస్థితిని మనం అధిగమించేది ఎలా? మన సనాతన ధర్మం ఇప్పటికంటే ఎన్నో విషమ పరిస్థితులను ఎదుర్కొని కూడా తనయొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. అటువంటి అత్యంత బలవత్తరమైన అస్తిభారంతో(ఫౌండేషన్) ఉన్నటువంటిది మన ధర్మం. ఒక కట్టడం యొక్క అస్తిభారం అతి ప్రబలంగా ఉంటే ఆ కట్టడాన్ని ఎవరూ ఏమీ చేయడానికి వీలు ఉండదో అదే విధంగా మన ధర్మం వేదంలో ప్రతిపాదితమైన ధర్మం. అందుకే దీనిని వైదిక ధర్మం అని మనం చెప్తూ ఉన్నాము. దీని మూలం వేదములు. ఈశ్వరునితో ఉపదేశించబడినటువంటి వేదములందు ప్రతిపాదించబడిన ధర్మం కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పటి భాషలో చెప్పాలంటే టెన్షన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నది కానీ ఈ ధర్మం లోపిస్తుందా? అనే భావన మనకి అనవసరం. ఎందుకు అంటే ఈ ధర్మానికి పెట్టని గోడలలాగా ఉన్నాయి మన దేవాలయాలు. ఒక్క ఆంద్ర దేశంలోనే 36,౦౦౦ దేవాలయాలున్నాయి. మొత్తం భారతంలో లక్షలకు లక్షలు ఉన్నాయి. ఇవి మన ధర్మానికి ఆధార భూతమైనవి. వైదేశికుల ఆక్రమణ, మతాంతరం అని కొంతమంది, మనయొక్క ధర్మాన్ని వికృతంగా ప్రతిపాదిస్తున్నారు కొంతమంది అని, అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కూడా తిరుపతికి, శబరిమలకి వెళ్ళే యాత్రికుల సంఖ్య ఏమాత్రం తక్కువైందా?? మీరు చేసే విపరీతమైన వ్యాఖ్యానాలు కానీ ఈ వైదేశికుల దౌష్ట్యం కానీ ఈ యాత్రీకుల మీద ఏమైనా పరిణామం చేసిందా? ఇవ్వాళ కాలేదు ఇకముందు కాబోదు. వాళ్ళు కేవలం తమ జిహ్వాచాపల్యం తీర్చుకోవడానికి మన ధర్మాన్ని వికృతం చేసి మాట్లాడి ఉండవచ్చు. అంతమాత్రంతో మనధర్మాన్ని అనాది పరంపరగా అనుష్టిస్తూ ఉన్న వాళ్ళ మనస్సులను వాళ్ళు మారుస్తారు అని మనం ఎన్నడూ మనం అనుకోవక్కరలేదు. తిరుపతిలో ఉండే వేంకటేశ్వరుడు, కాశీలో ఉండే విస్వనాధుడు, ఈవిధంగా భగవంతుడు ఎక్కడెక్కడైతే తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడో ఆ ప్రదేశములన్నీ ఎన్నివేల సంవత్సరాలైనా మనయొక్క శ్రద్ధా కేంద్రములుగా ఉండనే ఉంటాయి..దానిలో సందేహించనవసరం లేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం అర్ధం చేసుకోవాలి. ధర్మం నశించి పోతున్నది, ధర్మాచరణ చేసేవారు తక్కువై పోతున్నారు అని అనేకమంది ఒక్క మాట అంటున్నారు. ఈ ధర్మాచరణలో తానుకూడా ఒకడిని అని మరుస్తున్నారు. ఈ చెప్పేవాళ్ళు నేను సరిగా ధర్మాచరణ చేస్తున్నానా లేదా అని ఒక ప్రశ్న చేసుకోవాలి? ఇంకొకడి విషయం మీకు అనవసరం. మీరు కనీసం త్రికాలసంధ్యావందనం చేస్తున్నారా? పరిశేచన మంత్రం మీకు సరిగ్గా వచ్చునా? ఈ ప్రశ్నకు మీరు సరిగా సమాధానం చెప్పండి. ఇతరులను నిలదీసి అడగడానికి ముందు మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తున్నాను ధర్మాచరణ మీరు చేస్తున్నారా? వేదాంతంలో శాస్త్రాన్ని తెలియజెప్పటానికి ఒక దృష్టాంతం చెప్తారు.
ఒక పదిమంది ఒక నది ఆవల ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ ఏదో పని చూసుకొని రావలసిందిగా గురువుగారి ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు? నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా. ఒక తండ్రి గారు కొడుకుకి ఉపనయనం చేశాడు. తరువాత నాలుగు సం!!లకు తండ్రిగారి స్నేహితుడు వచ్చాడు వారి ఇంటికి. పిల్లవాడిని ఇలా అన్నాడట. ఉపనయనం అయిందట కదా. ప్రవర చెప్పు అని. చెప్పలేకపోయాడు పిల్లవాడు. వచ్చిన పెద్దమనిషి తండ్రిని కాస్త మీరు అందించండి అని. అప్పుడు ఆ తండ్రి మీరు తమాషా చేస్తున్నారు..నాలుగేళ్ల క్రిందట ఒడుగు చేసుకున్న వాడే మర్చిపోయాడు. నాకు ఒడుగై నలభై ఏళ్ళు అయింది నన్ను చెప్పమంటే ఎలా చెప్తాను అన్నాడు.
న మే పార్థాస్తి కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన!
నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి!!
యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!!
ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్
సంకరస్య చ కర్తా సాముపహన్యామిమాః ప్రజాః!!
నాయనా! చేయాల్సిందీ పొందాల్సిందీ నాకు ఏదీ లేదు. కానీ నా కర్తవ్యాన్ని నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను చేయకపోతే మిగతా ఎవరూ చేయరు. నేను చేయలేదని మిగిలిన వారు మానేశారంటే వాళ్లకి చాలా అనర్ధం జరుగుతుంది. వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి నేను చేస్తున్నాను. లేకపోతే కర్మభ్రష్టులై వారు నరకానికి పోవలసి ఉంటుంది.భగవంతుడే ఎప్పుడైతే ఈమాట చెప్పాడో సామాన్యులమైన మనబోటి గాళ్ళం ఎదుటివాడికి చెప్పడానికి అధికారం ఎక్కడ వస్తుంది? "స్వయం తీర్ణః పరాం స్తారయతి" అన్నారు పెద్దలు. నువ్వు ఒడ్డుకు చేరి ఇంకొకరిని చేర్చు. మన స్వధర్మాన్ని మనం పరిపాలించాలి అని భావన కలిగి ఉండి ఇతరులకి చెప్పాలి.విదేశీయుల పరిపాలనలో వందలాది స౦!! మనం ఉన్నాం. అయినప్పటికీ మన ధర్మానికి ఏమైనా అయిందా? అప్పట్లో ఉన్నంత మంది వేదపండితులు ఇవ్వాళ లేరు. అది శోచనీయం. అప్పట్లో లేనివి ఇప్పట్లో ఉండి మనల్ని చెడగొడుతున్నవి టివిలు, సినిమాలు. యువత మనసులో విపరీత పరిణామములు అవుతున్నాయి. వాళ్ళను కుసంస్కారులను చేస్తున్నాయి. దీని అరికట్టడానికి మన పాఠ్యప్రణాళికలో మన సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు ఉండాలి. ఇదివరలో రామాయణం, భారతం, నీతిచంద్రిక, పంచతంత్రం నుంచి పాఠ్యా౦శాలు ఉండేవి. ఇప్పుడు అవి అసలు కనపడవు. అలాంటప్పుడు సంస్కృతి, ధర్మం తెలుసుకోవడం ఎలా? సంస్కృతి ధర్మం గురుంచి తెలుసుకునే అవకాశం మనం కల్పించాలి. ప్రసార మాధ్యమాలలో అశ్లీల దృశ్యాలను కానీ, ఆభాసమైన ప్రసంగాలను కానీ రాకుండా చేయాలి. పాఠ్య పుస్తకాలలో సంస్కృతిని ప్రతిబింబించే పాఠాలను చేర్చాలి. అటువంటప్పుడు వైదేశిక శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. అపవ్యాఖ్యానాల వల్ల ఏవిధమైన పరిణామం కాదు. యువకులు ధార్మికులుగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీ భారతీ తీర్థ మాహ స్వామి.జయ హనుమాన్ జ్ణాన గుణ సాగర్ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు జాంబవంతుడు ఎందుకో చదవండి........
జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.
సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు – మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని “అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?” అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు.
“హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది” అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు.
రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు.
ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు.
ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు.
ఒక పదిమంది ఒక నది ఆవల ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ ఏదో పని చూసుకొని రావలసిందిగా గురువుగారి ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు? నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా. ఒక తండ్రి గారు కొడుకుకి ఉపనయనం చేశాడు. తరువాత నాలుగు సం!!లకు తండ్రిగారి స్నేహితుడు వచ్చాడు వారి ఇంటికి. పిల్లవాడిని ఇలా అన్నాడట. ఉపనయనం అయిందట కదా. ప్రవర చెప్పు అని. చెప్పలేకపోయాడు పిల్లవాడు. వచ్చిన పెద్దమనిషి తండ్రిని కాస్త మీరు అందించండి అని. అప్పుడు ఆ తండ్రి మీరు తమాషా చేస్తున్నారు..నాలుగేళ్ల క్రిందట ఒడుగు చేసుకున్న వాడే మర్చిపోయాడు. నాకు ఒడుగై నలభై ఏళ్ళు అయింది నన్ను చెప్పమంటే ఎలా చెప్తాను అన్నాడు.
న మే పార్థాస్తి కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన!
నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి!!
యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!!
ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్
సంకరస్య చ కర్తా సాముపహన్యామిమాః ప్రజాః!!
నాయనా! చేయాల్సిందీ పొందాల్సిందీ నాకు ఏదీ లేదు. కానీ నా కర్తవ్యాన్ని నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను చేయకపోతే మిగతా ఎవరూ చేయరు. నేను చేయలేదని మిగిలిన వారు మానేశారంటే వాళ్లకి చాలా అనర్ధం జరుగుతుంది. వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి నేను చేస్తున్నాను. లేకపోతే కర్మభ్రష్టులై వారు నరకానికి పోవలసి ఉంటుంది.భగవంతుడే ఎప్పుడైతే ఈమాట చెప్పాడో సామాన్యులమైన మనబోటి గాళ్ళం ఎదుటివాడికి చెప్పడానికి అధికారం ఎక్కడ వస్తుంది? "స్వయం తీర్ణః పరాం స్తారయతి" అన్నారు పెద్దలు. నువ్వు ఒడ్డుకు చేరి ఇంకొకరిని చేర్చు. మన స్వధర్మాన్ని మనం పరిపాలించాలి అని భావన కలిగి ఉండి ఇతరులకి చెప్పాలి.విదేశీయుల పరిపాలనలో వందలాది స౦!! మనం ఉన్నాం. అయినప్పటికీ మన ధర్మానికి ఏమైనా అయిందా? అప్పట్లో ఉన్నంత మంది వేదపండితులు ఇవ్వాళ లేరు. అది శోచనీయం. అప్పట్లో లేనివి ఇప్పట్లో ఉండి మనల్ని చెడగొడుతున్నవి టివిలు, సినిమాలు. యువత మనసులో విపరీత పరిణామములు అవుతున్నాయి. వాళ్ళను కుసంస్కారులను చేస్తున్నాయి. దీని అరికట్టడానికి మన పాఠ్యప్రణాళికలో మన సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు ఉండాలి. ఇదివరలో రామాయణం, భారతం, నీతిచంద్రిక, పంచతంత్రం నుంచి పాఠ్యా౦శాలు ఉండేవి. ఇప్పుడు అవి అసలు కనపడవు. అలాంటప్పుడు సంస్కృతి, ధర్మం తెలుసుకోవడం ఎలా? సంస్కృతి ధర్మం గురుంచి తెలుసుకునే అవకాశం మనం కల్పించాలి. ప్రసార మాధ్యమాలలో అశ్లీల దృశ్యాలను కానీ, ఆభాసమైన ప్రసంగాలను కానీ రాకుండా చేయాలి. పాఠ్య పుస్తకాలలో సంస్కృతిని ప్రతిబింబించే పాఠాలను చేర్చాలి. అటువంటప్పుడు వైదేశిక శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. అపవ్యాఖ్యానాల వల్ల ఏవిధమైన పరిణామం కాదు. యువకులు ధార్మికులుగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీ భారతీ తీర్థ మాహ స్వామి.జయ హనుమాన్ జ్ణాన గుణ సాగర్ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు జాంబవంతుడు ఎందుకో చదవండి........
జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.
సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు – మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని “అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?” అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు.
“హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది” అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు.
రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు.
ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు.
ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు.
No comments:
Post a Comment