బాలాస్తుతి.. ~ దైవదర్శనం

బాలాస్తుతి..

*ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ* *ఆదిశక్తీ పరాయీ*
*మాయా మాయా స్వరూపీ స్ఫతికమణిమయీ* *మాతంగీ షడంగీ*
*జ్ఞానీ జ్ఞానస్వరూపీ* *నళినపరిమళీ నాద ఓంకార యోగీ*
*యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే ||*

*బాలా మన్త్రే కతాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ*
*వ్యాళీ యజ్ఞోపవీతే వికత కటి తటీ*
*వీరశక్తీ ప్రసాదీ*
*బాలే బాలేన్దుమౌళే* *మదగజభుజహస్తాభిషేక్త్రీ స్బతన్త్రీ*
*కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే ||*

*మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ*
*హారాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా*
*వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ* *వీరతన్త్రీ భవానీ*
*శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే ||*

*ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా* *చేష్టితాయా*
*శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర* *కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే*
*హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే* *హిమకరకిరణా భాసమానేన్దుచూడే*
*క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే ||*


త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.

అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. 

షొడశ విద్యకు ఈమే అధిష్ఠాన దేవత  కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.  అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము.

త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి  అయ్య వారు ఎమో  త్రిపురాంతకుడు  ఆది దంపతులు  వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని ముాడు అవస్తలు  జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత!

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని  అనుభవింపచేస్తు బాలగా.అమ్మవారు వినోదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేెవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.

అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది  ఆవిడ ఆత్మ  స్వరూపురాలు  ఆవిడను పూజిస్తే  ఙ్ఞ్నానము కలిగి   తానె శివ స్వరూపము తో  చైతన్యము ప్రసాదించి  మోక్షమునకు  అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

 బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా సహస్రంలో కూడా మనకు వస్తున్నది. భండాసురునియొక్క పుత్రులు ముప్ఫైమంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు. ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన భండ పుత్రులు. వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లియొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువలేదు. బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాసనిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరీ మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీవిద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్యేకవిద్యగా కూడా చాలామందిచేత ఆరాధింపబడుతోంది. ఈరోజు బాలా మహా త్రిపురసుందరీ రూపంగా ఈ రోజు చేసి ఇక్కడనుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం. బాలా భావనతో కుమారీ పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండీ ఒక్కరోజు ఒక్కసారి పూజచేస్తే చాలు కదా! తొమ్మిది రోజులు చేయాలా? అంటే చేయాలిట. బాల పూజ తొమ్మిదిరోజులూ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది.

మొదటిరోజు బాల పూజా ఫలితం – “శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై” అన్నారు. – శతృనాశనము, ధనాన్ని, ఆయుష్షునీ, బలాన్ని వృద్ధి చేయడం అనేది మొదటిరోజు చేసే కుమారీపూజ యొక్క ఫలం.

*శ్రీ బాలా త్రిపురసుందరీ*
*ధ్యాన శ్లోకం;*

అరుణకిరణ జాలైః అంచితావకాశా
విధృత జపపటీనా పుస్తకాభీతి హస్తా
ఇతర కర వరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థా
నివసతుహృది బాలా నిత్య కళ్యాణ శీలా
(ఎర్రని కిరణాలను వెదజల్లుతూ..జప మాల, పుస్తకము, వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ..విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి నిత్యమూ నా హృదయమునందు ఉండుగాక)

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే
కామేశ్వర్యై చ ధీమహి

తన్నోబాలా ప్రచోదయాత్ ||

లోకా సమస్తా సుఖినో భవంతు!!
సర్వే జనాః సుఖినో భవంతు!!
సమస్తా సన్మంగళానీ
భవంతు!!
ఓం శాంతిః  శాంతిః  శాంతిః...
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List