సీతారామ పట్టాభిషేకం ఉన్న చిత్ర పటాన్ని శ్రద్ధగా పూజించిన తరువాత ఈ కింది మంత్రం పారాయణం చేయాలి. ~ దైవదర్శనం

సీతారామ పట్టాభిషేకం ఉన్న చిత్ర పటాన్ని శ్రద్ధగా పూజించిన తరువాత ఈ కింది మంత్రం పారాయణం చేయాలి.

( కనీసం 9    అధికంగా 108 )
1. జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః
దాసోహం కొసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాo నిహంతా మారుతాత్మజః

2. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః
అర్థయిత్వా పురీo లంకా మభివాద్య చ మైథిలీo
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాo సర్వరక్షసామ్.

“యాని కానిచ పాపాని బ్రహ్మ హత్యా సమానిచ
తాని తాని వినశ్యంతి ప్రదిక్షిణ పదే పదే”

అని అనుసంధానము (చెప్పుకొనుచూ) చేస్తూ మూడు పర్యాయములు, తన చుట్టూ, తను తిరుగుచూ నమస్కరించాలి.

“మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర!
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అపరాధ సహస్రాణి క్రియoతే అహర్నిశం మయా
దాసోయo ఇతి మాం మత్వాక్షమస్వ పురుషోత్తమ!!”

అని నమస్కారము చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించవలయును.
తీర్థము తీసుకొను నపుడు
“అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప
క్షయ కరo శ్రీ భగవత్ పాదోదకం పావనం శుభమ్”
అని మూడుపర్యాయములు చెప్పుకొనుచూ తీర్థము స్వీకరించవలయును.
తీర్థము తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై తుడుచుకొనుటగానీ, తలపై త్రిప్పుటగానీ చేయరాదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List