విశేష యాత్రలు:..
ఏ ఆలయానికి వెళ్ళినా ముందు శిఖర దర్శనం చేయాలి .తర్వాత ధ్వజ స్తంభం ,స్వామి వాహన దర్శనం చేయాలి .వారి అనుజ్న తో మూల విరాట్ దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతా అమ్మ వారి దర్శనం ఇతర దేవతా దర్శనం చేయాలి .గంగా స్నానం చేసిన వారు గంగ నీటిని ఇంటికి తీసుకొని వెళ్ళ వచ్చు .కాని గంగ మట్టిని మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళరాదు అని శాస్త్రం చెబుతోంది ..కాశీ మహాష్మశానం కనుక ఆ మట్టి నిషిద్ధం అయి ఉంటుంది .మణి కర్ణిక ఘాట్ కో రోజు మధ్యాహ్నం 12-1గంటల మధ్య విధిగా స్నానం చేయాలి ఆ సమయం లో సకల దేవతలు ఆ ఘాట్ లో ఉంటారని పురాణ వచనం .పితృకార్యం చేసే టప్పుడు శిరో మున్దనం మగ వారికి తప్పని సరి .ప్రయాగ క్షేత్రం లో ముత్తైదువులు మాత్రమె వేణీ దానం చేయాలి అంటే ఒక్క మూడంగులాల జుట్టు మాత్రమె తీయించు కోవాలి .ఎన్ని సార్లు వెళ్ళినా ఒక్క సరి మాత్రమె వేణీ దానం చేయాలి .అన్ని సార్లు చేయ రాదు .
ఆయతన యాత్ర:..
నంది పురాణం లో ఈ యాత్ర గురించి ఉంది.మణి కర్ణిక లో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి పూజించాలి మళ్ళీ మణికర్ణిక లోనే ఉన్న చక్ర తీర్ధం లో అంటే మణి కర్ణికా కుండం లో స్నానం చేయాలి .మళ్ళీ విశ్వనాధ దర్శనం చేయటాన్ని ఆయతన యాత్ర అంటారు ఇలా చేస్తే బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది .ద్వి ఆయతన ప్రాప్తి అంటే పైన చెప్పినవి రెండేసి సార్లు చెయ్యటమే
త్రిరాయతన,చతురాయతన ,పంచాయతన యాత్ర:..
అవి ముక్తేశ్వర ,స్వర్లీనేశ్వర ,మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి పూజించటమే ఈ యాత్ర .శైలేశ్వర ,సంగమేశ్వర ,స్వర్లీనేశ్వర మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించటమే అది ఈ రెండు యాత్రాల్ని లింగ పురాణం చెప్పింది .కృత్తి వాశేశ్వర మధ్యమేశ్వర ,ఓంకారేశ్వర ,కపర్దీశ్వర ,విశ్వేశ్వర లింగ దర్శనమే పంచాయతన యాత్ర .ఈ యాత్రాలన్నీ సర్వ సిద్ధి ప్రదం .
రుతు యాత్ర:..
వసంత రుతువు అంటే చైత్ర వైశాఖ మాసాలలో చౌక్ ఘాట్ లో ఉన్న మధురా పురి యాత్ర చేయాలి దీన్నే అలయర్ పురా అంటారు .ఇది ఉత్తరార్క్ నుండి వరుణా తీరం మార్గం లో ఉంది
గ్రీష్మ రుతువు లో అంటే జ్యేష్ట ,ఆషాఢ మాసాలలో అయోధ్యా పూరీ యాత్ర చేయాలి పంచ క్రోశ యాత్రలో కని పించే రామేశ్వరమే ఇది
వర్ష రుతువు లో అంటే శ్రావణ ,భాద్ర పద మాసాలలో సంఖూ దారా వద్ద ఉన్న ద్వారకా పూరీ యాత్ర చేయాలి
శరదృతువు –లో అంటే ఆశ్వయుజ కార్తిక మాసాలలో –పంచ గంగా ప్రాంతం లోనీ పంచ గంగా స్నానం చేయటాన్ని కాంచీ పూరీ యాత్ర అంటారు
హేమంత రుతువు అంటే మార్గ శిర ,పుష్య మాసాలలో అవంతికా పుర యాత్ర చేయాలి .ఇది వృద్ధ కాళేశ్వరం నుండి కృత్తి వాసేశ్వరుని వరకు ప్రయాణం చేసి దర్శించటమే .
శిశిర రుతువు –అంటే మాఘ ఫాల్గుణ మాసాలలో మాయా పూరీ యాత్ర చేయాలి ఇది అస్సీ సంగమం లో ఉంది
చివరలో లలితా ఘాట్ లో స్నానం అంటే ఒకే ఏడాది లో ఈ రుతు దర్శనాన్ని ముగించాలి దీనికే ‘’సప్తరి యాత్ర ‘’అని కూడా అంటారు
మాస యాత్ర:..
చైత్రమాసం లో కామకుండం లో స్నానించి కామేశ్వర పూజ చేయాలి ఇప్పుడిది లేదు వైశాఖం లో విమలకుండస్నానం విమలేశ్వర పూజా .ఇదీ ఇప్పుడు అలభ్యం .జ్యేష్టం లో రుద్రా వాస తీర్ధ స్నానం రుద్రా వాసేశ్వర పూజ ,రుద్రా వాసేశ్వరుడిని దశాశ్వ మేధ ఘాట్ లో దర్శించ వచ్చు .ఈ మూడు నెలల్లో ముప్పది మూడు కోట్ల దేవతలు స్నానం చేశారని పురాణ లిఖితం ఆషాఢంలో లక్ష్మీ కుండ స్నానం లక్ష్మీ దేవి దర్శనం గంధర్వులు పడదే పదే చేసే యాత్ర ఇది .శ్రావణం లో కామాక్షీ కుండస్నానం కామాక్షీ దేవి దర్శనం .భాద్ర పదం లో కపాల విమోచన తీర్ధ స్నానం కుల స్తంభ దర్శనం .ఇది కిన్నరులు ఎక్కువ గా ఇష్టపడే యాత్ర .ఆశ్వయుజ మాసం లో మార్కండేయ తీర్ధ స్నానం మార్కండేయేశ్వర దర్శనం .జ్ఞాన వాపి దగ్గర ఉంది .కార్తీకం లో పంచ గంగా ఘాట్ స్నానం బిందు మాధవ దర్శనం .మార్గ శిరం లో పిశాచ విమోచన తీర్ధ స్నానం కపర్దీశ్వర స్వామి దర్శనం .విద్యాధరులకీ యాత్ర మహా ప్రీతీ .పుష్యం లో దనద కుండస్నానం ధనదేశ్వర దర్శనం దేవతలకు ఇష్టమైన యాత్ర ఇది ఇప్పుడీ కుండం లేదు ధనదేశ్వరుడు అన్నపూర్ణా మందిరం లో ఒక మూల ఉంటాడు .మాఘం లో కోటి తీర్ధ స్నానం కోటీశ్వర స్వామి సందర్శనం ఈ తీర్ధం గుప్తం .సాఖీ వినాయక స్తానం లో ఉందని అంటారు ఫాల్గుణ మాసం లో గోకర్ణం లో స్నానం గోకర్నేశ్వర స్వామి దర్శనం చేస్తే మాస యాత్ర పూర్తీ అయి నట్లే .
మరి కొన్ని విశేషాలు:..
జ్యేష్ట శుక్ల పక్షం లో దశాశ్వ మేధ ఘాట్ లో స్నానం విశేష ఫలం ఇస్తుంది .శ్రావణం లో శుక్ల పక్షం పది హేను రోజుల్లో దుర్గా కుండా స్నానం దుర్గా దేవి దర్శనం విశేషం .ఆశ్వయుజం లో కృష్ణ పక్షం లో గంగాజీ ఘాట్ లో తర్పణ శ్రాద్ధాలు విశేష ఫలితాలనిస్తాయి .కార్తీకం లో పూర్ణిమ వరకు ఆది మంగళ వారాలు కాక మిగిలిన రోజుల్లో కాశి లో ఉసిరి చెట్టు ను పూజించాలి .దానాలు భోజనాలు శ్రేష్టం .మాఘం లో శుక్ల పక్షం లో వ్యాస పురిలోని వేద వ్యాస ;లింగ దర్శనం అతి ముఖ్యం .భాద్ర పదం లో కృష్ణ పక్షం లో దశాశ్వ మేధ ఘాట్ లో పిండ ప్రదానం ,తర్పణాలు విశేష ఫలప్రదం.
No comments:
Post a Comment